మోహన్ లాల్ పాత్రలో వెంకీ
on Jan 8, 2014
పరభాషా హిట్ చిత్రాలను రీమేక్ చేసి, తెలుగు ప్రేక్షకులకు అందించడంలో ఎప్పుడూ ముందే ఉంటాడు విక్టరీ వెంకటేష్. మలయాళంలో మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం "దృశ్యం". ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సురేష్ ప్రొడక్షన్స్ సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్ర తెలుగు రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో వెంకీ హీరోగా నటించనున్నాడు. నటి శ్రీప్రియ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి.