రాజకీయాలలో ఐటెం గర్ల్!

Publish Date:Jan 22, 2014

Advertisement

 

సినిమాలలో ఐటెం గర్ల్స్ ను చూసాము. చివరికి క్రికెట్ వంటి ఆటలలో చీర్ గర్ల్స్ ని కూడా చూసాము కానీ, రాజకీయాలలో ఐటెం గర్ల్స్ ని ఎన్నడూ చూసి ఉండము. రాజకీయాలలో ఆమాద్మీ పార్టీ ఒక ఐటెం గర్ల్ వంటిదని ప్రముఖ రచయిత, ఆమాద్మీ పార్టీ మద్దతుదారుడయిన చేతన్ భగత్ వ్యాఖ్యానించడం విశేషం.

 

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సినిమా ఆఫర్లు దొరకని హీరోయిన్లు ఏవిధంగా ఐటెం గర్ల్స్ గా మారిపోతారో అదేవిధంగా ప్రభుత్వం నడపడం చేతకాని ఆమాద్మీ పార్టీ కూడా రాజకీయాలలో ఒక ఐటెం గర్ల్ గా మారిపోయిందిప్పుడు. సాక్షాత డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వం వహించి నడిరోడ్డు మీద రెండు రోజులు ధర్నా చేయడాన్ని చూసి నేను చాలా సిగ్గుపడుతున్నాను. రానున్నఎన్నికలలో ఆమాద్మీ పార్టీ దేశవ్యాప్తంగా పోటీచేయబోతున్నందున దేశప్రజల దృష్టిని ఆకర్షించాలనే ప్రయత్నంలో ధర్నాకు కూర్చోవడం సిగ్గుచేటు,” అని అన్నారు.

 

దేశంలో తక్కువ ధర ప్లేన్ టికెట్స్ పరిచయం చేసిన గోపీనాథ్ ఆమాద్మీ పార్టీలో సభ్యుడు కూడా. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈవిధంగా నడిరోడ్డు మీద ధర్నాలు చేయడం ఏవిదమయిన సంకేతాలు పంపిస్తుంది? సమస్యలుంటే వాటిని తన కార్యాలయంలో కూర్చొని పరిష్కరించాలి తప్ప ఇలా నడిరోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేయడం, ప్రజలకి ఇబ్బందులు కలిగించడం సరయిన పద్ధతి కాదు,” అని అన్నారు.

 

ఒకప్పుడు ఆయనతో కలిసి పనిచేసిన మాజీ పోలీసు అధికారిణి కిరణ్ బేడీ మరో అడుగు ముందుకు వేసి, “పరిపాలించలేని ఆమాద్మీ ప్రభుత్వాన్ని వెంటనే డిస్మిస్ చేయాలని కేంద్రాన్ని కోరారు.”

 

అపూర్వమయిన ప్రజాధారణతో ప్రభుత్వ పగ్గాలు చెప్పటిన ఆమాద్మీ పార్టీపై దేశ వ్యాప్తంగా ప్రజలు చాలా ఆశలు పెట్టుకొన్నారు. అదేవిధంగా ఆమాద్మీ పార్టీ కూడా ప్రజలకు అనేక ఆశలు రేపింది. బహుశః ఈ మూడు వారాల పాలనలోనే అవన్నీఆచరణ సాధ్యం కావని గ్రహించిందో లేక తన పరిమితులు గ్రహించడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఈవిధమయిన చవకబారు ఎత్తుగడలతో కాలక్షేపం చేస్తోందో కానీ మొత్తం మీద, కేవలం మూడు వారాలలోనే ఆమాద్మీ తన పరువు పోగొట్టుకొంది.

 

వచ్చే ఎన్నికలలో దేశంలో అన్ని రాష్ట్రాలలో వీలయినన్ని ఎక్కువ యంపీ స్థానాలకు పోటీ చేస్తానని ప్రకటించిన ఆమాద్మీ ఈ ధర్నాతో ఇతర రాష్ట్ర ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేయబోతే అది కాస్తా బెడిసికొట్టి పార్టీ ప్రతిష్టను మంటగలపడం వలన తన అవకాశాలను తానే స్వయంగా పాడుచేసుకొన్నట్లయింది. ప్రజల సమస్యలు తీర్చుతుందని ఆమాద్మీని ఎన్నుకొంటే ఇప్పుడు అదే ప్రజలకు సమస్యగా మారడం విచిత్రం.

 

ఆమాద్మీ వైఫల్యం కాంగ్రెస్. బీజేపీలకు వచ్చేఎన్నికలలో వరంగా మారవచ్చును. అటువంటి పార్టీలకు ఓట్లు వేస్తే ఏవిధంగా వృధా అవుతాయో అవి కధలుకధలుగా చెప్పి, ప్రజలను తమ వైపుకి త్రిప్పుకోవచ్చును. అందువల్ల ఆమాద్మీ ఇప్పటికయినా మేల్కొని మిగిలిన కొద్దిపాటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని, తన హామీలను అమలుచేయలేకపోయినా, కనీసం డిల్లీలో చక్కని పాలన అందించే ప్రయత్నం చేసినా ఉన్నఆ పరువయినా మిగులుతుంది. లేకుంటే, వచ్చే ఎన్నికల తరువాత ఆమాద్మీ నామరూపాలు లేకుండా మయమయిపోవడం తధ్యం.

By
en-us Political News

  
సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.