బ్రహ్మముడి కామెడీ పీస్... సీరియల్ లోకి విలన్ ఎంట్రీ!

 

బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ గిరి శంకర్ ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. గత కొన్ని నెలలుగా రిషి కోసం గుప్పెడంత మనసు సీరియల్ అభిమానులు ఎదురుచూస్తుండగా అతను రంగా అనే కొత్త పాత్రగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఈ కథ అంతా రంగా చుట్టూనే తిరుగుతుంది.

స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే టాప్- 5 లో బ్రహ్మముడి, గుప్పెడంత మనసు ఉన్నాయి. అయితే ఇప్పుడు అవి రెండు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి. అటు రిషీధార, ఇటు కావ్య రాజ్ ల జోడీలు ఆన్ స్క్రీన్ మీద హిట్ జోడిగా నిలిచాయి. అయితే బ్రహ్మముడి సీరియల్ లో ధాన్యలక్ష్మికి భర్తగా చేస్తున్న ప్రకాష్ అలియాస్ గిరి శంకర్.. ఇప్పుడు గుప్పెడంత మనసులో సరోజకి నాన్నగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బ్రహ్మముడిలో మతిమరుపు క్యారెక్టర్ గా గుడ్ కామెడీతో ప్రేక్షకులని మెప్పిస్తున్న ప్రకాష్.. ఇప్పుడు సీరియస్ రోల్ లో దర్శనమివ్వబోతున్నాడు.

గుప్పెడంత మనసులో కొన్ని ఎపిసోడ్ ల క్రితం రంగాకి మరదలిగా సరోజ క్లోజ్ గా ఉంటుంది. అయితే అదే సమయంలో రంగా వాళ్ళ నానమ్మ తన గురించి కొన్ని మాటలు అంది.. " నువ్వేమో వాడికోసం క్యారేజ్ తెస్తావ్.‌. మీ నాన్నేమో వడ్డీ డబ్బుల కోసం వాడిని తిడతాడు"  అని అంటుంది. అయితే దీన్నిబట్టి రంగాకి సరోజ వాళ్ళ నాన్న అప్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో తరువాతి ఎపిసోడ్ లలో రంగాకి వార్నింగ్ ఇచ్చే సీన్లు ఉండబోతాయని స్పష్టంగా తెలుస్తుంది. దీంతో సరోజ వాళ్ళ నాన్న సంజీవయ్య విలన్ గా కన్పించబోతున్నాడు. మరి ఆ సీరియల్ లో కామెడీ పీస్.. ఈ సీరియల్ లో విలన్ అంటే ప్రేక్షకులు ఎలా చూస్తారో చూడాలి మరి.