ట్రైలర్ రివ్యూ: టచ్ చేసి చూడు
on Jan 25, 2018
ఏడాదికి రెండు సినిమాలకు తగ్గకుండా అభిమానుల్ని పలకరించే మాస్ మహరాజా రవితేజ రెండేళ్లపాటు సినిమాలకు దూరమైపోయాడు. ఆరోగ్యం బాలేదనో.. కథలు నచ్చలేదనో.. కారణం ఏదైనాసరే రవి మార్క్ ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యింది. అయితే రాజా ది గ్రేట్తో మళ్లీ గ్రాండ్గా రీఎంట్రీ ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి తన పాత ఫాంను అందుకునే దిశలో వరుసపెట్టి సినిమాలను చేయాలని ఫిక్సయ్యాడు.
దీనిలో భాగంగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రవితేజ టచ్ చేసి చూడు అనే సినిమా చేస్తున్నాడు. ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్కొచ్చేసిన ఈ సినిమాను వీలైనంత త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మాస్ మహరాజా భావిస్తున్నాడు. ఈ నేఫథ్యంలో రిపబ్లిక్ డే కానుకగా టచ్ చేసి చూడు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. లవ్, ఫ్యామిలీ, సెంటిమెంట్, యాక్షన్ అన్నింటికి ఇందులో చోటిచ్చారు. తన మార్క్ కామెడీతో పాటు యాక్షన్ సీక్వెన్స్లోనూ రవితేజ అదరగొట్టేశాడు. హీరోయిన్లు రాశిఖన్నా, సీరత్ కపూర్ అందంగా కనిపించారు. ఫైనల్లో యూనిఫామ్లో ఉంటే గన్లో ఆరే బుల్లెట్లు. యూనిఫామ్ తీసేస్తే.. దానమ్మా.. రాయితో చంపుతానో, రాడ్తో చంపుతానో.. నాకే తెలియదు అంటూ రవితేజ చెప్పే డైలాగ్ బాగా పేలింది. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.