పీఎం మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ!

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో వున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో  భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, పోలవరం, అమరావతి ప్రాజెక్టుల గురించి చంద్రబాబు ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పాతాళంలోకి పడిపోయిన ఆంధ్రప్రదేశ్  ఆర్థిక పరిస్థితిని ఎలా పైకి తీసుకురావాలన్న అంశం మీద ఇద్దరి మధ్య చర్చ జరిగింది. అంతకుముందు చంద్రబాబు కేంద్రమంత్రి పీయూష్ గోయెల్‌తో సమావేశమయ్యారు. సుమారు అరగంటపాటు వివిధ అంశాల మీద చర్చించారు. కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కూడా చంద్రబాబు భేటీ అవనున్నారు.