ఉత్తరా(మా)యణం

Publish Date:Jan 23, 2014

Advertisement

 

 

.......కె. శివరామకృష్ణ

 

 

రాశాను ప్రేమలేఖలెన్నో... దశాను ఆశలెన్నో.. అంటూ ప్రణయ గీతం వినపడాలే కానీ కాలం యవనంలోకి తొంగి చూడని వారు ఉండరు! ఇప్పుడైతే.. చేశాను ఎస్ఎంఎస్ లెన్నో.. పంపాను ఊసులెన్నో' అంటూ ఈ తరం నాయకానాయికలు ' లవ్ ' చిందులేస్తారు. 'సెల్' కాలమొచ్చి నిద్రలేచావా' అంటూ మేల్కొలుపులు, సుప్రబాతం పలికి.. మంచిగా నిద్రపో' అంటూ పవళింపు సేవవరకు ఎప్పటికప్పుడు 'సొల్లు' తున్నారు కానీ.. ఇంతకుమునుపైతే.. అన్నింటికీ లేఖలతోనే రాయభారం నడిచేది చివరకు రాజకీయాల్లో నిర్ణయాలు, ప్రతిస్పందనలు కూడా లేఖల్లోనే బట్వాడా. అప్పట్లో.. రాజకీయ ప్రేమలేఖలు వెలుగు చూడడానికి నాలుగైదు రోజులు పట్టేది. ఎవరో ఒక లీకువీరుడు ఉప్పదించేదాక తాజా కబురు బయకి పొక్కెది కాదు. రాజకీయం స్పీడ్ పెరిగాక. అక్కడ లేఖ రాయడం ఇక్కడ లీకు చేయడం అంతా అరగంటకో వార్త బులిటెన్ సాక్షిగా బహిరంగ రహస్యమవుతుంది ! రాజకీయం ముదురు పాకాన పడే కొద్ది లేఖల్లో అక్షరాలు ఆయుధాలుగా మారతాయి ! ఈ అక్షరాలే శిలాఘాతాలై రాస్తాల్ని విభజించే పాశుపతాస్త్రాల అవుతాయనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్ష ఉదాహరణ. యూపీఎ నిర్ణయానికి ఆధారమైన కాంగ్రెస్ వర్కింగ్ పార్టీలన్నీ లేఖలు ఇచ్చాకనే మేం నిర్ణయం తీసుకున్నాం. అని ! భాషాప్రయుక్త రాష్ట్రాన్ని విడగొట్టే సత్తా అక్షరానికి ఉందా.. అనుమానం ఉంటె ఏ కాంగ్రెస్ కామందుడినడిగినా ఎదే చెబుతాడు.

 

విభజన లేఖలు, సమన్యాయం లేఖలు, రాజ్యాంగాన్ని కాపాడాలని ఆక్రోశించే లేఖలు. అఫిడవిట్లతో  లేఖలు, బహిరంగ లేఖలు అన్నీఇన్నని కాదులే! ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అన్నట్టుగా బోలెడు లేఖలు, కానీ ప్రేమలేఖల మతలబే  వేరు! ప్రేయసికైనా శ్రీమతికైనా లేదా శ్రీవరికైనా రాసే లేఖలో ప్రియాఅన్న పిలుపు నుంచి ఇట్లు నీ ప్రియసఖి /సఖుడు' అనేంతవరకు ప్రతి అక్షరం ప్రేమపాశమే. వరసమారితే ఈ ప్రేమదాసులే దేవదాసులన్నది వైన్షాపులకెరుక!

ఆరోపణలు, రాజీనామాలతో లేఖలు రాసే రాజకీయ గోవిందయ్యలు కూడా ఈ  మధ్య ప్రేమలేఖలని పలవరిస్తున్నారు! షోకాజ్ల్ని, రాజీనామాల్ని ప్రేమిస్తున్నారు! విభజన నిర్ణయానికి సీమాంధ్రలో కాంగ్రెస్ చచ్చిపోయిందోచ్' అంటూ ఎదురైనా వారినల్లా గిల్లి మరీ చేబుతున్న జేసి దివాకర్ రెడ్డికి అధిష్టానం షోకాజ్ ఇచింది. పార్టీ పరువు బాగున్నడితే ,ఏమిటప్పా సంగతి ' అంటే అదేదో మా కుటుంబ వ్యవహారం లే అన్నట్టుగా నేతా శ్రీ బదులిచ్చే వారు. 'వేటుకు వేళయరా'  అని కోడై కూసే శికాజ్ కూడా ప్రేమలేఖ గా కనిపించింది. ఈ లెటర్, లో విరసమే ఉంటుందని తెలిసినా లేఖను ప్రేమించడం నేతాగణానికే చెల్లుతుంది. తన శాఖా మార్చాలని అలిగిన శ్రీధర్బాబు ఎడం చేత్తో పమపిన రాజీనామా గురించి సీఎం ను అడిగితె ' ఆ లేఖే కాదు.. చాలా ప్రేమలేఖలు అందుతున్నాయి అంటారు! ఈ లెక్కన ప్రేమలేఖల్ని రాజకీయనాయకులు తెగ ప్రేమించేస్తే ప్రేమికులేమైపోవాలి! వారి ప్రేమాయణం ఏం కావాలి!

మనసుకింత హాయినిచ్చే కబుర్లు మోసుకొచ్చే ఉత్తరం ఇచ్చే పోస్ట్ మ్యానే కరువయ్యాడు! ఎక్కడన్నా.. అడపా దడపా పోస్ట్లు వినిపిస్తున్నాయే కానీ ఇవి తంతి తపాలా కార్యాలయం పోస్ట్లు కావండోయ్! అవన్నీ ట్విట్టర్,పేస్ బుక్, గూగుల్ ప్లస్,ఆర్కూట్ పోస్ట్లు. పోస్ట్లు రెండు కూడా ఊసుల మోపులే కానీ రెండింటికి కొంచం ధర్మబేధముంద.

తపాలా లేఖను చిరునామాదారులే చదువుకుంటారు. ఇంటర్నెట్లో చేసే పోస్ట్ల్ల్ని విశ్వదర్శనం చేయిస్తారు. ఎవరు పోస్ట్ చేసినా మిగిలిన నెట్జీవుల్ని చూస్తాయి. వ్యాఖ్యలు, ప్రతివ్యాఖ్యలతో  పోస్ట్ని కాస్తా కామెంట్ భారతం' చేస్తాయి.  ఎన్నికల ప్రచారంలో నాయకులకు మైలేజీ ఇవ్వడంలోనూ' ఈ పోస్ట్'ల తీరే వేరు. కాంగ్రెస్, బీజెపి నాయకులైన దిగ్విజయ్, మోదీల మధ్య పోట్లా(స్ట్) ట నెటిజన్లను కూడా విభజన చేయడం షరా మామూలే! లక్ష కోట్లపై పేటెంట్ ఉన్న నాయకుడు ' సోనియమ్మను నేను నేను అడుగుతున్నా' అని ప్రశ్నించాగానే నెటిజన్లు కూడా ' నేను అడుగుతున్నా' అంటూ పేరడీ ప్రశ్నలతో పోస్టెత్తించారు. ల్యాండ్ ఫోన్ల పై మొబైల్ లా దాడి పెరిగాక తట్టి తపాలాశాఖ కాస్తా తంతే 'టపాలా శాఖగా' మారింది.  ఆ శాఖ ఉండేదంనట్టుగా  గోడకు వేలాడదీసిన తీగకు  గుది గుచ్చిన ఉత్తరాలే సాక్షి. హైటెక్ కాలంలోనూ ఉత్తరాలేంటి ? అని నొసలు చిట్లించబోయి మౌస్ క్లిక్ చేస్తాం కానీ..! అక్షరానిది అక్షయశక్తి. అక్షరాలను వెతుకుతూ ముందుకు పరిగెత్తే చూపుల వెనుక మనసు ఉరుకెత్తుతుంది. తోచినప్పుడల్లా లేఖాగుచ్చంలోని ఊసుల్ని నెమరవేసుకోవచ్చు. ఈ ముద్రణాలవల్లే 24 గంటల పాటు వార్తా ప్రత్యక్ష ప్రసారాలు చేసే టీవీ చేనెళ్ళు ఎన్ని వచ్చినా పత్రికలు' నెట్' కొస్తున్నాయి. ఏతావాతా ఉత్తరాలు బట్వాడా చేసే తపాలాశాఖ ఇటివలే కలం చేసిన ' టెలిగ్రామ్ ' లాగా టపా కట్టేయకుండా బతికి బట్టకట్టాలని ఉత్తర ప్రియుల ఆరాటం! ఇదంతా ఎందుకంటారా ' 'ఉత్తరామాయణ' కలం గుర్తుకొచ్చి ఉత్తి పుణ్యానికి చెప్పా!

By
en-us Political News

  
సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.