వ్యాపం...మరణ మృదంగం మ్రోగుతూనే ఉంది

Publish Date:Jul 7, 2015

Advertisement

 

వ్యాపం కాదు నాగుపాము:

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపం (మధ్యప్రదేశ్ వృత్తి పరీక్షా బోర్డు) కుంభకోణంలో నానాటికీ అనుమానాస్పద మరణాలు పెరిగిపోతున్నాయి. ఈ కుంభకోణం గురించి ఆరా తీయాలని ప్రయత్నించిన వాళ్ళు లేదా అందుకు సహకరించిన వారు ఒకరొకరుగా అనుమానాస్పద స్థితిలో మరణిస్తున్నారు. ఇంతవరకు ఈ కుంభకోణంలో 45మంది వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించడంతో దేశంలో పెద్ద సంచలనం కలిగిస్తోంది.

 

వ్యాపం అంటే ఏమిటి?

వ్యాపం ద్వారా రాష్ట్రంలో ఉపాద్యాయులు, కానిస్టేబుల్స్, మెడికల్ ఆఫీసర్లు, అటవీశాఖ గార్డులు తదితర అనేక ఉద్యోగాల భర్తీకి, ఉన్నత వృత్తి విద్యాసంస్థలలో ప్రవేశాలకి ఈ బోర్డు అద్వర్యంలో పరీక్షలు నిర్వహించబడతాయి.

 

ఈ భాగోతం ఎప్పడు మొదలయిందంటే...

ప్రభుత్వోద్యోగాలలో నియామకాలు కాబట్టి సహజంగానే లక్షల కోట్లు లంచాలు పంచుకొనే అనేకమంది ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, దళారులు ఈ వ్యాపం బోర్డుని తెరవెనుక నుండి శాశిస్తున్నారు. ఈ వ్యాపం బోర్డులో చాలా అవక తవకలు జరుగుతున్నాయని 1990 సం.లోనే పిర్యాదులు వచ్చేయి. కానీ 2000 సం.లో వరకు వాటిపై ఎటువంటి విచారణ కానీ కేసు నమోదు చేయడం గానీ జరగలేదు.

 

కమిటీలు విచారణలు:

మొట్టమొదటిసారిగా2000 సం.లో యఫ్.ఐ.ఆర్ నమోదు అయింది. కానీ 2009సం. వరకు కూడా ఆ కేసులో పెద్దగా కదలిక కనబడలేదంటే, తెర వెనుక ఎన్ని పెద్ద తలకాయలు పనిచేస్తున్నాయో అర్ధమవుతుంది. 2009సం.లో వ్యాపం బోర్డు నిర్వహించిన ప్రీ-మెడికల్ టెస్ట్ పై ఆరోపణలు వెల్లువెత్తడంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒక విచారణ కమిటీని వేయగా అదే సుమారు రెండేళ్ళ పాటు అధ్యయనం చేసి 2011సం.లో తన నివేదికని సమర్పించింది.

 

లంచావతారాలు ఎన్నో!

ఆ నివేదిక ఆధారంగా సుమారు 100 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. మళ్ళీ 2012సం.లో దీనిపై ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేశారు. అది ఒక ఏడాది అద్యయనం చేసిన తరువాత వ్యాపం బోర్డులో జరుగుతున్న అవకతవకలలో గవర్నర్ రామ్ నరేష్ యాదవ్, ఆయన కుమారుడు శైలేష్ యాదవ్, గవర్నర్ వద్ద పనిచేసే ఆఫీసర్-ఆన్-స్పెషల్ డ్యూటీ ధనరాజ్ యాదవ్, రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి లక్ష్మి కాంత్ శర్మ తదితరులతో సహా అనేకమంది రాజకీయ నాయకుల, ఉన్నతాధికారుల, వ్యాపారుల ప్రమేయం ఉందని తెలియజేస్తూ ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. అది చేతికి అందిన మూడు సం.ల తరువాత ఈ వ్యాపం కుంభకోణం తో సంబంధం ఉందని భావిస్తున్న ధనరాజ్ యాదవ్ తో సహా మొత్తం 2000 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. వారిలో 100 మందికి పైగా రాజకీయ నాయకులున్నారు.

 

అరెస్టయిన వారిలో అనేకమంది బడా వ్యాపారవేత్తలు చివరికి విద్యార్ధులు, వారి తల్లితండ్రులు కూడా ఉండటం గమనిస్తే వ్యాపం బోర్డులో అవకతవకలు ఏస్థాయిలో జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చును. అప్పుడు గవర్నర్ తో సహా వారందరి మీద కేసులు నమోదు చేయబడగా గవర్నర్ మాత్రం తనకున్న రాజ్యాంగ రక్షణ కవచం ఉపయోగించుకొని బయటపడ్డారు. కానీ ఆయన కుమారుడు శైలేష్ యాదవ్ కూడా అనుమానాస్పద పరిస్థితిలో మరణించారు. కానీ వచ్చే ఏడాది సెప్టెంబర్ లో గవర్నర్ పదవీ విరమణ చేసిన వెంటనే మళ్ళీ ఆయనపై కేసు నమోదు చేసి విచారణ మొదలు పెడతామని సిట్ అధికారులు స్పష్టం చేసారు.

 

మరణ మృదంగం మ్రోగుతూనే ఉంది!

ఈ కుంభకోణంలో అరెస్టులు ఏ స్థాయిలో ఉన్నాయో అనుమానాస్పద మరణాలు అదే విధంగా ఉన్నాయి. ఈ కుంభకోణంలో ఇంతవరకు మొత్తం 45మంది చాలా అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు.ఈ వ్యవహారం నానాటికీ తీవ్ర రూపం దాల్చుతుండటంతో దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసి సూత్రధారులను కనుగొనేందుకు కొన్ని నెలల క్రితం మధ్యప్రదేశ్ హైకోర్టు ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్’ (సిట్) ఏర్పాటు చేసింది. ఒకవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుంటే మరొకవైపు అనుమానాస్పద మరణాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి.

 

ఈ వ్యవహారం రాన్రాను విషమిస్తుండటంతో సుప్రీంకోర్టులో దానిపై కొందరు న్యాయవాదులు, ఆమాద్మీ పార్టీ నేతలు మరికొందరు ఇతర వ్యక్తులు పిటిషన్లు వేసారు. వాటిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తి హెచ్.యల్. దత్తు, జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్ర మరియు జస్టిస్ అమితావ రాయ్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసును 9వ తేదీన విచారణకు చేప్పట్టబోతోంది. కానీ వ్యాపం మరణ మృదంగం మారుమ్రోగుతూనే ఉంది.

 

మొట్టమొదట 2009సం.నుండి 2014సం.వరకు మొత్తం 14మంది బ్రోకర్లు, ఆరుగురు విద్యార్ధులు, ముగ్గురు విద్యార్ధుల తండ్రులు, ఇద్దరు పోలీస్ అధికారులు, ఒక జర్నలిస్ట్ (అజ్ తక్ హిందీ న్యూస్ ఛానల్ విలేఖరి), జబల్ పూరులో యన్.యస్. మెడికల్ క్లాలేజి డీన్ అరుణ్ శర్మ తో సహా అనేకమంది అనుమానాస్పద స్థితిలో మరణించారు.

 

ఈ దారుణపరిస్థితి చూసి మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ప్రస్తుత కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి మాట్లాడుతూ “ఈ వ్యాపం వ్యవహారంలో నాపైన కూడా యఫ్.ఐ.ఆర్. నమోదు చేయబడి ఉంది కనుక ఏదో ఒకరోజు నేను కూడా చనిపోతానేమో?”అని భయం వ్యక్తం చేసారంటే పరిస్థితి ఎంత తీవ్రత అర్ధమవుతుంది.

 

దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని, దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీతో సహా అనేకమంది కోరుతున్నారు.

By
en-us Political News

  
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.