పంతొమ్మది వందల నలభయ్యో సంవత్సరంలో అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మిస్ జింజర్ అనే ఒక బ్యూటీ గ్రాడ్యుయేషన్ చదువుతూ వుండేది. ఈ మిస్ జింజర్ మిస్టర్ హిస్లాప్ అనే తన క్లాస్మేట్తో పీకల్లోతు ప్రేమలో వుండేది. మన జింజర్ పిల్ల ప్రతిరోజూ యూనివర్సిటీలో పాఠాలు నేర్చుకుంటూ, సాయంత్రం అవగానే తన బోయ్ఫ్రెండ్ దగ్గర ప్రేమపాఠాలు నేర్చుకుంటూ హ్యాపీగా వుండేది. ఇంతలో రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. జింజర్ లవర్ హిస్లాప్ సైన్యంలోకి వెళ్ళి యుద్ధం చేయాల్సి వచ్చింది. దాంతో జింజర్, హిస్లాప్ యూనివర్సిటీని విడిచి వెళ్ళిపోయారు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత హిస్లాప్ యుద్ధానికి వెళ్ళిపోయాడు. యుద్ధానికి వెళ్ళిన హిస్లాప్ తిరిగి వచ్చాడు.. కానీ, మధ్యలో ఆగిపోయిన మిసెస్ జింజర్ చదువు మాత్రం కొనసాగలేదు. ఎప్పటికప్పుడు చదువుకోవాలని అనుకున్నా, సంసార బాధ్యత కారణంగా కుదర్లేదు. ఏమయితేనేం, మొత్తానికి మన జింజర్ పాప తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. ఎప్పుడనుకుంటున్నారు? ఏ పంతొమ్మిది వందల నలభై ఐదులోనో... యాభైలోనో కాదు.. రెండు వేల ఇరవై నాలుగులో! నమ్మలేకపోతున్నారు కదూ... మన జింజర్ బామ్మ తన 105 సంవత్సరాల వయసులో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. రెండ్రోజుల క్రితం జరిగిన కాన్వొకేషన్లో హెరిటేజ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. ఈ కాన్వొకేషన్లో మన జింజర్ బామ్మ మనవళ్ళు, మునిమనవరాళ్ళు కూడా పాల్గొన్నారు. ఓకే.. కంగ్రాట్స్ జింజర్ బామ్మా...!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/woman-graduated-at-105-years-age-39-179795.html
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య శనివారం నాడు జరిగే చారిత్రక సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.
నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి హైదరాబాద్కి వచ్చిన చంద్రబాబు నాయుడికి హైదరాబాద్ నగరం ఘన స్వాగతం పలికింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లా రైతులకు సాగునీరు, తాగునీటికి ఊరటనిచ్చే పట్టిసీమ ఎత్తిపోతలతో పథకాన్ని గత అయిదేళ్లుగా ప్రభుత్వం పక్కన పెట్టివేసింది. గత ఏడాది తాగునీటి ఎద్దడిని తట్టుకోలేక కొద్ది రోజులు పట్టిసీమను వినియోగించి ప్రభుత్వం మమ అనిపించింది. ఈ ఏడాది నాగార్జున ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరటంతో .. కృష్ణా, గుంటూరు జిల్లాలు తాగునీటి కోసం తల్లడిల్లిపోతున్నాయి. కనీసం కృష్ణాజిల్లా రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో పట్టిసీమ మోటార్లతో నీటి తరలింపు ప్రారంభించారు.
కేతిరెడ్డికి జగన్ విజయవాడకి రమ్మని కబురు చేశారట. అయితే కేతిరెడ్డి మాత్రం నేను ఇప్పుడు రాలేను.. నా మనసేమీ బాగాలేదు అని రిప్లయ్ ఇచ్చారట.
ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా.. చేసిన పాపాలకు అసలు వడ్డీతో టి సిసలుగా ఫలితంబు అనుభవించుట తధ్యమన్నా.. అంటూ సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఓ సినిమాలో ఓ పాట ఉంది. జీవితంలో మనంచేసే మంచి చెడులకు ఫలితాలు తప్పకుండా అనుభవించాల్సి వస్తుందని దీని సారాంశం. ఈ పాట మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అతికినట్లు సరిపోతుంది.
తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు పీక్స్ కు చేరాయి. హిందుత్వ భావజానం, ఆర్ఎస్ఎస్ బీజేపీకి మెంటార్ గా వ్యవహరించడం.. అన్నిటికీ మించి బీజేపీలోకి బయటి పార్టీలకు వచ్చిన వారిని తొలి నుంచీ పార్టీలో ఉన్నవారు మనస్ఫూర్తిగా కలుపుకునే పరిస్థితి లేకపోవడం సహజప రిణామంగా అంతా భావించేవారు. వామపక్ష పార్టీలు, బీజేపీలు కన్జర్వేటివ్ పొలిటికల్ పార్టీలకు భిన్నంగా సైద్ధాంతిక నిబద్ధతతో ఉంటాయని భావించేవారు. అయితే బీజేపీలో ఇప్పుడా పరిస్థితి లేదు.
కోడి సాధారణంగా పొయ్యి మీద వున్న గిన్నెలోకి చేరుతుంది.. కానీ, బ్రిటీష్ కొలంబియాలో ఒక కోడి గిన్నిస్ బుక్కులోకి చేరింది. ప్రపంచం మొత్తంలో అంకెలను, రంగులను గుర్తుపట్టి చెప్పగలిగే కోడిగా ఈ కోడి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించింది.
వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి రిమాండ్లో వున్న రేపిస్టు సుధాకర్ని పరామర్శించాల్సిన అవసరం వుంది. హత్యాయత్నం కేసులో జైల్లో వున్న తన పార్టీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పాతిక లక్షల రూపాయల ఖర్చు పెట్టించి పరామర్శించిన జగన్, ఇప్పుడు రేప్ కేసులో అరెస్టు అయిన సుధాకర్ని కూడా పరామర్శించాలి.
ఆయన తొలి సారి ఎంపీగా ఎన్నికయ్యారు. అతి సామాన్య కుటుంబ నేపథ్యం ఆయనది. రెండు దశాబ్దాల కిందట తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా పని చేస్తూ వస్తున్నారు. ఎన్నడూ పదవుల కోసం పాకులాడలేదు. తన పనితీరు ద్వారానే పార్టీ అధినేతను మెప్పించారు.
ఎక్కడో రంపచోడవరం గిరిజన గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేసే ఒక యువతి ఎమ్మెల్యే అవుతుందని ఎవరైనా ఊహించగలరా? ఎవరో వేరేవారు ఊహించడం కాదు.. సాక్షాత్తూ ఆ యువతి కూడా ఊహించలేదు.
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు కైవసం చేసుకున్న నేపథ్యంలో బిఆర్ఎస్ ఎల్ పిని కాంగ్రెస్ ఎల్ పిలో చేర్చుకునే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఒక్కసారిగా ఆరుగురు కాంగ్రెస్ లో చేరిపోయారు.
టెక్సాస్లో వుండే మోనికా రిలే అనే ఓ బొద్దుగుమ్మ మాత్రం ఇలా అనుకోవడం లేదు. తాను బరువు బాగా పెరిగిపోవాలని కోరుకుంటోంది. అలా బరువు పెరగడం కోసం.... మూడు పూటలా కాదు... ఆరుపూటలా తింటూ కృషి చేస్తోంది.