మరీ అన్ని తప్పటడుగులా జగన్?

Publish Date:May 13, 2015

Advertisement

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గత ఆరేళ్ళ బట్టి ప్రత్యక్ష రాజకీయాలలోనే ఉంటునప్పటికీ, ఇప్పటికీ తప్పటడుగులు వేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. గత 8 రోజులుగా సమ్మె చేస్తున్నఆర్టీసీ కార్మికులకు అండగా తమ పార్టీ నిలబడుతుందని, అరొక నాలుగయిదు రోజులలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాల డిమాండ్లను పరిష్కరించి వారిచేత సమ్మె విరమింపజేయలేకపోతే తమ పార్టీ వారికి సమ్మెకు మద్దతుగా రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే ఎంతసేపు ఏదో ఒక వర్గాన్ని తనవైపు త్రిప్పుకోవాలనే యావే గానీ దాని వెనుక ఉండే సమస్యల గురించి ఆయన ఆలోచించ(లే)రని ఆయన చేసిన ఈ హెచ్చరిక స్పష్టం చేస్తోంది. ఆర్టీసీ కార్మికుల సంఘాలు తక్షణమే సమ్మె విరమించాలని, లేకుంటే చట్టపరమయిన చర్యలు చేప్పట్టవలసి వస్తుందని మొన్న హైకోర్టు హెచ్చరించిన తరువాత జగన్మోహన్ రెడ్డి అనంతపురం బస్టాండ్ లో సమ్మె చేస్తున్న కార్మికులను కలిసి వారికి మద్దతు ప్రకటించిన తరువాత ప్రభుత్వానికి ఈ హెచ్చరిక చేసారు. అంటే హైకోర్టు ఆర్టీసీ కార్మికులను సమ్మె విరమించమని హెచ్చరిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి వారిని సమ్మె చేయమని ప్రోత్సహిస్తున్నట్లుంది.

 

హైకోర్టు ఆదేశాలను కాదని వారు తమ సమ్మె కొనసాగించినందుకు ఈరోజు కార్మిక సంఘాలకు కోర్టు ధిక్కారణ నేరం క్రింద షో కాజ్ నోటీసులు జారీ చేసింది. సమ్మె చేస్తున్న వారందరిపై ఎస్మా చట్టం ప్రయోగించమని ప్రభుత్వాలను ఆదేశించింది. సమ్మె వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నందున తాత్కాలిక ఉద్యోగులతో బస్సులను నడుపమని, వాటికి ఎవరయినా అడ్డుతగిలితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయమని హైకోర్టు ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాలను ఆదేశించింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఇంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తునప్పుడు తెలివయిన ఏ రాజకీయనాయకుడు కోర్టుతో చెలగాటం ఆడే ఆలోచన కూడా చేయడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూడా అనంతపురం జిల్లాలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకి తమ పార్టీ మద్దతు ఉంటుందని ప్రకటించడం విశేషం. కోర్టు వద్దని చెపుతున్న సమ్మెకు ఆయన మద్దతు ప్రకటించడం చూస్తే ఇంకా ఎంతకాలం ఇలా తప్పటడుగులు వేస్తారో అనే అనుమానం కలుగుకమానదు.

 

తాజా సమాచారం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాలు కోరుతున్నట్లుగానే 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు అంగీకరించింది. కనుక ఈరోజు నుండి వారు సమ్మె విరమించే అవకాశం ఉంది. తను చేసిన హెచ్చరికకు భయపడే ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం దిగి వచ్చిందని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పుకొంటారేమో?

By
en-us Political News

  
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.