పశ్చిమ ఆక్వా రైతులతో పెట్టుకుంటే అంతేమరి
Publish Date:Apr 1, 2012
Advertisement
పశ్చిమగోదావరి జిల్లా ఆక్వా రైతులు ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎదిగారు. వారు పేరుకే ఆక్వా రైతులుగాని నిజానికి రైతుల రూపంలో వున్న వారంతా రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలే. వీరికి పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు, గణపవరం, తాళ్ళ, భీమవరం, ఆకివీడు, మొగల్తూరు, నర్సాపురం మండలాల్లో సుమారు లక్ష ఎకరాల చేపలు, రొయ్యల చెరువులు ఉన్నాయి. ఎన్నికల సమయంలో వీరిచ్చే నిధులపై ఆయా రాజకీయపార్టీలు ఆశగా ఎదురుచూస్తుంటాయి. ఇక్కడ పెంచే చేపలు, రొయ్యలను విదేశాలకు ఎగుమతి చేస్తూ ఈ వ్యాపారులు కోట్లాది రూపాయలు ఆర్జించారు. కాలక్షేపంకోసం వీరు కోట్లాది రూపాయల బెట్టింగ్ లు కాస్తుంటారు. అయితే జిల్లా రెవెన్యూ యంత్రాంగం వీరిని తక్కువగా అంచనా వేసింది. వ్యవసాయ భూములను చేపల చెరువులుగా మార్చినందుకు 10 శాతం పన్ను చెల్లించాలంటూ ఇటీవల రెవెన్యూశాఖ ఆక్వా రైతులకు నోటీసుకు ఇచ్చింది. నిజానికి వ్యవసాయ భూములను వ్యవసాయేతర పనులకు ఉపయోగించుకోవడానికి ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్ క్రింద వేలాది రూపాయల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని ఆక్వా రైతులకు కూడా అన్వయిస్తే కోట్లాది రూపాయల్లో ఆదాయం వస్తుందని రెవెన్యూ అధికారులు భావించారు. భావించిందే తడువుగా నోటీసులు జారీ చేశారు. దీంతో ఆక్వా వ్యాపారులు ఒక చిన్నపాటి సమావేశాన్ని ఏర్పాటుచేసుకుని ప్రభుత్వ పెద్దల వద్దకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. వీరి నిర్ణయాన్ని మిగిలిన రైతులు కూడా అంగీకరించి తమవంతు సహాయం చేశారు. సూట్ కేసులతో బయలుదేరిన ఈ వ్యాపారులు హైదరాబాద్ లో ప్రభుత్వ పెద్దలను కలుసుకుని పదినిముషాల్లో తమ సమస్యను పరిష్కరించుకున్నారు. వీరు తిరిగి భీమవరం వచ్చే సమయానికి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం ఆక్వా రైతులు ల్యాండ్ కన్వర్షన్ ఫీజును చెల్లించనక్కరలేదు. ఈ జీవోతో షాక్ తిన్న రెవెన్యూయంత్రాంగం మరోసారి ఆక్వా వ్యాపారుల జోలికి పోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు.
http://www.teluguone.com/news/content/west-godavari-aqua-farmers-24-13069.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





