కన్నీళ్లు పెట్టించే కథ…సెల్ఫీ వీడియోతో ముగిసిన జీవితం!

Publish Date:Apr 30, 2026

Advertisement

 

మరిదితో కాపురం చేయాలని భర్త, అత్తమామలు ఒత్తిడి...

 సెల్ఫీ వీడియో తీసి వివాహిత ఆత్మహత్య..

బెంగళూరు శివార్లలో వెలుగుచూసిన ఒక విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అదనపు కట్నం కోసం అత్తింటివారు పెట్టిన వేధింపులు భరించలేక ఓ వివాహిత ప్రాణాలు తీసుకుంది. తన మరణానికి గల కారణాలను వివరిస్తూ, కన్నీళ్లతో ఓ సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసి డ్యామ్‌లో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన సమాజంలో మారుతున్న మానవ సంబంధాలకు, వరకట్న పిశాచి కోరలకు అద్దం పడుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. దొడ్డబళ్లాపుర తాలూకా సోతెనహళ్లికి చెందిన పుష్ప (23)కు ఏడేళ్ల క్రితం తపసీహళ్లికి చెందిన వేణుతో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో పుష్ప తల్లిదండ్రులు తమ స్తోమతకు తగ్గట్టుగా భారీగానే కట్నకానుకలు సమర్పించారు. అయితే, పెళ్లయిన కొద్దిరోజులకే భర్త, అత్తమామల అసలు రూపం బయటపడింది. అదనపు కట్నం తేవాలని ఆమెను శారీరకంగా, మానసికగా హింసించడం మొదలుపెట్టారు.

పుష్ప ఆత్మహత్యకు ముందు రికార్డ్ చేసిన వీడియోలో తన ఆవేదననంతా వెళ్లగక్కింది. భర్త వేణు తనను దారుణంగా వేధించడమే కాకుండా, తన సోదరుడు (మరిది)తో కలిసి ఉండాలని ఒత్తిడి చేసేవాడని పేర్కొనడం విస్తుగొలుపుతోంది. మరో వివాహం చేసుకోవాలనే దురాశతో తనను వదిలించుకోవడానికి భర్త యత్నించాడని, ఒకానొక దశలో ఆహారంలో విషం కలిపి తనను చంపే ప్రయత్నం కూడా చేశారని ఆమె కన్నీటి పర్యంతమైంది.

అంతేకాకుండా, పెళ్లి సమయంలో ఇచ్చిన ఆస్తికి సంబంధించిన పత్రాల విషయంలో కూడా ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన పుష్ప, బెంగళూరు సమీపంలోని విశ్వేశ్వరయ్య పిక్ అప్ డ్యామ్ వద్దకు చేరుకుని, తన సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసిన అనంతరం నీటిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.

ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెను పొట్టనబెట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం కట్నం కోసమే కాకుండా, అమానవీయమైన కోరికలతో పుష్పను నరకయాతనకు గురిచేశారని వారు ఆరోపిస్తున్నారు. చదువుకున్న వారు కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడటంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పుష్ప రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో ఆధారంగా భర్త వేణును, మామను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

By
en-us Political News

  
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు.
కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు (మే 1) శుక్రవారం పర్యటించనున్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రక్షణ రంగ పరికరాల తయారీలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పాత్ర అత్యంత కీలకం. ప్రస్తుతం ఈ ఖనిజాల ఉత్పత్తిలో చైనా ప్రపంచ దేశాలను శాసిస్తోంది. అయితే.. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో ఈ అరుదైన ఖనిజాలు అపారంగా నిక్షిప్తమై ఉన్నాయనీ.. వీటిని సమర్థవంతంగా వెలికితీస్తే చైనాపై ఆధారపడటాన్ని భారత్ పూర్తిగా తగ్గించుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
హైదరాబాద్ నగరానికి గర్వకారణమైన వైద్య విజయం నమోదైంది.
వైసీపీ అనుకూలుడిగా పలు అక్రమాలకు పాల్పడి .. పనిష్మెంట్‌లో ఉన్న సీఐ తన అరాచక బుద్ది మాత్రం మార్చుకోలేదు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది.
కరాచీ వంటి ప్రధాన నగరాల్లో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల కొరత వేధిస్తోంది. దీంతో స్థానికులు భారీ పరిమాణంలో ఉన్న ప్లాస్టిక్ బెలూన్లను అంటే సంచులను ఇంధనాన్ని నిల్వ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. గ్యాస్ సరఫరా చేసే ప్రధాన పైపుల నుంచి ఈ బెలూన్లలోకి నేరుగా గ్యాస్‌ను నింపుతున్నారు. చిన్నపాటి లీకేజీ లేదా నిప్పు రవ్వ తగిలినా క్షణాల్లో పేలిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ.. గత్యంతరం లేని స్థితిలో ప్రజలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల (బీసీ) సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
కాకాణి గోవర్ధన్ రెడ్డికి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది.
ఇటీవల ఒక ప్రత్యేక సందర్భంలో వీరిద్దరూ కలిసినప్పుడు, వారి మధ్య జరిగిన సంభాషణ చాలా హుందాగా, ఆత్మీయంగా సాగింది. సచిన్ టెండూల్కర్ క్రీడా రంగానికి చేసిన సేవలను కొనియాడుతూనే.. వ్యక్తిగతంగా ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని లోకేష్ చాటుకున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు ప్రముఖులతో కలిసినప్పుడు అది కేవలం ఒక ఫోటో షూట్‌కో లేదా మర్యాదపూర్వక భేటీకో పరిమితం అవుతుంది. కానీ లోకేష్, సచిన్ విషయంలో మాత్రం వారి మధ్య ఉన్న పాత జ్ఞాపకాలు, ఉమ్మడి అభిరుచులు వారి సంభాషణలో ప్రతిబింబించాయి.
భారతీయ మూలాలను కలిగిన మమ్దానీ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. కింగ్ చార్లెస్-3 ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.