ఏపీలో నిన్న మెన్నటి దాకా హల్ చల్ చేసిన పోలవరం రివర్స్ టెండరింగ్ సంగతి మనందరికి తెలిసిందే .ఆంధ్రప్రదేశ్ కు జీవ నాడి వంటి పోలవరం సాగు నీటి ప్రాజెక్టుపై బిజెపి దృష్టి పెట్టింది. పోలవరం వ్యవహారంలో ఒక విధానమంటూ లేకుండా ప్రకటనలు చేస్తూ వచ్చిన బిజెపి ఇప్పుడు దానిపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. పోలవరం పరిహారంలో అవినీతి జరిగిందని కొందరు, రివర్సు టెండర్ల వల్ల నష్టం జరిగిందని మరి కొందరు బిజెపి నేతలు ఇప్పటి వరకూ ఆరోపణలు చేస్తూ వచ్చారు. రాష్ట్రంలో రెండు కీలక ప్రాజెక్టులలో ఒకటైన రాజధాని అమరావతిపై తమ అభిప్రాయాన్ని స్పష్టం చేసిన బిజెపి నేతలు పోలవరం విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. గత ఐదేళ్ల కాలంలో పరిహారం విషయంలో అక్రమాలు జరిగాయని కొందరు నేతలు ఆరోపిస్తూ వచ్చారు.
ఇప్పుడు కూడా అదే వాదన వినిపిస్తున్నారు. అదే సమయంలో కేంద్రం వద్దంటున్నా రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండర్ లకు వెళ్లింది దీనిపై పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ఎంపీ సుజనా చౌదరి దీనిపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు కూడా చేశారు. పోలవరంపై ఇప్పటి వరకూ రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేసిన బిజెపి నేతలు దానిపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. గతం నుంచి అవినీతి ఆరోపణలు చేస్తున్న బిజెపి ఇప్పుడు ప్రాజెక్టు విజిట్ కు ప్లాన్ చేసింది. ఈ నెల పదకొండు న బీజేపీ బృందం పోలవరం ప్రాంతాన్ని సందర్శించనుంది. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు ముంపు ప్రాంతాల్లో పరిహారానికి సంబంధించి జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై దృష్టి పెట్టనుంది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా, అసలు బిజెపి ఇప్పుడు ఏం డిమాండ్ చేయబోతుందనేది తేలాల్సివుంది. ఓవైౖపు రివర్స్ టెండర్ల ప్రక్రియను రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షంతో పాటు కేంద్రమంత్రి కూడా వ్యతిరేకించారు. అయితే ఇప్పుడు రివర్స్ టెండర్ల వ్యవహారంలో ప్రభుత్వం ఎనిమిది వందల కోట్లు ఆదా చేసినట్టు ప్రకటించింది. దీనిపై ఇప్పుడు కేంద్రం ఏం చెబుతుంది అనేది కూడా తేలాల్సి ఉంది.
మరోవైపు కేంద్రం నుంచి పోలవరానికి సంబంధించి ఆరువేల కోట్లు పెండింగ్ నిధులు విడుదల కావలసి ఉంది, వాటిని ఇప్పటి వరకూ విడుదల చేయలేదు. దీంతో అసలు పోలవరం విషయంలో బిజెపి లైన్ ఏంటనేది ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో కొందరు నేతలు పోలవరం నిర్మాణాన్ని కేంద్రం చేపట్టాలని కూడా డిమాండ్ చేశారు. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో పోలవరంపై బిజెపి స్లోగన్ ఏంటి అనేది క్లారిటీ రావాల్సివుంది. పోలవరం టూర్ తర్వాత పార్టీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను అభినందిస్తారా, గతంలో జరిగిన అవినీతిపై విచారణకు డిమాండ్ చేస్తారా, ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తారా లేదా అసలు పోలవరం అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే విషయం సంచలనంగా మారింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/what-is-the-bjp-reaction-on-polavaram-project-25-89709.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.