Publish Date:Aug 12, 2023
ఆంధ్రప్రదేశ్ లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అధికార వైసీపీ నాయకులు కార్యకర్తలు ఏమైనా మాట్లా డొచ్చు.. ఎక్కడికైనాన వెళ్లొచ్చు. అదే విపక్ష నాయకుల దగ్గరకు వచ్చేసరికి వారెక్కడ పర్యటించాలో , వారే దారిలో వెళ్లాలో ప్రభుత్వం లేదా పోలీసులు.. వాస్తవానికి ప్రభుత్వమే పోలీసు వ్యవస్థను శాసిస్తోంది. ప్రభుత్వం ఏం చెబితే పోలీసు వ్యవస్థ అదే చేస్తున్న దుస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు సమీపించే కొద్దీ ఇక విపక్ష నేతలు ఏం మాట్లాడాలో కూడా పోలీసులే చెప్పే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు.
చంద్రబాబు పర్యటన సందర్భంగా గానీ, తాజాగా పవన్ కల్యాణ్ వారాహీయాత్రలో భాగంగా విశాఖలో జరిగిన సంఘటనలు చూస్తే రానున్న రోజులలో అదే జరుగుతుందని అనిపించక మానదు. పవన్ యాత్ర రోడ్డుకు ఎటు వైపు వెళ్లాలో.. ఆయన వెంట ఎంత మంది ప్రజలు ఉండాలో ఇత్యాది విషయాలన్నిటినీ పోలీసులే నిర్ణయించేశారు. ఇక సముద్ర తీర ప్రాంతమైన రిషి కొండలో జగన్ వినా మరెవ్వరూ ఉండటానికి వీల్లేదంటూ కండీషన్ పెట్టారు. ఈ మేరకు పవన్ కు నోటీసులూ జారీ చేశారు. ఆయన రోడ్డు కు ఎడమవైపు మాత్రమే పర్యటించాలనీ, కుడివైపునకు వెళ్లకూడదనీ రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అసలు ఆయన విశాఖలో రోడ్ షో చేయడానికే వీళ్లేదనీ, నేరుగా సభావేదిక వద్దకు వెళ్లి ప్రసంగించి వెళ్లిపోవాలనీ హుకుం జారీ చేశారు. రాష్ట్రంలో విపక్షాల మూవ్ మెంట్ ను నియంత్రించి.. నియంత్రించి అనేమిటి అసలు లేకుండా చేసి.. ప్రభుత్వ వ్యతిరేక గళాలు ప్రజలకు చేరకుండా చేయడమే లక్ష్యంగా జగన్ సర్కార్ రాష్ట్రాన్ని ఆంక్షల చట్రంలో బిగించేందుకు ప్రయత్నిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఆయన నిలుచున్న స్టూల్, ఆయన కోసం ఉన్న ప్రచార రథాలను సీజ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. అలాగే గతంలో చంద్రబాబు అనపర్తి, కుప్పం పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరునూ ప్రస్తావిస్తున్నారు. రానున్న రోజులలో విపక్ష నేతలు మాట్లాడాల్సిన ప్రసంగం స్క్రిప్టును కూడా పోలీసులో, సకల శాఖల మంత్రో రాసి అదే చదవాలని ఆదేశాలు జారీ చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని నెటిజన్లు ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/will-police-decide-opposition-leaders-speaches-39-159874.html
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.