"ఒన్ క్రోర్ క్లబ్"లో మారుతి
on Jun 24, 2013
కోట్లకు కోట్లు ఖర్చు చేయిస్తూ రోజుల తరబడి సినిమాలు తీసే పెద్ద దర్శకులపై కసితో తాను దర్శకుడ్ని అయ్యానని ప్రకటించుకుకొన్న మారుతి కూడా.. ఇప్పుడు కోట్ల క్లబ్బులో చేరిపోయాడు. తన తొలి చిత్రం "ఈ రోజుల్లో"ను యాభై లక్షల్లోపు బడ్జెట్తోనూ.. రెండో చిత్రం "బస్స్టాప్"ను కోటి రూపాయలలోపు బడ్జెట్తోనూ కంప్లీట్ చేసిన మారుతి.. ఇప్పుడు తన పారితోషికంగా కోటి రూపాయలు తీసుకొంటున్నాడని తెలుస్తోంది.
"ఈ రోజుల్లో, బస్స్టాప్" చిత్రాల అనంతరం "ప్రేమకథా చిత్రమ్"కు దర్శకత్వ పర్యవేక్షణ చేసి.. ఆ చిత్రం సక్సెస్ తాలూకు క్రెడిట్ను కూడా తన అకౌంట్లో జమ చేయించుకొన్న మారుతి ప్రస్తుతం అల్లు శిరీష్, రెజీనా జంటగా "కొత్త జంట" చిత్రం రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం అనంతరం సుశాంత్ సినిమాకు డైరెక్షన్ చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించిన మారుతి.. ఈ చిత్రం కోసం కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకోనున్నట్లు తెలుస్తోంది!