రైతుల కోసం పాదయాత్ర ప్రకటించిన కేటీఆర్..!

Publish Date:Sep 3, 2026

Advertisement

మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్‌ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!

నాగార్జున సాగర్‌ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాదయాత్రకు పిలుపునిచ్చారు. మిర్యాలగూడలో నిర్వహించిన రైతు ధర్నా వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు. నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ ద్వారా రైతులకు నీటిని విడుదల చేయకపోతే.. వేలాది మంది రైతులతో కలిసి కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేపడతానని కేటీఆర్‌ తెలిపారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో 2003లో రైతుల సమస్యల పరిష్కారం కోసం అప్పటి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. నీటి కోసం అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రైతుల సమస్యల పరిష్కారానికి పోరాడారని చెప్పారు.అదే స్ఫూర్తితో కాంగ్రెస్‌ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తాను కూడా పాదయాత్ర చేపడతానని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

నాగార్జున సాగర్‌లో 180 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ.. ఎడమ కాలువ ద్వారా రైతులకు నీటిని విడుదల చేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. సెప్టెంబర్‌ 14లోపు నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ ద్వారా నీటి విడుదలకు సంబంధించిన స్పష్టమైన షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. లేదంటే వేలాది మంది రైతులతో కలిసి కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేపట్టి.. ప్రభుత్వం నీటిని విడుదల చేసేలా పోరాటం చేస్తామని హెచ్చరించారు.

 

 

(KTR, KTR Padayatra, KTR Farmers Protest, Nagarjuna Sagar, Nagarjuna Sagar Left Canal, Farmers Issues, Telangana Farmers, KTR Warning, BRS, KCR, Kodad, Halia, Miryalaguda, Irrigation Water, Telangana News, Telugu One, Telugu News)

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి
కాంగ్రెస్‌ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!
కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి..!
ఈ తోపులాటలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కింద పడి స్వల్పంగా గాయపడ్డారు.   పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు  వంద మందికి పైగా కార్యకర్తలను, స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
మొత్తం తొమ్మిది ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు   ఫుడ్ సేఫ్టీ అధికారులు,  పోలీసు అధికారుల సమక్షంలో ఏకకాలంలో 19 చోట్ల  తనిఖీలు చేపట్టాయి.
బిర్యానీ తయారీ తయారీలో గడువు ముగిసిన  పదార్థాలను వాడుతున్నారన్న ఫిర్యాదులపై ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించి, ఫిర్యాదులు వాస్తవమేనన్న నిర్ధారణకు వచ్చి సీజ్ చేసినట్లు తెలుస్తోంది. 
తెలంగాణరాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిటైల్ మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు ఒక్కసారిగా మెరుపు దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున కలకలం సృష్టించారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
ఢిల్లీలో వైఎస్సార్ అవార్డ్స్‌ 2026 కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.