political-news-img

మొబైల్ మాయలో మనిషి: మీ బంధాన్ని కాపాడుకోండి!

ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు పక్కనే ఉన్నా ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉంటున్నాం. నేటి కాలంలో మొబైల్ ఫోన్ మన అందరికీ "మొదటి లైఫ్ పార్ట్నర్" (First Life Partner) గా మారిపోయింది. ఈ డిజిటల్ వ్యసనం వల్ల మన మధ్య ఉండాల్సిన క్వాలిటీ టైమ్ మాయమైపోతోంది. ఈ పరిస్థితిని మార్చుకుని, మళ్ళీ మన బంధాలను ఎలా చిగురింపజేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొబైల్ వాడకాన్ని ఎందుకు తగ్గించాలి? (Why Should We?) మొబైల్ పక్కన పెట్టి మనుషులతో గడపడం ఎందుకు ముఖ్యం అంటే: సరైన నిర్ణయాలు తీసుకోవడానికి: ముఖాముఖి మాట్లాడుకున్నప్పుడే ఒక విషయంపై చర్చించి సరైన నిర్ణయం (Decision making) తీసుకోగలం. గౌరవం ఇవ్వడం: ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూసుకోకుండా ఉండటం కనీస గౌరవం. బంధం బలపడటానికి: వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లేదా ఫ్యామిలీ మధ్య క్వాలిటీ టైమ్ గడపడం వల్ల అనుబంధం పెరుగుతుంది. ఏమి చేయకూడదు? (What Not To Do?) మనకు తెలియకుండానే చేసే ఈ తప్పులు బంధాలను దూరం చేస్తున్నాయి: మొదటి ప్రాధాన్యత ఇవ్వకండి: ఫోన్ కంటే ముందు మనిషికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫోన్ ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ కాకూడదు. మధ్యలో మాట్లాడకండి: ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో అకస్మాత్తుగా ఫోన్ కాల్ వస్తే అక్కడి నుండి వెళ్ళిపోవడం లేదా గట్టిగా మాట్లాడటం చేయకూడదు. దీనివల్ల అవతలి వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. ముఖ్యమైన సందర్భాల్లో వాడొద్దు: పెళ్లి చూపులు వంటి ముఖ్యమైన చర్చల్లో పాల్గొన్నప్పుడు మొబైల్స్ చూస్తూ కూర్చోవడం వల్ల వచ్చిన అసలు ఉద్దేశమే మర్చిపోయే ప్రమాదం ఉంది. ముందుకు వెళ్ళే మార్గం - చిట్కాలు (How-To Points): మొబైల్ వ్యసనం నుండి బయటపడటానికి ఈ చిన్న మార్పులు చేయండి: సెల్ఫ్ డిసిప్లిన్ (Self-discipline): మొబైల్ వాడకం విషయంలో మనకు మనమే ఒక క్రమశిక్షణ విధించుకోవాలి. సైలెంట్ మోడ్‌లో పెట్టండి: ఎవరితోనైనా క్వాలిటీ టైమ్ గడుపుతున్నప్పుడు లేదా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టి దూరంగా ఉంచండి. ముందే చెప్పండి: ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటే, వారికి "నేను ఒక గంట పాటు బిజీగా ఉంటాను, తర్వాత కాల్ చేస్తాను" అని మెసేజ్ పెట్టి మీ క్వాలిటీ టైమ్‌ను ఆస్వాదించండి. పరస్పర అంగీకారం: భార్యాభర్తలు ఇద్దరూ కలిసి "మనం బయటికి వెళ్ళినప్పుడు మొబైల్స్ వాడొద్దు" అని ఒక రూల్ పెట్టుకోవాలి. ఎవరైనా వాడితే రెండో వ్యక్తి నిర్మొహమాటంగా గుర్తు చేయాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A): ప్రశ్న: బోర్ కొట్టినప్పుడు మొబైల్ చూడటం తప్పా? సమాధానం: బోర్ కొట్టినప్పుడు ఫోన్ చూడటం సహజమే, కానీ ఎదురుగా ఒక మనిషి ఉన్నప్పుడు వారిని వదిలేసి ఫోన్ చూస్తూ కూర్చోవడం సరైన పద్ధతి కాదు. ఇది గౌరవం మరియు కామన్ సెన్స్ (Common sense) కి సంబంధించిన విషయం. ప్రశ్న: ఫోన్ వాడొద్దు అని చెబితే అవతలి వారు కోప్పడితే ఏం చేయాలి? సమాధానం: ఇది కోప్పడాల్సిన విషయం కాదు. "మనం ఈ సమయాన్ని సరదాగా గడపడానికి వచ్చాం, కాసేపు ఫోన్ పక్కన పెడదాం" అని సున్నితంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. మొబైల్ ఫోన్ అనేది మన అవసరానికి మాత్రమే, మన జీవితం అవ్వకూడదు. మన కళ్ళ ముందు ఉన్న మనుషుల కంటే, ఆ స్క్రీన్ లో కనిపించే ప్రపంచం ముఖ్యం కాదు. కాబట్టి, నేటి నుండే మీ మొబైల్‌ను కాసేపు పక్కన పెట్టి మీ ప్రియమైన వారితో ఆనందంగా గడపండి. అది మీ సెల్ఫ్ డిసిప్లిన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా Naveena Column యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి! సబ్స్క్రైబ్ చేసుకోండి.

Publish Date: Apr 28, 2026 5:20PM

political-news-img

రామరాజ్యం.. పర్ ఫెక్షన్ కాదు.. కరెక్షన్ ప్రాసెస్

రామరాజ్యం ఎప్పుడు వస్తుంది? ఇటీవలి కాలంలో ఈ ప్రశ్న తరచూ వినిపిస్తోంది. అయితే.. రామరాజ్యం అంటే పరిపూర్ణం.. అంటే పెర్ఫట్ అని అర్ధం కాదు.. అది నిరంతర కరెక్షన్ ప్రాసెస్ అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇండియాలో జరుగుతున్నది అదే. అంటే మనం ఉన్నది రామరాజ్యంలోనే.. ఈ ఇప్పుడు భారత్ లో కేవలం అభివృద్ధి మాత్రమే జగరడం లేదు.. వలసవాద నిర్మూలన (డీ కొలనైజేషన్) ప్రాసెస్ జరుగుతోంది. పాతికేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని గమనించినట్లైతే.. ఇండియా అనూహ్య రీతిలో అభివృద్ధి చెందింది. 2000 - 2025 మధ్య కాలంలో దేశం సాధించిన ఆర్థిక, సామాజిక మార్పులు కేవలం గణాంకాలకే పరిమితం కాదు.. ఒక నూతన జాతీయ చైతన్యాన్ని ప్రతిబింబంకూడా. రామరాజ్యం అంటే ఏదో అద్భుతం జరుగుతుందని ఎదురుచూడటం కాదు.. ప్రస్తుత వ్యవస్థలో జరుగుతున్న సానుకూల మార్పులను గుర్తించి, ఆమోదించడమే. ఆర్థిక గణాంకాలను పరిశీలిస్తే, 2000 సంవత్సరంలో 460 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత జీడీపీ ఇప్పుడు 4.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. తలసరి ఆదాయం 450 డాలర్ల నుండి 2700 డాలర్లకు పెరగడమే కాకుండా, పేదరికం 45 శాతం నుండి 12 శాతానికి గణనీయంగా తగ్గింది. ఆయుర్దాయం62 నుంచి 70 ఏళ్లకు పెరిగింది. ఆహార భద్రతను అధిగమించి దేశం ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఎదిగింది. మధ్య తరగతి జనాభా5 కోట్ల నుంచి 30 కోట్లకు పెరిగింది. ఆసుపత్రులు18 వేల నుంచి 70 వేలకు, అక్షరాస్యత 77శాతానికి పెరిగాయి. ఇక విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, డిజిటల్ లావాదేవీలు, విశ్వవిద్యాలయాలు ఐఐటీలు మెడికల్ కాలేజీలు ఇలా అభివృద్ధి చెందని రంగం అంటే లేదన్నట్లుగా ఇండియా ప్రగతి బాటలో దూసుకువెడుతున్నది. ఐఐటీలు, మెడికల్ కాలేజీల సంఖ్య పెరగడంతో పాటు, రక్షణ రంగ ఎగుమతులు జీరో నుండి 20 వేల కోట్ల రూపాయలకు చేరడం దేశ స్వయం సమృద్ధికి నిదర్శనం. కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా, దేశం తన వలసవాద గుర్తులను చెరిపివేస్తూ స్వయం అస్తిత్వాన్ని చాటుకుంటోంది. రాజ్ పథ్ కర్తవ్య పథ్ గా మారడం, కొత్త పార్లమెంటు నిర్మాణం, సెంగోల్ స్థాపన వంటివి కేవలం భౌతిక మార్పులు కావు.. ఇవి భారతీయ ఆత్మగౌరవానికి ప్రతీకలు. దీనికి తోడు అయోధ్యలో రామమందిరం, కాశీ విశ్వనాథ్ కారిడార్ వంటి ఆధ్యాత్మిక ప్రాజెక్టులు దేశ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించాయి. ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో, భారత్ అత్యంత స్థిరమైన వ్యవస్థగా ఎదుగుతోంది. మెకాలే విద్యావిధానం స్థానంలో మాతృభాషలకు ప్రాధాన్యతనిచ్చే నూతన పద్ధతులు, భారతీయ న్యాయ సంహిత వంటి సంస్కరణలు వ్యవస్థలో వేళ్లూనుకున్న పాత చట్టాలను ప్రక్షాళన చేస్తున్నాయి. ఈ మార్పులన్నీ దేశం సరైన దిశలో పయనిస్తోందనడానికి నిదర్శనాలుగా చెప్పుకోవాలి. అయితే.. ఈ ప్రగతి ఫలాలు పూర్తిస్థాయిలో అందాలంటే కేవలం ప్రభుత్వంపైనే ఆధారపడకుండా పౌరుల బాధ్యత కూడా కీలకం. అవినీతి రహిత సమాజం, అర్హతకు ప్రాధాన్యతనిచ్చే వ్యవస్థ ఏర్పడాలంటే ప్రతి వ్యక్తి తనలోని నైతికతను మేల్కొల్పాల్సిన అవసరం ఉంది. దేశ విభజన శక్తులకు తావు లేకుండా, భారత్ పట్ల గౌరవంతో మెలగడమే రామరాజ్య స్థాపనకు అసలైన మార్గం. మీకు ఈ విశ్లేషణ నచ్చినట్లైతే ‘తెలుగువన్’ ను ఫాలో అవ్వండి. షేర్ చేయండి -సీతారాం కంఠంనేని references ప్రపంచ బ్యాంక్ డేటా (World Bank Data): GDP, తలసరి ఆదాయం, పేదరికం ఆర్థిక సర్వే 2024-25, భారత ప్రభుత్వం (Economic Survey, Govt of India) NITI ఆయోగ్: బహుముఖ పేదరికం నివేదిక (Multidimensional Poverty Index) RBI డిజిటల్ లావాదేవీల నివేదిక (Digital Payment Report) UGC/AICTE: విశ్వవిద్యాలయాలు, కళాశాలల గణాంకాలు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఎగుమతి నివేదిక, 2024-25 NHAI: జాతీయ రహదారుల గణాంకాలు AAO: విమానాశ్రయాల విస్తరణ నివేదిక ప్రభుత్వం ప్రకటించిన పేదరికం నిష్పత్తి (NITI ఆయోగ్, 2024) రామమందిరం, కాశీ, మహాకాల్ ప్రాజెక్టుల వివరాలు – భారత ప్రభుత్వం, పర్యాటకం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నివేదికలు

Publish Date: Apr 28, 2026 5:19PM

political-news-img

ఏపీలో ఇంధన సంక్షోభం .. ఇండియన్ అయిల్ కార్పరేషన్‌దే!

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓపీఎల్) ఏకపక్ష వైఖరి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డిజిల్ సంక్షోభం తలెత్తిందని తేలింది. గతేడాది కంటే అదనంగా ఇంధనం సరఫరా చేస్తున్నామంటూ ప్రభుత్వానికి, అధికారులకు నమ్మకంగా లెక్కలిచ్చిన పెట్రోలియం సంస్థలు ఆచరణలో మాత్రం రిటైల్ ఔట్‌లెట్లకు పరిమితులు విధించాయి. ఇండెంట్ పెట్టినా వాణిజ్య వినియోగదారులకు డీజిల్ మళ్లిస్తున్నారనే సాకుతో ఇంధనం పంపలేదు. అత్యధిక సరఫరా వాటా కలిగిన ఐఓసీఎల్ కారణంగా రాష్ట్రంలో సరఫరా వ్యవస్థ ఎక్కడిక్కడ దెబ్బతిందంటున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని కొరత ఒక్క ఏపీలోనే తలెత్తడానికి ఐఓసీఎల్ తీరే కారణమంట. సరఫరాపై పెట్రోలియం సంస్థల లెక్కల్ని గుడ్డిగా నమ్మి, సమస్యను పట్టించుకోని పౌరసరఫరాల శాఖ తీరు కూడా తీవ్ర విమర్శల పాలవుతోంది. డీజిల్ దొరకడం లేదన్న ప్రచారంతో వాహనదారులు బంకుల దగ్గర బారులు తీరారు. బంకులపై ఒత్తిడి పెరిగి, రెండు రోజుల పాటు విక్రయించాల్సిన డీజిల్ ఒక్క పూటకే అయిపోయింది. దాంలెతో స్టాక్ లేక ఎక్కడికక్కడ బంకులు మూతపడ్డాయి. అయినా పెట్రోలియం సంస్థలు 421 బంకులే మూతపడ్డాయని చెప్పిన లెక్కలను పౌరసరఫరాల శాఖ గుడ్డిగా నమ్మి సమస్య తీవ్రతను అంచనా వేయలేకపోయింది. భారీ ప్రాజెక్టులు నిర్వహించే సంస్థలకు సొంతగా బంకులు ఉంటాయి, పెట్రోలియం సంస్థల నుంచి నేరుగా కొనుక్కుని వినియోగిస్తుంటారు. అయితే యుద్దం నేపధ్యంలో వారికి సరఫరా చేసే డీజిల్ ధర భారీగా పెరిగింది. సాధారణ బంకుల్లో రూ,96కి కాస్త అటుఇటుగా ఉంటే లీటరు డీజిల్ ధర భారీ సంస్థల బంకుల్లో రూ.152కి చేరింది. దాంతో ఆ వినియోగదారులు రిటైల్ ఔట్‌లెట్లలో కొంటున్నారని, అందుకే అక్కడ డీజిల్ నిల్వలు త్వరగా అయిపోతున్నాయని పెట్రోలియం సంస్థలు సరఫరాలకు పరిమితులు విధించాయి. అది ఐఓసీఎల్ ఏకపక్ష నిర్ణయం అంటున్నారు. ఔట్‌ లెట్లకు సరఫరా నిలిపేస్తే ఆ ఒత్తిడి పక్క బంకులపై పడి, సంక్షోభం తలెత్తుందని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించి, రాష్ట్రవ్యాప్యంగా ఇంధన సమస్యలకు కారణమయ్యారు. ప్రైవేటు పెట్రోలియం సంస్థలైన నయార, జియో, షెల్ సంస్థలకు ఏపీలో 300కి పైగా ఔట్‌లెట్లు ఉన్నాయి. అవి ఫిబ్రవరి వరకు ప్రభుత్వ రంగ సంస్థల కంటే తక్కువ ధరకే బల్క్‌గా సరఫారా చేశాయి. దాంతో పెద్దపెద్ద ప్రాజెక్టులు చేస్తున్న సంస్థలు కూడా వీరి నుంచే కొన్నాయి. యుద్దం మొదలయ్యాక ఇంధన ధరలు పెరగడంతో ప్రైవేటు కంపెనీలు అమ్మకాల్ని తగ్గించుకుంటూ వచ్చాయి. దాంతో బల్క్ వినియోగదారులతా ప్రభుత్వ రంగ సంస్థల ఔట్‌లెట్ల నుంచి కొనుగోలు చేయడం ప్రారంభించడంతో కొరత తీవ్రమైందంటున్నారు. మొత్తానికి ఇంధన సరఫరాపై పౌరసరఫరాల శాఖ పర్యేవేక్షణ లోపమే కారణమంటున్నారు. డీజిల్‌ను వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్నారంటూ పెట్రోలియం సంస్థలు ఔట్‌లెట్లకు కోత పెట్టాయి. బంకులకు సరఫరా పూర్తిగా నిలిపేసిన తర్వాతే పౌరసరఫరాల శాఖ దృష్టికి తీసుకెళ్లాయి. అప్పుడు కూడా ఆ శాఖ స్పందించలేదని, సరఫరా కొనసాగించాలని పెట్రో సంస్థలకు స్పష్టం చేయడంతో పాటు, బల్క్ వినియోగంపై డీలర్లతో చర్చించి ఉంటే సమస్య ఇంత తీవ్రమయ్యేది కాదంటున్నారు. ఏదేమైనా అటు పెట్రోలియం సంస్థలుచ ఇటు పౌరసరఫరాలశాఖ నిర్లక్షాలే ఏపీలో ఇంధన సంక్షోభానికి కారణంగా కనిపిస్తోంది.

Publish Date: Apr 28, 2026 5:11PM

political-news-img

లొంగిపోయిన మావోయిస్టులతో టూరిజం ప్రచారం

ములుగు అడవి ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి పోలీసులు కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. ఒకప్పుడు అరణ్య ప్రాంతాల్లో సాయుధ పోరాటం చేసిన మాజీ మావోయిస్టులను ఇప్పుడు టూరిస్ట్ గైడ్లుగా మారుస్తూ వారికి ఉపాధి కల్పిస్తు న్నారు. ములుగు జిల్లా అడవుల్లో ఉన్న కర్రెగుట్టలు, అరణ్య సౌందర్యం, గిరిజన సంస్కృతి వంటి ప్రత్యేకత లను ప్రపంచానికి పరి చయం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. లొంగిపోయిన మావోయిస్టులకు “గిరిదర్శక్” పేరుతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ కొత్త జీవితం వైపు నడిపిస్తు న్నారు. పోలీసులు, టూరిజం శాఖలు కలిసి నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చాయి. టూరిస్టులతో ఎలా మాట్లాడాలి, అడవి ప్రాంతాల భద్రత, మార్గద ర్శకత్వం, స్థానిక చరిత్ర – సంప్రదాయాలపై అవగాహన కల్పించారు. శిక్షణ పూర్త య్యాక వీరిని అధికారికంగా టూరిజం గైడ్లుగా నియమించారు. ఇకపై ఈ మాజీ మావోయిస్టులు ములుగు జిల్లా అడవులు, కర్రెగుట్టలు, అలాగే భద్రాచలం పరిసర ప్రాంతాల్లో టూరిస్టులకు మార్గదర్శకులుగా పనిచేయనున్నారు. అడవి మార్గాలపై వీరికి ఉన్న పరిజ్ఞానం టూరిస్టులకు ఎంతో ఉపయోగపడు తుందని అధికారులు చెబుతున్నారు. ఈ చర్యతో రెండు ప్రయోజనాలు సాధ్యమవుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఒకవైపు లొంగిపోయిన మావోయిస్టులకు స్థిరమైన జీవనోపాధి లభిస్తుండగా, మరోవైపు అడవి టూరిజం అభివృద్ధికి దోహదం అవుతోంది. ఈ కార్యక్రమం ఇతర ప్రాంతాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Publish Date: Apr 28, 2026 4:59PM

political-news-img

హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ నగరంలో మరోసారి అగ్నిప్రమాదం కలకలం రేపింది. బహదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్‌బాగ్ ప్రాంతంలో ఉన్న సోఫా, ఫర్నిచర్ వర్క్‌షాప్‌లో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వర్క్‌షాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లోనే విస్తృతంగా వ్యాపించాయి. ఎగిసిపడుతున్న మంటలు, దట్టమైన పొగతో పరిసర ప్రాంతమంతా ఆవరించిపోయింది. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే సమీపంలోని బారాదరి అగ్నిమాపక కేంద్రం నుంచి తక్షణ స్పందన లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు ఫోన్ చేసినా స్పందన ఆలస్యంగా వచ్చిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో లక్షల రూపాయల విలువైన ఫర్నిచర్, సోఫా సెట్లు, ప్లైవుడ్ పూర్తిగా దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Publish Date: Apr 28, 2026 4:50PM

political-news-img

దేశానికే గ్రోత్ ఇంజిన్‌గా విశాఖ ఏఐ గూగుల్ హబ్ : సీఎం చంద్రబాబు

సెర్చ్ ఇంజిన్‌గా మొదలైన గూగుల్.. విశాఖలో ఏర్పాటు చేయబోతున్న సెంటర్ ద్వారా దేశానికే గ్రోత్ ఇంజిన్ కాబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. టెక్నాలజీ రంగంలో ఏపీలో కొత్త శకానికి శ్రీకారం చుడుతున్న రోజుగా 2026 ఏప్రిల్ 28వ తేదీ గుర్తుండిపోతుందని చెప్పారు. గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ ఏర్పాటుకు మంగళవారం విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, గూగుల్ గ్లోబల్ ఇన్ ఫ్రా, క్లౌడ్ వైస్ ప్రెసిడెండ్ బికాస్ కోలే శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్, బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్, భారతీ ఎంటర్ ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ మిట్టల్, అదానీ గ్రూప్ చైర్ పర్సన్ జీత్ అదానీ, గూగుల్ ఇండియా ప్రతినిధి ప్రీతి లొబానా పాల్గొన్నారు. అదానీ కనెక్స్, ఎయిర్ టెల్ నెక్స్ ట్రా భాగస్వామ్యంతో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో క్లౌడ్ డేటా సెంటర్ ను గూగుల్ ఏర్పాటు చేస్తోంది. 1 గిగావాట్ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నారు. తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు 601 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. శంకుస్థాపన కార్యక్రమానికి ముందు గూగుల్ ఎక్స్ పీరియెన్స్ జోన్‌ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...”ఏపీ చరిత్రలో కొత్త టెక్ శకానికి శ్రీకారం చుడుతున్న రోజు ఇది. గూగుల్ రాక విశాఖకే కాదు ఏపికి ఓ గేమ్ చేంజర్. 30 ఏళ్ల క్రితం సైబరాబాద్ నగరాన్ని ఐటీ సిటీగా నిర్మాణం చేస్తే సంపద సృష్టికి కేంద్ర అయ్యింది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో భారత చరిత్రలో 2026 ఏప్రిల్ 28వ తేదీ శాశ్వతంగా నిలిచిపోతుంది. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో టెక్నాలజీ రంగంలో ఏపీ తలెత్తుకుని నిలబడుతుంది. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఇది. దేశానికి ఏఐ డేటా గేట్ వేగా ఏపీ నిలుస్తుంది. సెర్చ్ ఇంజన్‌గా మొదలైన గూగుల్ సంస్థ... భారత్ గ్రోత్ ఇంజన్‌గా మారుతుంది. ప్రతీ ఒక్కరూ గూగుల్‌లో సెర్చ్ చేస్తే గూగుల్ ఏపీని సెలెక్ట్ చేసుకుంది”అని ముఖ్యమంత్రి చెప్పారు. సీఎంఓ సెక్రటరీగా గూగుల్ ఏఐ అసిస్టెంట్ “ఏపీ ప్రభుత్వం అందిస్తున్న స్పీడ్ ఆఫ్ గవర్నెన్సుకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ నుంచి కూడా సహకారం తీసుకుంటాం. సీఎంఓలోని నలుగురు కార్యదర్శులతో పాటు నాకు కొత్తగా ఏఐ అసిస్టెంట్ కూడా సుపరిపాలన అందించేందుకు సహకారం అందిస్తుంది. గూగుల్ రావటంతో విశాఖలోని యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉత్తరాంధ్ర అంటే గతంలో వలసలు, వెనకబాటుతనం, నిరుద్యోగం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఇతర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్రకే వలస వస్తారు. ట్యాలెంట్ మైగ్రేషన్ ముగిసింది. విశాఖ ఇకపై టాలెంట్‌కు డెస్టినీగా నిలవనుంది. విశాఖకు గూగుల్ సెంటరును తీసుకురావడంలో లోకేష్ చొరవను ప్రశంసిస్తున్నాను. లోకేష్ తొలిసారి గూగుల్ సెంటర్ సందర్శించినప్పుడు విశాఖకు గూగుల్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఆ తర్వాత అది సాకారమైంది. గూగుల్ సంస్థ ఇండియాలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని భావించినప్పుడు ప్రధానిని కలిశారు. రాష్ట్రానికి గూగుల్ పెట్టుబడులు పెట్టేందుకు సహకరించాలని కోరారు. గూగుల్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే... పూర్తిగా సహకరిస్తామని ప్రధాని మోదీ చెప్పారు.. చెప్పినట్టుగానే సహకరించారు. లోకేష్ చొరవ... ప్రధాని సహకారంతో విశాఖలో గూగుల్ ప్రాజెక్ట్ సాకారమైంది. ప్రతిష్టాత్మక అదానీ గ్రూప్, ఎయిర్ టెల్ లాంటి దిగ్గజ సంస్థలు ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తాయి. 2028 సెప్టెంబరు నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రారంభించాలని కోరుతున్నాను. ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఈ ప్రాంతానికి నీటి సమస్య లేదు. 60 రోజుల్లోనే గోదావరి నీరు విశాఖకు తీసుకువస్తాం.”అని సీఎం భరోసా ఇచ్చారు.

Publish Date: Apr 28, 2026 4:38PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img