కేసీఆర్ బాటలో జగన్ గ్యాంగ్!

తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ఇద్దరూ ఒకే తానులో ముక్కలేనని చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు మరో విషయంలో కూడా మేమిద్దరం ఒకే బ్యాచ్ నంబర్ అని తేటతెల్లం చేసుకున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించిన ఆధారాలను మొత్తం ధ్వంసం చేశారు. అప్పట్లో అది పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా సేమ్ టు సేమ్.  జగన్ ప్రభుత్వం కాలంలోని మైనింగ్ డాక్యుమెంట్స్.ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్యాంగ్ దగ్ధం చేస్తుండగా దొరికిపోయారు. ఈ సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ సమీర్ శర్మ కారు డ్రైవర్ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమీర్ శర్మ ఆదేశాలతోనే రికార్డులు దగ్ధం చేసినట్టు డ్రైవర్ నాగరాజు చెబుతున్నాడు.  సీఎంఓ అధికారి ముత్యాలరాజు ఓఎస్డీగా వున్న సాయి గంగాధర్, సెక్షన్ హెడ్ శ్రీనివాస్, సమీర్ శర్మ ఓఎస్డీ రామారావుల పాత్ర ఇందులో వున్నట్టు నాగరాజు  చెబుతున్నాడు. సమీర్ శర్మ  ఆదేశాలతోనే డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు గోనెసంచుల్లో తెచ్చి దగ్దం చేస్తున్ట్టు నాగరాజు వెల్లడి. పోలీసులకు దొరికిన సమయంలో డ్రైవర్ నాగరాజు తప్పతాగి వున్నాడు.