political-news-img

జగన్ మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరికి సుప్రీంలో షాక్

మాజీ సీఎం జగన్ మెప్పు కోసం సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టిన ఆయన మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినట్లు నమోదైన కేసులో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. చంద్రబాబుపై సోషల్ మీడియా వేదికల్లో అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతరకర చిత్రాలను పోస్ట్ చేశారనే ఆరోపణలు పూడి శ్రీహరిపై ఉన్నాయి. చంద్రబాబు చేతిలో కత్తి పట్టుకుని ఉన్నట్లు యానిమేషన్ చిత్రాలను సృష్టించి, వాటిని వైరల్ చేశాడని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏప్రిల్ 1వ తేదీన తాడేపల్లిలోని శ్రీహరిని తన నివాసం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం న్యాయస్థానాల్లో పలు మలుపులు తిరిగింది. పోలీసులు నిబంధనలు పాటించకుండా అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని శ్రీహరి తరఫున హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. తొలుత శ్రీహరి రిమాండ్‌ను ట్రయల్ కోర్టు నిరాకరించగా, పోలీసులు దీనిని హైకోర్టులో సవాలు చేశారు. హైకోర్టు ఈ రిమాండ్ నిరాకరణపై స్టే విధించింది. దాంతో తనపై జరుగుతున్నది రాజకీయ కక్షసాధింపు అని, తన ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని పేర్కొంటూ పూడి శ్రీహరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విచారణలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుపై బుధవారం(29-4-26న) హైకోర్టులో విచారణ జరగాల్సి ఉన్నందున, పూడి శ్రీహరి, మరో నిందితుడు గిరీశ్ కుమార్ రెడ్డిలకు ఎలాంటి మధ్యంతర రక్షణ కల్పించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం, తదుపరి విచారణను వేసవి సెలవుల వెకేషన్ బెంచ్ ముందుకు వాయిదా వేసింది. హైకోర్టులో విచారణ ఉన్నందున అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోకపోవడంతో పూడి శ్రీహరి భవిష్యత్తు ఇప్పుడు హైకోర్టు తీర్పుపై ఆధారపడి ఉంది. సోషల్ మీడియాలో పోస్టుల విషయమై జరుగుతున్న ఈ న్యాయపోరాటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Publish Date: Apr 28, 2026 5:55PM

political-news-img

థెరప్యూటిక్ యోగా: ఒత్తిడి, ఆందోళన మరియు దీర్ఘకాలిక వ్యాధులకు శాశ్వత పరిష్కారం!

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్, మధుమేహం, PCOD వంటి సమస్యలు మన జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. మందులు వాడుతున్నా పూర్తి ఉపశమనం లభించడం లేదా? అయితే మీకు 'థెరప్యూటిక్ యోగా' ఒక అద్భుతమైన మార్గం. ఇది కేవలం శరీరాన్ని కదిలించడం మాత్రమే కాదు, మీ మనస్సును మరియు ఆత్మను పునరుజ్జీవింపజేసే ఒక దివ్యౌషధం. మనం థెరప్యూటిక్ యోగాను ఎందుకు ఎంచుకోవాలి? (Why Should We?) రోజంతా ఉత్సాహం: మీరు రోజుకు కేవలం గంటన్నర సమయం యోగాకు కేటాయిస్తే, మిగిలిన 22.5 గంటల సమయం ఎంతో శక్తివంతంగా మరియు ఆనందంగా గడుస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి: థైరాయిడ్ సమస్య ఉన్నవారు కేవలం 3 నెలల్లో మార్పును గమనించవచ్చు, అలాగే PCOD సమస్యలు 4 నుండి 5 నెలల్లో నయమయ్యే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత: ఈ ప్రపంచంలో మానసిక సమస్యలను సమూలంగా నయం చేసే శక్తి కేవలం యోగాకు మాత్రమే ఉంది. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, బద్ధకాన్ని వదిలిస్తుంది. అంతర్గత మార్పు: యోగా మిమ్మల్ని లోపలి నుండి మారుస్తుంది. అది ఒక చిన్న పిల్లవాడి నవ్వులో ఉండే స్వచ్ఛతను మీ జీవితంలోకి తీసుకువస్తుంది. ఏం చేయకూడదు? (What Not to Do) నియమాలను విస్మరించవద్దు: మధుమేహం లేదా రక్తపోటు ఉన్నవారు యోగా చేస్తున్నాం కదా అని ఆహార నియమాలను పూర్తిగా వదిలేయకూడదు. వ్యాధి పూర్తిగా నయమయ్యే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తక్షణ ఫలితాల కోసం ఆరాటపడవద్దు: యోగా అనేది ఏటీఎం మిషన్ నుండి డబ్బులు వచ్చినట్లు తక్షణమే రాదు, కానీ సాధన మొదలుపెట్టిన కొద్దిసేపటికే మీరు ఆ మార్పును అనుభూతి చెందుతారు. ఆనందాన్ని వదులుకోవద్దు: జీవితంలో దేనికైనా రాజీ పడండి కానీ మీ సంతోషం విషయంలో మాత్రం ఎప్పుడూ రాజీ పడకండి. ప్రారంభించడం ఎలా? (How to Start) శ్వాసపై ధ్యాస: మన శ్వాస మరియు మనస్సు భార్యాభర్తల వంటివి. శ్వాస దీర్ఘంగా, ప్రశాంతంగా ఉంటే మనస్సు కూడా అంతే ప్రశాంతంగా మారుతుంది. సరైన భంగిమలు: 'సుప్త ఆసనం' (Subtasana) వంటి భంగిమలు కేవలం 10 నిమిషాల్లోనే మిమ్మల్ని ఎంతో రిలాక్స్‌గా మరియు శక్తివంతంగా మారుస్తాయి. ఆధారాలతో సాధన (Props): శారీరక ఇబ్బందుల వల్ల ఆసనాలు వేయలేకపోయేవారు రకరకాల ప్రాప్స్ (Props) సహాయంతో సులభంగా యోగా చేయవచ్చు. ఇది క్యాన్సర్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: థైరాయిడ్ సమస్య యోగాతో నయమవుతుందా? జ: అవును, క్రమం తప్పకుండా థెరప్యూటిక్ యోగా చేయడం ద్వారా 3 నెలల్లో థైరాయిడ్ మందుల మోతాదును తగ్గించుకోవచ్చు. ప్ర: క్యాన్సర్ రోగులకు యోగా ఎలా సహాయపడుతుంది? జ: యోగా క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయకపోవచ్చు, కానీ రోగిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు శరీరంలో ప్రాణవాయువును (Oxygenation) పెంచి మనశ్శాంతిని చేకూరుస్తుంది. ప్ర: వ్యాయామం చేయడానికి సమయం లేని వారి పరిస్థితి ఏంటి? జ: మీ శరీరం కోసం మీరు రోజుకు కనీసం గంటన్నర కేటాయించలేకపోతే, అనారోగ్యం పాలైనప్పుడు అంతకంటే ఎక్కువ సమయాన్ని ఆసుపత్రుల్లో గడపాల్సి వస్తుందని గుర్తుంచుకోండి. మీరు అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలన్నా, ఆత్మవిశ్వాసంతో మెరవాలన్నా యోగా ఒక్కటే మార్గం. మాటల కంటే సాధన ద్వారానే మీరు ఆ వ్యత్యాసాన్ని గమనించగలరు. ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంది, దాన్ని నిర్లక్ష్యం చేయకండి. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు యోగా ప్రాక్టికల్ వీడియోల కోసం మా యూట్యూబ్ (YouTube) ఛానెల్‌ని సందర్శించండి! ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి మరియు ఆరోగ్యవంతులుగా మారండి.

Publish Date: Apr 28, 2026 5:55PM

political-news-img

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి తలొగ్గిన ఇరాక్.. కొత్త ప్రధానిగా తటస్థుడు అలీ అల్ జైదీ

ఇరాక్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా సాగుతున్న రాజకీయ ప్రతిష్ఠంభనకు తెరదించుతూ ఆ దేశ నూతన అధ్యక్షుడు నిజార్ అమేదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, బ్యాంకర్ అయిన 40 ఏళ్ల అలీ అల్ జైదీని ఇరాక్ ప్రధాన మంత్రిగా నామినేట్ చేశారు. అమెరికా నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి నేపథ్యంలోనే అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమౌతోంది. ముందుగా ఇరాక్ పార్లమెంటరీ కూటమి కోఆర్డినేషన్ ఫ్రేమ్‌వర్క్ మాజీ ప్రధాని నూరి అల్ మాలికిని ఆ పదవిలో కూర్చోబెట్టాలని భావించింది. అయితే, మాలికికి ఇరాన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకవేళ ఇరాన్ అనుకూల నేతను ప్రధానిని చేస్తే.. ఇరాక్‌కు అందిస్తున్న అన్ని రకాల ఆర్థిక, సైనిక సహకారాలను నిలిపివేస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీంతో అగ్రరాజ్యం ఆగ్రహానికి గురికావడం ఇష్టం లేక ఇరాక్ అగ్రనేతలు దిగివచ్చారు. అలీ అల్ జైదీకి రాజకీయాల్లో ఎటువంటి పూర్వ అనుభవం లేదు. ఇరాక్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా ఆయన రికార్డు సృష్టించనున్నారు. వృత్తిరీత్యా బ్యాంకర్, సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్ అయిన జైదీకి ఒక టీవీ ఛానెల్ కూడా ఉంది. ఎటువంటి వివాదాలు లేని వ్యక్తిగా పేరున్న జైదీని ఎంపిక చేయడం ద్వారా అటు అమెరికాను, ఇటు దేశీయ అవసరాలను సమతుల్యం చేయవచ్చని అధ్యక్షుడు అమేదీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, అలీ అల్ జైదీకి తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి 30 రోజుల గడువు ఉంది. అయితే ఆయన బాధ్యతలు చేపట్టగానే అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. ముఖ్యంగా ఇరాక్‌లో క్రియాశీలకంగా ఉన్న ఇరాన్ మద్దతు గల గ్రూపులను అదుపు చేయాలని వాషింగ్టన్ డిమాండ్ చేస్తోంది. దీనిని జైదీ ఏ విధంగా డీల్ చేస్తారనేది చూడాల్సి ఉంది. మరోవైపు, దేశ ఆర్థిక పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. హార్మూజ్ జలసంధిలో ఏర్పడిన ఉద్రిక్తతల వల్ల చమురు ఎగుమతులు దెబ్బతిని ఆదాయం పడిపోయింది. చమురుపైనే 90 శాతం ఆధారపడిన ఇరాక్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం జైదీకి అగ్నిపరీక్షే అని చెప్పాలి. గల్ఫ్ దేశాలతో సంబంధాలను పునరుద్ధరిస్తూనే, అగ్రరాజ్యాల మధ్య సమతుల్యతను కాపాడుకుంటూ ఆయన దేశాన్ని ఎలా ముందుకు నడిపిస్తారన్నది ప్రశ్నార్థకమే.

Publish Date: Apr 28, 2026 5:50PM

political-news-img

విశాఖలో గూగుల్ ... కొత్త యుగానికి పునాది : జీత్ అదానీ

విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదని.. ఒక కొత్త యుగానికి పునాదని అదానీ గ్రూప్‌ ఛైర్మన్ జీత్‌ అదానీ పేర్కొన్నారు. భారత డిజిటల్ భవిష్యత్తుకు విశాఖపట్నం నూతన ద్వారంగా ఎదుగుతోందన్నారు. వైజాగ్‌లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎనర్జీ, డేటా, కనెక్టివిటీ.. ఈ మూడు కలిసి భారత అభివృద్ధిని తదుపరి దశకు నడిపిస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ శతాబ్దాన్ని ముందుకు నడిపించే దేశాలు.. టెక్నాలజీని మాత్రమే కాదు, దాన్ని నిలబెట్టే శక్తిమంతమైన వ్యవస్థలను నిర్మించాలన్నారు. ఈ అవకాశానికి విశాఖ కేంద్రబిందువుగా నిలుస్తోందని చెప్పారు. ఇంటెలిజెన్స్ ఖర్చు అంటే పవర్ ఖర్చేనని, ఇదే భారతదేశానికి ఉన్న గొప్ప ప్రయోజనమని జీత్ అదానీ అన్నారు. ఈ రంగంలో అదానీ గ్రూప్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. దశాబ్దాలుగా భారత డిజిటల్ గేట్‌వేలు ముంబై, చెన్నై వరకు మాత్రమే పరిమితమయ్యాయన్నారు. కానీ ఇప్పుడు విశాఖ ఒక కొత్త అంతర్జాతీయ డిజిటల్ గేట్‌వేగా అవతరిస్తోందని వ్యాఖ్యానించారు. తక్కువ ఖర్చుతో కూడిన ఎనర్జీ ద్వారా కంప్యూట్ వ్యయం తగ్గి, ఆపై ఇంటెలిజెన్స్ ఖర్చు కూడా తగ్గుతుందని ఆయన వివరించారు. ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చినప్పుడు అవకాశాలు విస్తరిస్తాయని జీత్ అదానీ పేర్కొన్నారు

Publish Date: Apr 28, 2026 5:35PM

political-news-img

మొబైల్ మాయలో మనిషి: మీ బంధాన్ని కాపాడుకోండి!

ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు పక్కనే ఉన్నా ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉంటున్నాం. నేటి కాలంలో మొబైల్ ఫోన్ మన అందరికీ "మొదటి లైఫ్ పార్ట్నర్" (First Life Partner) గా మారిపోయింది. ఈ డిజిటల్ వ్యసనం వల్ల మన మధ్య ఉండాల్సిన క్వాలిటీ టైమ్ మాయమైపోతోంది. ఈ పరిస్థితిని మార్చుకుని, మళ్ళీ మన బంధాలను ఎలా చిగురింపజేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొబైల్ వాడకాన్ని ఎందుకు తగ్గించాలి? (Why Should We?) మొబైల్ పక్కన పెట్టి మనుషులతో గడపడం ఎందుకు ముఖ్యం అంటే: సరైన నిర్ణయాలు తీసుకోవడానికి: ముఖాముఖి మాట్లాడుకున్నప్పుడే ఒక విషయంపై చర్చించి సరైన నిర్ణయం (Decision making) తీసుకోగలం. గౌరవం ఇవ్వడం: ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూసుకోకుండా ఉండటం కనీస గౌరవం. బంధం బలపడటానికి: వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లేదా ఫ్యామిలీ మధ్య క్వాలిటీ టైమ్ గడపడం వల్ల అనుబంధం పెరుగుతుంది. ఏమి చేయకూడదు? (What Not To Do?) మనకు తెలియకుండానే చేసే ఈ తప్పులు బంధాలను దూరం చేస్తున్నాయి: మొదటి ప్రాధాన్యత ఇవ్వకండి: ఫోన్ కంటే ముందు మనిషికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫోన్ ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ కాకూడదు. మధ్యలో మాట్లాడకండి: ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో అకస్మాత్తుగా ఫోన్ కాల్ వస్తే అక్కడి నుండి వెళ్ళిపోవడం లేదా గట్టిగా మాట్లాడటం చేయకూడదు. దీనివల్ల అవతలి వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. ముఖ్యమైన సందర్భాల్లో వాడొద్దు: పెళ్లి చూపులు వంటి ముఖ్యమైన చర్చల్లో పాల్గొన్నప్పుడు మొబైల్స్ చూస్తూ కూర్చోవడం వల్ల వచ్చిన అసలు ఉద్దేశమే మర్చిపోయే ప్రమాదం ఉంది. ముందుకు వెళ్ళే మార్గం - చిట్కాలు (How-To Points): మొబైల్ వ్యసనం నుండి బయటపడటానికి ఈ చిన్న మార్పులు చేయండి: సెల్ఫ్ డిసిప్లిన్ (Self-discipline): మొబైల్ వాడకం విషయంలో మనకు మనమే ఒక క్రమశిక్షణ విధించుకోవాలి. సైలెంట్ మోడ్‌లో పెట్టండి: ఎవరితోనైనా క్వాలిటీ టైమ్ గడుపుతున్నప్పుడు లేదా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టి దూరంగా ఉంచండి. ముందే చెప్పండి: ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటే, వారికి "నేను ఒక గంట పాటు బిజీగా ఉంటాను, తర్వాత కాల్ చేస్తాను" అని మెసేజ్ పెట్టి మీ క్వాలిటీ టైమ్‌ను ఆస్వాదించండి. పరస్పర అంగీకారం: భార్యాభర్తలు ఇద్దరూ కలిసి "మనం బయటికి వెళ్ళినప్పుడు మొబైల్స్ వాడొద్దు" అని ఒక రూల్ పెట్టుకోవాలి. ఎవరైనా వాడితే రెండో వ్యక్తి నిర్మొహమాటంగా గుర్తు చేయాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A): ప్రశ్న: బోర్ కొట్టినప్పుడు మొబైల్ చూడటం తప్పా? సమాధానం: బోర్ కొట్టినప్పుడు ఫోన్ చూడటం సహజమే, కానీ ఎదురుగా ఒక మనిషి ఉన్నప్పుడు వారిని వదిలేసి ఫోన్ చూస్తూ కూర్చోవడం సరైన పద్ధతి కాదు. ఇది గౌరవం మరియు కామన్ సెన్స్ (Common sense) కి సంబంధించిన విషయం. ప్రశ్న: ఫోన్ వాడొద్దు అని చెబితే అవతలి వారు కోప్పడితే ఏం చేయాలి? సమాధానం: ఇది కోప్పడాల్సిన విషయం కాదు. "మనం ఈ సమయాన్ని సరదాగా గడపడానికి వచ్చాం, కాసేపు ఫోన్ పక్కన పెడదాం" అని సున్నితంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. మొబైల్ ఫోన్ అనేది మన అవసరానికి మాత్రమే, మన జీవితం అవ్వకూడదు. మన కళ్ళ ముందు ఉన్న మనుషుల కంటే, ఆ స్క్రీన్ లో కనిపించే ప్రపంచం ముఖ్యం కాదు. కాబట్టి, నేటి నుండే మీ మొబైల్‌ను కాసేపు పక్కన పెట్టి మీ ప్రియమైన వారితో ఆనందంగా గడపండి. అది మీ సెల్ఫ్ డిసిప్లిన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా Naveena Column యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి! సబ్స్క్రైబ్ చేసుకోండి.

Publish Date: Apr 28, 2026 5:20PM

political-news-img

రామరాజ్యం.. పర్ ఫెక్షన్ కాదు.. కరెక్షన్ ప్రాసెస్

రామరాజ్యం ఎప్పుడు వస్తుంది? ఇటీవలి కాలంలో ఈ ప్రశ్న తరచూ వినిపిస్తోంది. అయితే.. రామరాజ్యం అంటే పరిపూర్ణం.. అంటే పెర్ఫట్ అని అర్ధం కాదు.. అది నిరంతర కరెక్షన్ ప్రాసెస్ అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇండియాలో జరుగుతున్నది అదే. అంటే మనం ఉన్నది రామరాజ్యంలోనే.. ఈ ఇప్పుడు భారత్ లో కేవలం అభివృద్ధి మాత్రమే జగరడం లేదు.. వలసవాద నిర్మూలన (డీ కొలనైజేషన్) ప్రాసెస్ జరుగుతోంది. పాతికేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని గమనించినట్లైతే.. ఇండియా అనూహ్య రీతిలో అభివృద్ధి చెందింది. 2000 - 2025 మధ్య కాలంలో దేశం సాధించిన ఆర్థిక, సామాజిక మార్పులు కేవలం గణాంకాలకే పరిమితం కాదు.. ఒక నూతన జాతీయ చైతన్యాన్ని ప్రతిబింబంకూడా. రామరాజ్యం అంటే ఏదో అద్భుతం జరుగుతుందని ఎదురుచూడటం కాదు.. ప్రస్తుత వ్యవస్థలో జరుగుతున్న సానుకూల మార్పులను గుర్తించి, ఆమోదించడమే. ఆర్థిక గణాంకాలను పరిశీలిస్తే, 2000 సంవత్సరంలో 460 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత జీడీపీ ఇప్పుడు 4.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. తలసరి ఆదాయం 450 డాలర్ల నుండి 2700 డాలర్లకు పెరగడమే కాకుండా, పేదరికం 45 శాతం నుండి 12 శాతానికి గణనీయంగా తగ్గింది. ఆయుర్దాయం62 నుంచి 70 ఏళ్లకు పెరిగింది. ఆహార భద్రతను అధిగమించి దేశం ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఎదిగింది. మధ్య తరగతి జనాభా5 కోట్ల నుంచి 30 కోట్లకు పెరిగింది. ఆసుపత్రులు18 వేల నుంచి 70 వేలకు, అక్షరాస్యత 77శాతానికి పెరిగాయి. ఇక విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, డిజిటల్ లావాదేవీలు, విశ్వవిద్యాలయాలు ఐఐటీలు మెడికల్ కాలేజీలు ఇలా అభివృద్ధి చెందని రంగం అంటే లేదన్నట్లుగా ఇండియా ప్రగతి బాటలో దూసుకువెడుతున్నది. ఐఐటీలు, మెడికల్ కాలేజీల సంఖ్య పెరగడంతో పాటు, రక్షణ రంగ ఎగుమతులు జీరో నుండి 20 వేల కోట్ల రూపాయలకు చేరడం దేశ స్వయం సమృద్ధికి నిదర్శనం. కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా, దేశం తన వలసవాద గుర్తులను చెరిపివేస్తూ స్వయం అస్తిత్వాన్ని చాటుకుంటోంది. రాజ్ పథ్ కర్తవ్య పథ్ గా మారడం, కొత్త పార్లమెంటు నిర్మాణం, సెంగోల్ స్థాపన వంటివి కేవలం భౌతిక మార్పులు కావు.. ఇవి భారతీయ ఆత్మగౌరవానికి ప్రతీకలు. దీనికి తోడు అయోధ్యలో రామమందిరం, కాశీ విశ్వనాథ్ కారిడార్ వంటి ఆధ్యాత్మిక ప్రాజెక్టులు దేశ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించాయి. ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో, భారత్ అత్యంత స్థిరమైన వ్యవస్థగా ఎదుగుతోంది. మెకాలే విద్యావిధానం స్థానంలో మాతృభాషలకు ప్రాధాన్యతనిచ్చే నూతన పద్ధతులు, భారతీయ న్యాయ సంహిత వంటి సంస్కరణలు వ్యవస్థలో వేళ్లూనుకున్న పాత చట్టాలను ప్రక్షాళన చేస్తున్నాయి. ఈ మార్పులన్నీ దేశం సరైన దిశలో పయనిస్తోందనడానికి నిదర్శనాలుగా చెప్పుకోవాలి. అయితే.. ఈ ప్రగతి ఫలాలు పూర్తిస్థాయిలో అందాలంటే కేవలం ప్రభుత్వంపైనే ఆధారపడకుండా పౌరుల బాధ్యత కూడా కీలకం. అవినీతి రహిత సమాజం, అర్హతకు ప్రాధాన్యతనిచ్చే వ్యవస్థ ఏర్పడాలంటే ప్రతి వ్యక్తి తనలోని నైతికతను మేల్కొల్పాల్సిన అవసరం ఉంది. దేశ విభజన శక్తులకు తావు లేకుండా, భారత్ పట్ల గౌరవంతో మెలగడమే రామరాజ్య స్థాపనకు అసలైన మార్గం. మీకు ఈ విశ్లేషణ నచ్చినట్లైతే ‘తెలుగువన్’ ను ఫాలో అవ్వండి. షేర్ చేయండి -సీతారాం కంఠంనేని references ప్రపంచ బ్యాంక్ డేటా (World Bank Data): GDP, తలసరి ఆదాయం, పేదరికం ఆర్థిక సర్వే 2024-25, భారత ప్రభుత్వం (Economic Survey, Govt of India) NITI ఆయోగ్: బహుముఖ పేదరికం నివేదిక (Multidimensional Poverty Index) RBI డిజిటల్ లావాదేవీల నివేదిక (Digital Payment Report) UGC/AICTE: విశ్వవిద్యాలయాలు, కళాశాలల గణాంకాలు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఎగుమతి నివేదిక, 2024-25 NHAI: జాతీయ రహదారుల గణాంకాలు AAO: విమానాశ్రయాల విస్తరణ నివేదిక ప్రభుత్వం ప్రకటించిన పేదరికం నిష్పత్తి (NITI ఆయోగ్, 2024) రామమందిరం, కాశీ, మహాకాల్ ప్రాజెక్టుల వివరాలు – భారత ప్రభుత్వం, పర్యాటకం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నివేదికలు

Publish Date: Apr 28, 2026 5:19PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img