విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్
posted on Jul 2, 2024 10:55AM
బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు టోపీ పెట్టి పరారీలో ఉన్న వ్యాపార వేత్త విజయ్ మాల్యాపై ముంబై ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇండియన్ ఓవర్సీ స్ బ్యాంక్కి సంబంధించిన రూ.180 కోట్ల రుణం ఎగవేత కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి నాయక్ నింబాల్కర్ ఈ వారెంట్ జారీ చేశారు. రుణం ఎగవేత కేసులో సీబీ ఐ సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకు న్నామని, అదేవిధంగా విజయమాల్యా పరారీలో ఉన్న వ్యక్తి కావడంతో నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు న్యాయమూ ర్తి పేర్కొన్నారు.
కాగా ఈ కేసు సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూతపడిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కంపెనీ ప్రమో టర్ ఉద్దేశపూర్వకంగానే రుణాన్ని ఎగవేసిందనీ, ప్రభుత్వ అధీనంలోని బ్యాంకుకు ఏకంగా రూ.180 కోట్లకు పైగా మొత్తాన్ని చెల్లించకుండా నష్టాన్ని కలిగించారని సీబీఐ చెబుతోంది.
2007 నుంచి 2012 మధ్య కాలంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ రుణాలు పొందింది. కానీ తిరిగి చెల్లించలేదు. దీంతో సీబీఐ మోసం కేసు నమోదు చేసింది. మనీల్యాండరింగ్ కేసుల్లో విజయ్ మాల్యా పరారీలో ఉన్నాడంటూ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్లో ఉంటున్నారు.