Publish Date:Aug 12, 2023
తిరుమల దేవుడిని దర్శించుకునేందుకు నడక మార్గంలో వెళ్లే భక్తుల భద్రత గాలిలో దీపంగా మారింది. తరచుగా ఆ మార్గంలో వన్యమృగాల సంచారాన్ని గుర్తించినప్పటికీ అవసరమైన భద్రతా చర్యలు తీసుకునే విషయంలో మాత్రం టీటీడీ ఘోరంగా విఫలమౌతున్నది. ఇప్పటి వరకూ పలు సంఘటనల్లో వన్యమృగాల దాడిలో భక్తుల గాయపడిన సంఘటనలు చూశాం కానీ తాజాగా చిరుతపులి దాడిలో ఓ ఆరేళ్ల చిన్నారి మృత్యువాత పడింది.
అలిపిరినడక మార్గంలో వెళ్తుండగా ఆరేళ్ల బాలికపై చిరుత దాడి చేసి చంపేసింది. తిరుమలకు వెళ్తుండగా చోటు చేసుకున్న ఈ ఘటన భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సిబ్బంది.. ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తిరుమల దేవుడిని దర్శించుకునేందుకు నడకదారిలో వెడుతున్న ఓ కుటుంబం బిడ్డను కోల్పోవడం అంత్యంత విషాదం
నెల్లూరుకు చెందిన ఓ కుటుంబం శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో అలిపిరి నడకమార్గం ద్వారా కొండపైకి బయలుదేరింది. అర్థరాత్రికి కొంచం ముందు అంటే రాత్రి పదకొండు గంటల సమయానికి ఆ కుటుంబం లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకుంది. ఆ సమయంలోనే వారి ఆరేళ్ల పాప లక్షిత కనిపించకుండా పోయింది. కంగారుపడిన కుటుంబం ఆమె కోసం ఆ ప్రాంతం అంతా గాలించింది. ఫలితం లేకపోవడంతో పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేఇశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ తరువాత అడవిలో గాలింపు చేపట్టారు. ఫారెస్టు సిబ్బంది సహకారంతో అడవిలో గాలింపు చేపట్టగా చిన్నారి లక్షిత మృతదేహం లభ్యమైంది. చిరుత దాడిలో ఆ చిన్నారి మరణించిందని నిర్ధారించారు.
తిరుమల నడకదారిలో చిరుత దాడులు దాదాపుగా నిత్యకృత్యమయ్యాయి. ఈ ఏడాది జూన్ 23న కూడా ఇటువంి సంఘటనే జరిగింది. కర్నూలు జిల్లా ఆదోని హనుమాన్ నగర్ కు చెందిన కుటుంబం నడకదారిలో శ్రీవారి కొండపైకి వెడుతుండగా ఏడో మైలు రాయి వద్ద చిరుత దాడి చేసి వారి ఐదేళ్ల కుమారుడు కౌశిక్ ను నోట కరచుకుని అడవిలోకి పారిపోయింది. అయితే కుటుంబ సభ్యులు గట్టిగా కేకలు వేయడంతో చిరుత భయపడి కౌశిక్ ను వదిలేసి పారిపోయింది. తీవ్రంగా గాయపడిన కౌశిక్ ఆ తరువాత ఆస్పత్రిలో కోలుకున్నాడు.
ఈ సంఘటన తరువాత టీటీడీ అధికారులు అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులకు పలు జాగ్రత్తలు సూచించారు. గుంపులుగా వెళ్లాలని, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అలాగే భక్తుల భద్రత కోసం అవసరమైన చోట ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామనీ చెప్పారు. అయితే అవేమీ పెద్దగా ఫలితమివ్వలేదని తాజా ఘటన ద్వారా తేటతెల్లమైంది. ఇప్పటికైనా అలిపిరి నడక మార్గంలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chiruta-killed-six-years-girl-39-159885.html
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.