Top Stories

political-news-img

బండ్ల గణేష్ కు సుప్రీం లో చుక్కెదురు.!

టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌కి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తన కుటుంబానికి చెందిన స్థిరాస్తి వేలం విషయంలో సుప్రీం కోర్టు బండ్ల గణేష్ పిటిషన్ ను తోసి పుచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన ప్రాపర్టీని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం వేయడాన్ని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బండ్ల గణేష్ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి విదితమే. అయితే బండ్ల గణేష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును సమర్ధించింది. విషయమేంటంటే.. హైదరాబాద్‌లోని శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ యూనియన్ బ్యాంకులో తీసుకున్న భారీ రుణాలకు సంబంధించి బండ్ల గణేష్, ఆయన తండ్రి, సోదరుడు కలసి తమ కుటుంబానికి చెందిన జూబ్లీహిల్స్ స్థిరాస్తిని వ్యక్తిగత పూచీకత్తుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద తాకట్టు పెట్టారు. రుణ చెల్లింపుల ప్రక్రియ సరిగ్గా సాగకపోవడంతో బ్యాంక్ అధికారులు చట్టపరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. 2019వ సంవత్సరంలో సర్ఫేసీ చట్టం కింద సదరు జూబ్లీహిల్స్ ఆస్తిని బ్యాంక్ అధికారికంగా స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత 2022లో వేలం నిర్వహించి 8.51 కోట్లకు ఆ ఆస్తిని విక్రయించింది. బ్యాంక్ జరిపిన ఈ వేలం ప్రక్రియను వ్యతిరేకిస్తూ బండ్ల గణేష్ రుణ వసూళ్ల ట్రిబ్యునల్ ఎన్ సీఎల్ టీ) ఆశ్రయించారు. ఎన్సీటీఎల్ లో కంపెనీ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో తమ పూచీకత్తు ఆస్తిని వేలం వేయడం చట్ట విరుద్ధమని బండ్ల గణేష్ వాదించారు. పైగా.. వన్ టైమ్ సెటిల్‌మెంట్ కింద తమ కుటుంబం ఇప్పటికే రూ. 71.44 కోట్లతో కలిపి మొత్తం సుమారు రూ. 129.02 కోట్ల బకాయిలను బ్యాంకుకు చెల్లించిందనీ.. బకాయిలన్నీ తీరిపోయాక కూడా ఆస్తిని వేలం వేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ వాదనలతో ట్రిబ్యునల్ బండ్ల గణేష్‌కి అనుకూలంగా తీర్పునిస్తూ వేలాన్ని రద్దు చేసి, ఆస్తిని తిరిగి అప్పగించాలని, కొనుగోలుదారుకు సొమ్మును వడ్డీతో సహా వాపసు చేయాలని ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను సవాలు చేస్తూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మౌషుమి భట్టాచార్య మరియు జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ ధర్మాసనం ఈ కేసును సమగ్రంగా విచారించింది. బ్యాంకు తరఫున వాదనలు వినిపిస్తూ, ఎన్సీఎల్టీలో కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియ నడుస్తున్నప్పటికీ, వ్యక్తిగత గ్యారెంటర్ల ఆస్తులపై ఆటోమేటిక్‌గా మారటోరియం రక్షణ వర్తించదని స్పష్టం చేశారు. ఈ వాదనలను ఆమోదించిన తెలంగాణ హైకోర్టు, డీఆర్‌టీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ యూనియన్ బ్యాంక్ చేసిన ఆస్తి వేలం చట్టబద్ధమైనదేనని సమర్థించింది. హైకోర్టు తీర్పును బండ్ల గణేష్ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. సుప్రీం కోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ..బండ్ల గణేష్ పిటిషన్ ను కొట్టివేసింది. Jubilee Hills Property Auction, Union Bank Of India Loan Case, Bandla Ganesh Court Case, Telangana High Court Order

Publish Date: Jul 23, 2026 3:37PM

political-news-img

నిరుద్యోగులకు ఏపీ కేబినెట్ గుడ్ న్యూస్..!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పాలన, సంక్షేమం, ఉద్యోగాల కల్పన మరియు వ్యవసాయ రంగాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడం మరియు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమివ్వడమే లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగింది. ఈ క్రమంలో నిరుద్యోగులు, రైతులు, చేనేత కార్మికులు మరియు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేబినెట్ పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. ముఖ్యాంశంగా రాష్ట్రంలో సుపరిపాలనతో పాటు ఆర్థిక పరిపుష్టి తీసుకురావడానికి అవసరమైన కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఈ సమావేశంలో నిరుద్యోగ యువతకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆశలను నిజం చేస్తూ కేబినెట్ బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం రెక్టాంగులర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (GoM) సమావేశంలో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన అనే బృహత్తర లక్ష్యంపై కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కొత్త పరిశ్రమల రాక, మౌలిక వసతుల కల్పన ద్వారా యువతకు విస్తృత ప్రాతిపదికన ఉపాధి కల్పించడమే తమ ప్రధాన ధ్యేయమని ప్రభుత్వం స్పష్టం చేసింది. చేనేత కార్మికుల సంక్షేమానికి పెట్టింది పేరుగా నిలిచే ‘నేతన్న భరోసా’ పథకానికి కేబినెట్ ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది. రాష్ట్రంలోని దాదాపు 52,000 చేనేత కుటుంబాలకు ఆర్థిక ఊరట కలిగించేలా ఏటా రూ. 25,000 చొప్పున నేరుగా సాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఉచిత విద్యుత్ సరఫరాతో పాటు ఈ అదనపు ఆర్థిక సాయం అందించడం పట్ల ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మరియు ఇతర మంత్రులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఎన్డీయే ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చేనేత రంగానికి జీవం పోయడానికి మరియు వారి జీవన ప్రమాణాలు పెంచడానికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని కేబినెట్ అభిప్రాయపడింది. మరోవైపు రాష్ట్రంపై ఎల్ నినో (El Niño) ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయన్న ముందస్తు హెచ్చరికలపై చంద్రబాబు స్పందించారు. వ్యవసాయం, నీటిపారుదల శాఖల అధికారులను ఆయన తక్షణమే అప్రమత్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సాగులో ఉన్న పంటల వివరాలు, ప్రధాన జలాశయాల్లో లభ్యమవుతున్న నీటి నిల్వలు, తాగునీరు మరియు సాగునీటి పరిస్థితులపై సమగ్ర నివేదికను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. ఎల్ నినో వల్ల రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని, వర్షాభావ పరిస్థితులు తలెత్తితే ఎదుర్కొనేందుకు సన్నాహాలు సిద్ధం చేసుకోవాలని మంత్రులను, ఉన్నతాధికారులను సీఎం సూచించారు. రైతుల సంక్షేమానికి సంబంధించి మరో కీలక నిర్ణయంలో భాగంగా, ఏపీ మార్క్‌ఫెడ్ సంస్థకు సెంట్రల్ బ్యాంక్ నుంచి లభించే రూ. 300 కోట్ల రుణానికి రాష్ట్ర ప్రభుత్వం శూరిటీగా ఉండటానికి కేబినెట్ గ్యారంటీ ఇచ్చింది. ఈ నిర్ణయంతో మద్దతు ధరల వద్ద పంటల కొనుగోలు, రైతులకు సకాలంలో చెల్లింపులు సులభతరం కానున్నాయి. అంతేకాకుండా విద్యారంగంలో వికలాంగుల పురోగతికి ప్రాధాన్యమిస్తూ, బాపట్లలో వినికిడి లోపం ఉన్న ప్రత్యేక విద్యార్థుల కోసం ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసేందుకు ఆమోదం లభించింది. రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా భద్రత మరియు శాంతిభద్రతల బందోబస్తు ఏర్పాట్ల కోసం రూ. 50 కోట్ల నిధులను మంజూరు చేయడానికి కూడా మంత్రివర్గం సమ్మతించింది. ఇక ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ రానుండటంతో, వారి పర్యటన ఏర్పాట్లపై సాయంత్రం ప్రత్యేక సమీక్ష జరిగింది. ప్రధాని పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి అధికారులు మరియు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. మొత్తానికి సంక్షేమం, ఉద్యోగాలు, వ్యవసాయం మరియు భద్రతను మేళవించి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రగతికి సరికొత్త దిశానిర్దేశం చేస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. AP Cabinet Decisions 2026, AP Govt Jobs Recruitment, Nethanna Bharosa Scheme, Chandrababu Naidu Cabinet Meeting, El Nino Impact AP, Bhogapuram Airport Modi Visit

Publish Date: Jul 23, 2026 3:26PM

political-news-img

నేతలకు కేసుల చిక్కులు.. దిశానిర్దేశం లేక క్యాడర్ కకావికలు.. ఏపీలో వైసీపీ పుంజుకునేనా?

2024 ఎన్నికలలో ఓటమి తరువాత నుంచీ వైసీపీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతున్న పరిస్థితి. ఈ పార్టీ నేతలు చట్టపరమైన, న్యాయపరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. వైసీపీకి చెందిన కీలక నాయకులు, మాజీ మంత్రులు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు, కార్యకర్తలపై వరుసగా కేసులు నమోదవుతుండటంతో పార్టీ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అవకతవకలు, అన్యాయాలు, అక్రమాలు, కుంభకోణాలపై విచారణలు ముమ్మరమయ్యాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో పార్టీ ఉనికే నామమాత్రం అన్నట్లుగా వైసీపీ ప్రస్తుతం మిగిలింది. వైసీపీయులపై నమోదైన కేసుల తీరుతెన్నులను పరిశీలిస్తే, కేవలం ఉన్నత స్థాయి రాజకీయ నేతలే కాకుండా నియోజకవర్గ స్థాయిలో క్రియాశీలకంగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు, సోషల్ మీడియా విభాగం సభ్యులు కూడా న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్నారు. ఈ కేసులతో వైఎస్సార్‌సీపీ చట్టపరమైన రక్షణ కొరకు ప్రతి జిల్లాలోనూ, ఉన్నత న్యాయస్థానాలలోనూ పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విచారణాధికారుల ముందర హాజరుకావడం, ముందస్తు బెయిల్స్ కొరకు పిటిషన్లు దాఖలు చేయడం, పోలీసుల కస్టడీని ఎదుర్కోవడం వంటి పరిణామాలు పార్టీ రోజువారీ కార్యకలాపాలను, రాజకీయ పోరాటాలను నామమాత్రం చేసేశాయి. దీంతో పార్టీ సంస్థాగతంలో బలహీనపడింది. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను నిర్వహించడానికి, ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తిని ఆసరాగా చేసుకుని ఉద్యమించడానికి పని చేసే నాయకులే వైసీపీలో కరవైయ్యారు. ఉన్న నేతల సమయం అంతా లీగల్ వివాదాలలో కోర్టులు, న్యాయవాదుల చుట్టూ తిరగడానికే సరిపోతున్న పరిస్థితి. కొన్ని జిల్లాల్లో నేతలు అరెస్టులకు భయపడి పార్టీ కార్యకలాపాలకు, రాజకీయాలకూ దూరంగా ఉంటున్నారు. దీంతో పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేసే వారే కరవయ్యారు. ఈ పరిస్థితి వచ్చే ఎన్నికల నాటికి పార్టీని సంసిద్ధం చేయాలని భావిస్తున్న జగన్ కు అడుగు ముందుకు పడకుండా చేస్తోంది. దీంతో రాష్ట్రంలో వైసీపీ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. Ycp cadre in disarray, YSRCP Legal Troubles, YS Jagan Mohan Reddy, AP Politics, , Legal Cases, YCP Leaders

Publish Date: Jul 23, 2026 3:11PM

political-news-img

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే చర్చలు.. రాహుల్ గాంధీ డిమాండ్..!

ఢిల్లీ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా విపరీతమైన దుమారం రేపుతున్న వేళ, పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిపక్షాల నిరసన జ్వాలలు విరుచుకుపడ్డాయి. జులై 23 గురువారం నాడు దేశ రాజధానిలోని పార్లమెంటు ఉభయ సభలు ప్రతిపక్షాల హోరెత్తించే నినాదాలతో తీవ్రంగా స్తంభించిపోయాయి. విద్యా వ్యవస్థలో విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని ఆరోపిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని విపక్ష ఇండియా కూటమి బలంగా డిమాండ్ చేసింది. పార్లమెంటు సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు ఈ అంశంపై పట్టుబట్టడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో రెండు సభలు వాయిదా పడక తప్పలేదు. సభలు వాయిదా పడిన అనంతరం, విపక్ష ఎంపీలందరూ ఒక్కటై పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం సమీపంలో భారీ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తో పాటు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఇతర భాగస్వామ్య పక్షాల ఎంపీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశ భవిష్యత్తు అయిన లక్షలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే, ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి పోలీసు బలగాలతో దమనకాండకు పాల్పడుతోందని నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఇదిలా ఉండగా, నిన్నటి దాకా నీట్ పేపర్ లీకేజీపై పార్లమెంట్‌లో ఎలాంటి చర్చకు ఆస్కారం లేదని మొండికేసిన కేంద్ర ప్రభుత్వం, హఠాత్తుగా మనసు మార్చుకుని చర్చకు సిద్ధమని ప్రతిపాదనలు పంపింది. అయితే విపక్ష ఇండియా కూటమి ఈ ఆఫర్‌ను తీవ్రంగా తిరస్కరించింది. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన తర్వాతే ఏ చర్చలైనా జరుగుతాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. గత కొన్ని నెలలుగా వేలాది మంది విద్యార్థులు రోడ్లపై నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పుడు నోరు మెదపని ప్రధాని నరేంద్ర మోదీ, ఇప్పుడు చర్యలు తీసుకుంటామని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన ఈ వ్యవహారంలో ప్రధాని మాటలను ప్రజలు, విద్యార్థులు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని ఖర్గే ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మరోవైపు, విపక్షాల ఆందోళనకు పోటీగా అధికార ఎన్డీఏ కూటమి ఎంపీలు కూడా పార్లమెంటు ఆవరణలో ఎదురు నిరసనకు దిగారు. ఇండియా కూటమి కావాలనే పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటోందని, సభలో కీలకమైన అంశాలపై చర్చ జరగకుండా ఆటంకాలు సృష్టిస్తోందని ఎన్డీఏ నేతలు ఆరోపించారు. ఒకవైపు విపక్షాల హోరెత్తే నినాదాలు, మరోవైపు అధికార పక్షం కౌంటర్ ఆందోళనలతో పార్లమెంట్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత, హైడ్రామా నెలకొంది. లక్షలాది మంది నీట్ అభ్యర్థుల భవిష్యత్తు, ఈ రాజకీయ పోరు మధ్య ఎటు తేలుతుందోనన్న ఆందోళన దేశవ్యాప్తంగా వ్యక్తం అవుతోంది. NEET paper leak protest, Dharmendra Pradhan resignation, INDIA bloc parliament protest, Rahul Gandhi, Mallikarjun Kharge, Parliament monsoon session

Publish Date: Jul 23, 2026 2:56PM

political-news-img

మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో తాజాగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సోనమ్ రఘువంశీకి గతంలో లభించిన బెయిల్‌ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, రాబోయే 3 వారాల వ్యవధిలో ఆమె విచారణాధికారులు లేదా సంబంధిత కోర్టు ముందు స్వచ్ఛందంగా లొంగిపోవాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సాంకేతిక కారణాలు చూపి బెయిల్ పొందిన నిందితురాలికి సుప్రీం షాక్ ఇవ్వడంతో ఈ కేసు మరోసారి జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సంచలన కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌కు చెందిన 29 ఏళ్ల రాజా రఘువంశీకి సోనమ్‌తో వివాహమైంది. వివాహం అనంతరం తమ కొత్త జీవితాన్ని సంతోషంగా ప్రారంభించేందుకు ఈ దంపతులు ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయకు హనీమూన్ పర్యటనకు వెళ్లారు. అయితే మేఘాలయ అందాలను ఆస్వాదించేందుకు వెళ్లిన ఆ పర్యటనలోనే రాజా రఘువంశీ అనుమానాస్పద స్థితిలో మాయమయ్యాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తీవ్రంగా గాలించగా, గాలింపు ప్రారంభించిన దాదాపు వారం రోజుల తర్వాత ఒక లోతైన లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఈ ఘటనపై లోతుగా విచారణ జరిపి, సాంకేతిక ఆధారాలను విశ్లేషించగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. సోనమ్ తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి పథకం ప్రకారం పక్కా స్కెచ్ వేసి, తన భర్త రాజా రఘువంశీని హనీమూన్ సాకుతో మేఘాలయకు తీసుకువెళ్లి దారుణంగా హత్య చేయించినట్లు పోలీసులు ఆధారాలతో సహా నిరూపించారు. దీంతో జూన్ నెలలో పోలీసులు సోనమ్‌ను అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ దశలో ఉండగా, అరెస్ట్ మెమోలో పోలీసులు పేర్కొన్న కొన్ని సాంకేతిక లోపాలు, బీఎన్‌ఎస్ చట్టానికి సంబంధించిన తప్పుడు నిబంధనలు ఉదహరించడాన్ని ఆధారంగా చేసుకుని ఏప్రిల్ నెలలో షిల్లాంగ్ ట్రయల్ కోర్టు సోనమ్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత జూన్ చివరి వారంలో మేఘాలయ హైకోర్టు కూడా ఈ బెయిల్ ఉత్తర్వులను సమర్థించింది. అయితే, కేసులో ప్రధాన నిందితురాలు బయట ఉంటే విచారణను, ఆధారాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని తీవ్రంగా పరిగణించిన మేఘాలయ ప్రభుత్వం, హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ పీబీ వరలేలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై సమగ్ర విచారణ జరిపింది. మేఘాలయ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అరెస్టు మెమోలో ఉన్న లోపం కేవలం ప్రింటింగ్ పొరపాటు మాత్రమేనని, అంతమాత్రాన భర్తను కిరాతకంగా హత్య చేసిన తీవ్రమైన కేసులో నిందితురాలికి బెయిల్ ఇవ్వడం సరికాదని కోర్టుకు విన్నవించారు. ఆమె బయట ఉంటే దేశం విడిచి పారిపోయే అవకాశం కూడా ఉందని స్పష్టం చేశారు. ఈ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, కేవలం ప్రింటింగ్ సాంకేతిక లోపాల ఆధారంగా బెయిల్ మంజూరు చేయడం సరైనది కాదని స్పష్టం చేస్తూ సోనమ్ బెయిల్‌ను తక్షణమే రద్దు చేసింది. అయితే విచారణ ప్రక్రియ వేగవంతంగా సాగకపోతే, రాబోయే 6 నెలల తర్వాత ఆమె మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా న్యాయస్థానం కల్పించింది. Sonam Raghuvanshi, Raja Raghuvanshi Honeymoon Murder, Meghalaya Murder Case, Supreme Court Bail Cancellation, Shillong Court, Sonam Raghuvanshi Bail Revoked

Publish Date: Jul 23, 2026 2:38PM

political-news-img

ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్ల మూత.. సుప్రీం సీరియస్.!

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు రోజు రోజుకూ ఉధృతమౌతున్నాయి. బుధవారం (జులై 22) నిరసనకారులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాటలు, ఘర్షణలు చోటుచేసుకో వడంతో జంతర్ మంతర్, కన్నాట్ ప్లేస్ పరిసర ప్రాంతాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, నిరసనకారులను చెదర గొట్టేందుకు పోలీసులు భారీగా మోహరించగా, పలుమార్లు ఇరు వర్గాల మధ్య తోపులాటలు జరిగాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసిన ఢిల్లీ పోలీసులు, జంతర్ మంతర్, కన్నాట్ ప్లేస్‌తో పాటు కీలక ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా రవాణా కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు జరగకుండా అప్రమ త్తంగా వ్యవహరిస్తున్నారు. భద్రత దృష్ట్యా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎమ్ఆర్సీ) నగరంలోని 16 మెట్రో స్టేషన్లను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్టేషన్లలో రైళ్లు ఆగవని పేర్కొంది. ఆయా మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికుల ప్రవేశం, నిష్క్రమణను కూడా నిలిపివేసినట్లు తెలిపింది. మూసివేసిన మెట్రో స్టేషన్లు లోక్ కళ్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, బరాఖంబా రోడ్, సుప్రీంకోర్టు, సేవా తీర్థ్, జనపథ్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, ఐటీఓ, ఢిల్లీ గేట్, ఇంద్ర ప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్ బాగ్, శివాజీ స్టేడియం మొదలగు మొత్తం 16 మెట్రో సేవలను వినియో గించే ప్రయాణికులు ప్రయాణానికి ముందు తాజా సేవా వివరాలను పరిశీలించాలని, అవస రమైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవా లని డీఎమ్ఆర్సీ సూచించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, భద్రతా పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే మెట్రో స్టేషన్లను తిరిగి తెరవనున్నట్లు అధికా రులు వెల్లడించారు. ఇలా ఉండగా మెట్రో స్టేషన్ల మూసి వేత పట్ల సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. మధ్యహ్నంలోగా సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించింది. మెట్రో స్టేషన్ల మూసి వేత కారణంగా కోర్టుకు హాజరు కాలేకపోయిన న్యాయవాదులపై ఎటువంటి చర్యలూ తీసుకోబోమని పేర్కొంది. Closure of 16 Metro stations in Delhi, supreme, serious, order, resolve, immediately

Publish Date: Jul 23, 2026 2:23PM

MOVIE NEWS