పులి ఎప్పుడూ మేకలకి న్యాయం చేయదు

Publish Date:Aug 25, 2015

Advertisement

 

“పులి ఎప్పుడూ మేకలకి న్యాయం చేయదు” తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి సీపిఐ మావోయిస్టు పార్టీ తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ అన్నమాట ఇది. ఇటీవల ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో “కేసీఆర్ ఒక నయా నిజాం నవాబు” అని ఆయన అభివర్ణించారు. కానీ కేసీఆర్ ని ప్రముఖ పారిశ్రామికవేత్త రామేశ్వర్ రావు, చిన్న జియ్యర్ స్వామే వెనుకనుండి నడిపిస్తున్నారని అన్నారు. ఒకప్పుడు తెలంగాణాలో ఆంధ్రా నేతల పాలన సాగేదని కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కుల పాలన, కేసీఆర్ కుటుంబ పాలన, నిజాం దొరలపాలనా సాగుతోందని అన్నారు.

 

రాష్ట్రంలో నిరుపేదలకు ఇళ్ళు, మూడెకరాల స్థలం హామీని పక్కనబెట్టి బడా పారిశ్రామిక వేత్తలకు స్థలాలు అన్వేషించడానికి కేసీఆర్ స్వయంగా హెలికాఫ్టర్లో తిరుగుతున్నారని హరిభూషణ్ ఆరోపించారు. పేదలకు 100 గజాల స్థలం ఇవ్వడానికి వెనుకాడే కేసీఆర్ పెట్టుబడిదారులకు, బహుళజాతి సంస్థలకు, కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ఏకంగా 1.60 లక్షల ఎకరాల భూమిని సిద్దం చేసామని గొప్పగా చెప్పుకోవడాన్ని హరిభూషణ్ తప్పు పట్టారు. ఒకవైపు పోలీసులకు అత్యదునిక ఆయుధాలు, వాహనాలు సమకూర్చి మావోయిస్టులను భూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ మళ్ళీ తమ ప్రభుత్వం మావోయిస్ట్ అజెండానే అమలు చేస్తోందని కేసీఆర్ చెప్పుకోవడాన్ని ఆయన తప్పు పట్టారు. అధికారంలోకి రావడానికే కేసీఆర్ తమపెరును వాడుకోన్నారని హరిభూషణ్ అన్నారు. రాష్ట్రంలో పేదలకు కూడు, గుడ్డ, ఇళ్ళు, వైద్యం, విద్య వంటి మౌలిక సదుపాయాల కల్పించినప్పుడే ఆ మాట చెప్పుకొనే అర్హత ఉంటుందని అభిప్రాయపడ్డారు.

 

పేదల కోసం పనిచేయకుండా కేసీఆర్ తన కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎప్పటికప్పుడు ఆధునిక వాహనాలను ఏర్పాటు చేసుకొంటున్నారని హరిభూషణ్ విమర్శించారు. ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేయవలసిన సొమ్మును చిన్న జీయర్ స్వామీ సలహాతో కేసీఆర్ గుళ్ళు గోపురాలకి(యదాద్రి), పుష్కరాలకి ఖర్చు చేస్తున్నారని ఆవేదన చెందారు. నిరుపేద మునిసిపల్ కార్మికులు, ఈజీఎస్ ఉద్యోగుల సమ్మెను కేసీఆర్ ఉక్కుపాదంతో అణచివేశారని హరిభూషణ్ విమర్శించారు. చివరికి తనను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీలని, మీడియాని కూడా కేసీఆర్ నియంతలాగా అణగద్రొక్కేస్తున్నారని హరిభూషణ్ అన్నారు.

 

తెలంగాణా భౌగోళికంగా ఒక రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ ఆంధ్రా భూస్వాములు, పెట్టుబడిదారుల చేతుల్లో నుండి ఇప్పుడు నయా నిజాం దొరల వంటి కేసీఆర్ కుటుంబం చేతిలో చిక్కుకుపోయిందని హరిభూషణ్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ కుటుంబం చేతిలో నుండి రాష్ట్రానికి విముక్తి కలిగించేందుకు మళ్ళీ మరొక ఉద్యమం అవసరం అవుతుందని హరిభూషణ్ అభిప్రాయ పడ్డారు.

By
en-us Political News

  
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.