సీదిరి అప్పలరాజుకు బెయిల్..!
Publish Date:Aug 14, 2026
Advertisement
వైసీపీ నేత, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సుదీర్ఘ వాదనల అనంతరం ఇవాళ సోంపేట అడిషనల్ జిల్లా కోర్టు బెయిల్ మంజూరు అయింది. రాజకీయ వేధింపుల కోణంలోనే సెక్షన్లు మార్చి జులై 23 నుండి జైలులోనే ఉంచారని వాదించారు. ఈ నిర్ణయంతో గత కొన్ని వారాలుగా జైలులో ఉన్న సీదిరి అప్పలరాజుకు, ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్సార్సీపీ శ్రేణులకు భారీ ఊరట లభించినట్లయింది. హైకోర్టు బెయిల్ ఉత్తర్వులతో శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. గత జులై 10వ తేదీన జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో దానయ్య అనే గొర్రెల కాపరి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడుపుతున్న వాహనమే ప్రమాదానికి కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ వ్యవహారంలో కుమారుడిని రక్షించేందుకు ప్రమాదానికి సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలను తారుమారు చేశారనే తీవ్ర అభియోగాలపై జులై 23న పోలీసులు మాజీ మంత్రిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. Seediri Appalaraju granted bail, Seediri Appalaraju High Court order, YSRCP Seediri Appalaraju case, Kasibugga accident case update, AP High Court news, Seediri Appalaraju news Telugu
http://www.teluguone.com/news/content/-seediri-appalaraju-granted-bail-36-228936.html





