Publish Date:Apr 26, 2022
ఏపీలో వండర్ జరిగింది. సోమవారం ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. రెండేళ్ల తర్వాత రాష్ట్రం జీరో కరోనా కేస్ డే గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్లో పాజిటివ్ కేసులు లేవని కావు. ఉన్నాయి కానీ, సోమవారం మాత్రం కొత్తగా ఒక్కటంటే ఒక్క కేసు కూడా రాకపోవడం విశేషం. ఏపీలో ప్రస్తుతం 22 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
సోమవారం రాష్ట్రంలో ఒక్క కొవిడ్ కేసు కూడా నమోదు కాలేదు. ఏపీలో కరోనా విలయం మొదలైన తర్వాత జీరో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. 2020 మార్చి 9న ఏపీలో తొలి కేసు నమోదైంది. కానీ ఆరోగ్యశాఖ అధికారులు మార్చి 12న నమోదైనట్టు చూపించారు. అప్పటి నుంచి ప్రతి దశలోనూ అత్యధికంగా నమోదవుతూనే ఉన్నాయి. ఓ దశలో ఒక్కరోజులోనే 24 వేల కేసులు కూడా వచ్చాయి. కానీ.. ప్రస్తుతం కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,163 శాంపిల్స్ను పరీక్షించగా.. ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని వైద్యఆరోగ్య శాఖ బులెటిన్లో వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 23,19,662 మంది కరోనా బారినపడ్డారు. సోమవారం 12 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
కరోనా కట్టడికి జగన్ సర్కారు పెద్దగా చేసిందేమీ లేదనే విమర్శలు ఉన్నాయి. ఆసుపత్రుల్లో సరైన చికిత్స అందక.. బాధితులు తెలంగాణకు వలస కట్టడం చూశాం. మందుల కొరత, ఆక్సిజన్ సిలిండర్ల కొరత, బెడ్స్ కొరత.. ఇలా రెండేళ్లు ప్రజలను వాళ్ల మానాన వారిని వదిలేశారే కానీ.. ప్రభుత్వం తరఫున కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంది లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొవిడ్ చికిత్సకు వచ్చిన బాధితుల కుటుంబ సభ్యులపై అఘాయిత్యాలు, వ్యభి-చార కూపంలోకి నెట్టిన ఘటనలూ జరగడం మరింత దారుణం. బ్లీచింగ్ పౌడర్ చల్లడం మినహా వైసీపీ సర్కారు ప్రజలపై శ్రద్ధ పెట్టింది లేదని అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ఉచిత వ్యాక్సినేషన్ సక్సెస్ కావడం.. కరోనా వేవ్ ఖతం కావడంతో.. తాజాగా సున్నా కేసులతో ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/zero-corona-cases-in-ap-25-134993.html
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య సమక్షంలో కమలం కండువా కప్పుకుని బీజేపీలో చేరారు. వీరు ముగ్గురూ ఇలా బీజేపీలో చేరారో లేదో అలా బీజేపీ హైకమాండ్ వీరి రాజీనామాతో ఖాళీ అయిన ఆ మూడు రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకే వీరినే తమ అభ్యర్థులుగా ప్రకటించింది.
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు.
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.