అలిపిరి నడక మార్గంలో చిన్నారిని బలితీసుకున్న చిరుత

Publish Date:Aug 12, 2023

Advertisement

తిరుమల దేవుడిని దర్శించుకునేందుకు నడక మార్గంలో వెళ్లే భక్తుల భద్రత గాలిలో దీపంగా మారింది. తరచుగా ఆ మార్గంలో వన్యమృగాల సంచారాన్ని గుర్తించినప్పటికీ అవసరమైన భద్రతా చర్యలు తీసుకునే విషయంలో మాత్రం టీటీడీ ఘోరంగా విఫలమౌతున్నది. ఇప్పటి వరకూ పలు సంఘటనల్లో వన్యమృగాల దాడిలో భక్తుల గాయపడిన సంఘటనలు చూశాం కానీ తాజాగా చిరుతపులి దాడిలో ఓ ఆరేళ్ల చిన్నారి మృత్యువాత పడింది.  

అలిపిరినడక మార్గంలో వెళ్తుండగా ఆరేళ్ల బాలికపై చిరుత దాడి చేసి చంపేసింది. తిరుమలకు వెళ్తుండగా చోటు చేసుకున్న ఈ ఘటన భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సిబ్బంది.. ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తిరుమల దేవుడిని దర్శించుకునేందుకు నడకదారిలో వెడుతున్న ఓ కుటుంబం బిడ్డను కోల్పోవడం అంత్యంత విషాదం
 
 నెల్లూరుకు చెందిన ఓ కుటుంబం శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో అలిపిరి నడకమార్గం ద్వారా  కొండపైకి బయలుదేరింది. అర్థరాత్రికి కొంచం ముందు అంటే రాత్రి పదకొండు గంటల సమయానికి  ఆ కుటుంబం లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకుంది.   ఆ సమయంలోనే వారి ఆరేళ్ల పాప లక్షిత కనిపించకుండా పోయింది. కంగారుపడిన కుటుంబం ఆమె కోసం ఆ ప్రాంతం అంతా గాలించింది. ఫలితం లేకపోవడంతో పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేఇశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ తరువాత అడవిలో గాలింపు చేపట్టారు.  ఫారెస్టు సిబ్బంది సహకారంతో అడవిలో గాలింపు చేపట్టగా చిన్నారి లక్షిత మృతదేహం లభ్యమైంది. చిరుత దాడిలో ఆ చిన్నారి మరణించిందని నిర్ధారించారు. 

తిరుమల నడకదారిలో చిరుత దాడులు దాదాపుగా నిత్యకృత్యమయ్యాయి. ఈ ఏడాది జూన్ 23న కూడా ఇటువంి సంఘటనే జరిగింది. కర్నూలు జిల్లా ఆదోని హనుమాన్ నగర్ కు చెందిన కుటుంబం నడకదారిలో శ్రీవారి కొండపైకి వెడుతుండగా ఏడో మైలు రాయి వద్ద చిరుత  దాడి చేసి వారి ఐదేళ్ల కుమారుడు కౌశిక్ ను నోట  కరచుకుని అడవిలోకి పారిపోయింది. అయితే కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేయడంతో చిరుత భయపడి కౌశిక్ ను వదిలేసి పారిపోయింది. తీవ్రంగా గాయపడిన కౌశిక్ ఆ తరువాత ఆస్పత్రిలో కోలుకున్నాడు.  

ఈ సంఘటన తరువాత టీటీడీ అధికారులు అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులకు పలు జాగ్రత్తలు సూచించారు. గుంపులుగా వెళ్లాలని, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.  అలాగే భక్తుల భద్రత కోసం అవసరమైన చోట ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామనీ చెప్పారు. అయితే అవేమీ పెద్దగా ఫలితమివ్వలేదని తాజా ఘటన ద్వారా తేటతెల్లమైంది. ఇప్పటికైనా అలిపిరి నడక మార్గంలో  పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. 

By
en-us Political News

  
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బ‌లోపేతం, స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.