ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు అరెస్ట్..


ఢిల్లీలో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌, ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు, మహారాష్ట్ర ఏటీఎస్‌, బిహార్‌, పంజాబ్‌ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టి ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. దేశంలో ఉగ్రదాడికి కుట్ర జరుగుతోందనే అనుమానంతో ఆరు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారంతా ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు దేశవ్యాప్తంగా ఉగ్ర దాడులకు యత్నిస్తున్నట్లు సమాచారం.