ఆ నలుగురే శాపమవుతున్నారా...?
on Jan 7, 2014
చిన్నహీరోలపై జరుగుతున్న అన్యాయాలపై ఇప్పటివరకు గుసగుసలు మాత్రమే వినిపించాయి. కానీ ఇపుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య ద్వారా బహిరంగంగానే దాడికి దిగుతున్నారు. దగ్గుబాటి, అల్లు అరవింద్, చిరంజీవి, ఎన్టీఆర్ కుటుంబాలే టాలీవుడ్ను శాసిస్తున్నాయంటూ వీరిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)లో న్యాయవాది అరుణ్కుమార్ ఫిర్యాదు దాఖలు చేశారు. రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లను వారి అధీనంలో పెట్టుకొని చిన్న నిర్మాతలకు థియేటర్లు ఇవ్వకుండా పొట్టగొడుతున్నారని, సినిమా పరిశ్రమలో ఈ కుటుంబాలే గుత్తాధిపత్యం చేస్తున్నాయని, దీంతో కొందరు నటులకు అవకాశాలు లేకుండా పోతున్నాయన్నారు. అందుకే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. చిత్ర పరిశ్రమలో వీరి ఆధిపత్యంపై విచారణ జరిపించి తగిన చర్యలు చేపట్టాలని అరుణ్కుమార్ కోరారు.