మన్మథుడి ఒడిలో మహానటి!!
on Jun 6, 2019
టాలీవుడ్ మన్మథుడుగా పేరు గాంచిన కింగ్ నాగార్జున మన్మథుడు చిత్రానికి సీక్వెల్ గా `మన్మథుడు 2` చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రజంట్ ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో `మహానటి` కీర్తి సురేష్ ఓ గెస్ట్ రోల్ లో కనిపించనుంది. ఇక తాజాగా హైదరాబాద్ లో మొదలైన ఈ షెడ్యూల్ లో కీర్తి సురేష్ జాయిన్ అయింది. ఈ విషయాన్ని దర్శకుడు రాహుల్ స్వయంగా ప్రకటిస్తూ నాగ్, కీర్తి మధ్య సాగే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలకు సంబంధించిన స్టిల్స్ కూడా పోస్ట్ చేసాడు. ఈ స్టిల్స్ ప్రజంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా రకుల్ ప్రీతి సింగ్ నటిస్తోంది. మిగితా కీలక పాత్రల్లో సీనియర్ నటి లక్ష్మి, వెన్నెల కిషోర్, రావు రమేష్ తదితరులు నటిస్తున్నారు. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ చైతన్య భరద్వాజ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఆగస్టులో సినిమాను రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చిందని సమాచారం.