.webp)
రానా దగ్గుబాటి హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'విరాట పర్వం'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి 'The Voice Of Ravanna' పేరుతో ఒక వీడియో విడుదలైంది.
Also Read: కృష్ణ 'మాయదారి మల్లిగాడు' మూవీతో సత్యానంద్ ఎలా రైటర్ అయ్యారో తెలుసా?
నేడు(డిసెంబర్ 14) రానా పుట్టినరోజు సందర్భంగా 'The Voice Of Ravanna' పేరుతో మేకర్స్ ఒక వీడియో విడుదల చేశారు. 'మారదులే ఈ దోపిడి దొంగల రాజ్యం మారదులే' అంటూ సాగే వాయిస్ ఓవర్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. 'ఇంకెన్నాళ్లు ఈ బానిస బతుకులు ఛలో పరుగెత్తు' అంటూ రోమాలు నిక్కబొడుచుకునేలా రానా వాయిస్ చెప్పాడు. వీడియో కూడా విజువల్ గా ఆకట్టుకుంటుంది. సాయి పల్లవి ఆవేదన, రానా ఆవేశంతో వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇక వీడియో చివరిలో ఈ మూవీ ట్రైలర్ ను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Also Read: సాయిపల్లవికి ఆ ఫీట్ రిపీట్ అవుతుందా!
1990 లలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా, నక్సల్స్ నేపథ్యంలో తెరకెక్కిన 'విరాట పర్వం' ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.






