ప్రత్యేక హోదా సాధించకపోతే దానికి తెదేపా మూల్యం చెల్లించాలా?

Publish Date:Aug 25, 2015

Advertisement

 

ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. హోదా సాధించుకువస్తే వచ్చే ఎన్నికలలో మళ్ళీ ఆయనకే అధికారం ఖాయమని లేకుంటే ఆయన ఉనికి కోల్పోవచ్చని జోస్యం చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేనట్లు కేంద్రప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేసింది. కనుక చంద్రబాబు ప్రయత్నం సఫలం అవకపోవచ్చును. బహుశః ఈ సంగతి గ్రహించే ఉండవల్లి ముందుగానే అయన ముందరి కాళ్ళకి బందం వేసే ప్రయత్నం చేస్తున్నట్లుంది.

 

ప్రత్యేక హోదా కేంద్రప్రభుత్వం పరిధిలో ఉన్న అంశమని ఎంపీగా పనిచేసిన ఆయనకి తెలిసే ఉండాలి. చంద్రబాబు తన ప్రయత్నాలు తను చేసినప్పటికీ కేంద్రప్రభుత్వం ఇవ్వకపోతే దానికి ఆయన ఏవిధంగా బాధ్యుడు అవుతారు? అటువంటప్పుడు ఈ అంశంపై చంద్రబాబు భవిష్యత్ ఆధారపడి ఉంటుందని ఉండవల్లి ఎందుకు చెపుతున్నారు? అంటే ఆయన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మనసులో మాటలనే పలుకుతున్నట్లున్నారు. ఈమధ్యన ఆయన వైకాపాకు దగ్గరవుతున్నారని ఆయనను పార్టీలోకి రప్పించేందుకు జగన్ కూడా ప్రయత్నిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తను కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వెళ్ళలేనని ఆయనే స్వయంగా చెప్పుకొన్నారు. ఒకవేళ వెళ్ళాలనుకొన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కోలుకొనే అవకాశాలు కనబడటం లేదు. కనుక వైకాపాకు దగ్గరయ్యేందుకే ఆయన కూడా జగన్ లాగే చంద్రబాబు, ఆయన ప్రభుత్వ భవిష్యత్ గురించి జోస్యం చెపుతున్నరేమోననే అనుమానం కలుగుతోంది.

 

రాహుల్ గాంధీ గుర్తు చేసేవరకు ప్రత్యేక హోదా గురించి గట్టిగా మాట్లాడేందుకు కూడా ఇష్టపడని జగన్మోహన్ రెడ్డికి దాని కోసం ఇప్పుడు హటాత్తుగా డిల్లీ వెళ్లి ఐదు గంటలు దీక్ష చేసి వచ్చినా, రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చినా ఆయనకీ విషయంలో చిత్తశుద్ధి ఉందనుకోలేము. కానీ ప్రత్యేక హోదాతో సహా అన్ని హామీల కోసం తెదేపా ప్రభుత్వం అధికారం చేప్పట్టక ముందు నుండే గట్టిగా ప్రయత్నాలు మొదలుపెటింది. తెదేపా బీజేపీకి మిత్రపక్షంగా, ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది కనుక అది ప్రతిపక్ష పార్టీలలాగ రోడ్లమీదకు వచ్చి ధర్నాలు, బంద్ లు చేయలేదు. ప్రయత్నలోపం లేకుండా కేంద్రప్రభుత్వంపై నిరంతరంగా తీవ్ర ఒత్తిడి చేస్తూనే ఉంది. ఈ సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.

 

కానీ రాజకీయ కారణాలతో ఉండవల్లి వంటివారు చంద్రబాబు నాయుడుని విమర్శిస్తుంటారు. ఇతరులను విమర్శించే ముందు తాము  అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం పట్ల తమ కర్తవ్యాన్ని ఎంతవరకు సక్రమంగా నిర్వర్తించారు? అని ప్రశ్నించుకొంటే మంచిది. ఉండవల్లికి కాంగ్రెస్ పార్టీతో చిరకాల అనుబంధం ఉంది. పార్టీలో మంచి పలుకుబడి గల నేతగా ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. కానీ రాష్ట్ర విభజన అనివార్యమని తెలిసిన తరువాత కూడా ఆయన తన ఈ తెలివి తేటలు, పలుకుబడి, రాజకీయ అనుభవం అన్నిటినీ ఉపయోగించి రాష్ట్రానికి నష్టం జరగకుండా అవసరమయిన అన్ని హామీలను విభజన చట్టంలో చేర్పించే ప్రయత్నం చేయలేదు. ఆ సమయంలో ప్రజల నుండి ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితుల నుండి తప్పించుకొనేందుకు మిగిలిన ఎంపీలతో కలిసి విభజనను అడ్డుకొంటున్నట్లు నటిస్తూ తమపై బహిష్కరణ వేటు వేయించుకొని సమైక్య సమర యోధులుగా, ఎంపీ పదవులను త్యజించిన గొప్ప త్యాగమూర్తులుగా చాలా లౌక్యంగా ఈ సమస్య నుండి బయటపడ్డారు. ఆనాడు తమ కర్తవ్యాన్ని, బాధ్యతలను విస్మరించిన నేతలందరూ ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో సహా అన్ని సాధించుకు రావలసిన బాధ్యత చంద్రబాబు నాయుడిదే...లేకుంటే ఆయనకు భవిష్యత్ లేదు అని జోస్యం చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

 

ఒకవేళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే అప్పుడు ఏమి చేయాలో చంద్రబాబే నిర్ణయించుకొంటారు. ఆయన నిర్ణయం తప్పా ఒప్పా? అనే సంగతి ప్రజలు చూసుకొంటారు. కానీ ఈలోగా ఉండవల్లి వంటి మేధావులు ఇటువంటి చిలక జోస్యాలు, తీర్పులు చెపుతూ కాలక్షేపం చేసే బదులు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఏవిధంగా ముందుకు వెళ్ళితే బాగుంటుందో నిర్మాణాత్మకమయిన సూచనలు, సలహాలు ఇస్తే అందరూ హర్షిస్తారు కదా?

By
en-us Political News

  
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.