హీరోలు రెడీగా లేరా?
on May 16, 2020
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'ఆచార్య' షూటింగ్ సగంలో ఆగింది. మరోవైపు విక్టరీ వెంకటేష్ 'నారప్ప' పరిస్థితి అంతే! షూటింగ్ కొంత బ్యాలన్స్ ఉంది. కింగ్ నాగార్జున నటిస్తున్న 'వైల్డ్ డాగ్' షూటింగ్ కూడా కంప్లీట్ కాలేదు. కరోనా కాటు కారణంగా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ షట్ డౌన్ మోడ్లో ఉంది. షూటింగుల సంగతి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరగడం లేదు. ఎక్కడో కొంతమంది ఇంటి నుండి కొన్ని పనులు చేసుకుంటున్నారు. రెండు నెలలుగా ఇండస్ట్రీ కార్యకలాపాలు ఏవీ జరగకపోవడంతో పలువురు నటీనటులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజెంట్ షూటింగ్స్ స్టార్ట్ చేస్తే మంచిదని కొందరు రిక్వెస్ట్ చేస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని షూటింగ్స్ చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. ఒకవేళ కెసిఆర్ సర్కార్ పర్మిషన్ ఇచ్చినా షూటింగ్స్ చేయడానికి హీరోలు రెడీగా లేరని ఇండీస్ట్రీ టాక్.
మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ సహా యంగ్ హీరోలు సైతం కరోనాకి వ్యాక్సిన్ లేదంటే కనీసం మెడిసిన్ వచ్చేవరకు షూటింగ్స్ చేయకపోవడమే బెటర్ అని అంటున్నారట. హీరోలు ఎవరూ షూటింగ్స్ చేయడానికి రెడీగా లేరట. ఎంత తక్కువమంది లెక్క వేసుకున్నా ఒక రోజు షూటింగ్ చేయడానికి కనీసంలో కనీసం సినిమాకి 50మంది అవసరం అవుతారు. లేకపోతే 20మంది లెక్క వేసుకున్నా... ప్రజల ప్రాణాలు రిస్క్ లో పెట్టడం హీరోలకు ఇష్టం లేదట.