సోనూసూద్ కుమారి ఆంటీకి...ఎంత పెట్టినా తక్కువే

 

హీరో అండ్ విలన్ సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల్లో విలన్ గా ఉన్న ఆయన కరోనా టైములో ఎంతోమందికి సాయం చేసి దేవుడయ్యాడు. అలాంటి దేవుడు నిజంగా మన దగ్గరకు ఎవరైనా ఎలా ఫీలవుతారు..మాములుగా ఉండదు..గూస్ బంప్స్ వస్తాయి ఆయన్ని చూస్తేనే . ఇప్పుడు కుమారి ఆంటీ దగ్గరకు వచ్చాడు మనందరి దేవుడు సోనూసూద్. తాజాగా హైదరాబాద్ వచ్చిన సోనూసూద్ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమారి అంటీ ఫుడ్ స్టాల్ కి వెళ్లి ఆమెతో కాసేపు ముచ్చటించాడు. తాను  కుమారి అంటీ గురించి చాలా విన్నానని చెప్పాడు.

ఆమె తనను తాను ఈ స్థాయికి తెచ్చుకుని నిలబడిన వుమెన్ ఎంపవర్మెంట్ కి నిజమైన అర్థం కుమారి అంటి అంటూ కితాబిచ్చారు. ఇక కుమారి ఆంటీ పేరు  సోషల్ మీడియాలో మరో సారి మోతమోగిపోతోంది.  కుటుంబాల కోసం స్త్రీలు ఎంత కష్టపడుతున్నారన్నారు అనడానికి  కుమారి అంటీ రియల్ ఎగ్జాంఫుల్ అని సోనూసూద్ అన్నాడు. కుమారి ఆంటీని చూసి చాలామంది నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయన్నారు. తాను వెజిటేరియన్ తింటానని ప్లేట్ ఎంత అని అడిగితే కుమారి ఆంటీ 80 రూపాయలు అని చెప్పడంతో డిస్కౌంట్ ఎంత  ఇస్తారు అని అడిగారు  సోను సూద్ ... "మీకైతే ఫ్రీ" అని చెప్పింది కుమారి ఆంటీ. అయితే తనకు లాటరీ తగిలిందని  ఫ్రీగా పెడతానంటే రోజు వస్తానని సోనూసూద్ అనడం నిజంగా గొప్ప విషయం. కరోనా టైములో ఎంతోమందికి సాయం చేసిన మీకు ఎంత పెట్టినా తక్కువే అని కితాబిచ్చింది. ఇక సోనూసూద్ కుమారి ఆంటీకి చిరు సత్కారం చేశారు.