విజయసాయికి హద్దుల్లేవా? తెలియవా?

Publish Date:Sep 21, 2023

Advertisement

విజయసాయి రెడ్డి.. తెలుగు రాష్ట్రాలలో ఎవరికీ పరిచయం అక్కర్లేని పేరు. జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా, వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఆయన సుపరిచితుడు. అన్నిటికీ మించి.. ప్రత్యర్థులపై అనుచిత భాషతో, ఆయనకు మాత్రమే ప్రత్యేక మైన అసభ్య, అనుచిత భాషలో విమర్శలు గుప్పించడంలో ఉద్దండుడు. విజయసాయి రెడ్డి తన పార్టీ అధినేత జగన్ కంటే ఎక్కువగా విపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబును తలుచుకుంటారు. సమయం, సందర్భంతో సంబంధం లేకుండా ఇష్టారీతిన విమర్శలు గుప్పిస్తుంటారు.

అయితే  ఇటీవల  కొంత కాలంగా విజయసాయి మౌనంగా ఉన్నారు. వైసీపీలో ఆయన సీన్ అయిపోయిందనీ, జగన్ ఆయనను దూరం పెట్టారనీ పార్టీ శ్రేణుల నుంచే బలంగా వినిపించింది. అందుకు అనుగుణంగానే పార్టీలో ఆయన పదవులు ఒక్కటొక్కటిగా ప్రభుత్వ సలహాదారు సజ్జల ఖాతాలోకి వెళ్లిపోయాయి. దాంతో అప్పటి వరకూ వైసీపీ, విజయసాయిని వేరువేరుగా చూడటం సాధ్యం కాదన్నట్లుగా ఉండే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పార్టీ ఆవిర్భావం నుంచీ, ఆఖరికి జగన్ అక్రమాస్తుల కేసులో కూడా జగన్ కు తోడూ, నీడగా ఉన్న విజయసాయి ప్రభ క్రమంగా వైసీపీలో తగ్గిపోయింది. ఆయనను పార్టీ దాదాపుగా దూరం పెట్టేసిందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అయ్యాయి. వైసీపీ శ్రేణులైతే పార్టీలో విజయసాయి సినిమా అయిపోయిందని బహిరంగంగానే చెప్పుకున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన పార్టీలో అత్యంత కీలకంగా మారడానికి కారణమైన ఆయన మార్కు విమర్శలకు విజయసాయి దూరంగా ఉన్నారు.  

అన్నిటికీ మించి తెనాలిలో జగన్ రైతు భరోసా కింద  మీట నొక్కి రైతుల ఖాతాలలో నిధులు జమ చేసే సమయంలో విజయసాయి పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందజేసిన సందర్భాన్ని పురస్కరించుకుని మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ  ట్వీట్ చేయడంతో జగన్ తో ఆయన ఢీ అంటే ఢీ అనేందుకు రెడీ అయిపోయారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఎందుకంటే   పీఎం ఒక రోజు ముందే రైతుల ఖాతాలలోకి విడుదల చేసిన నిధులకు జగన్ ఉత్తుత్తి మీట నొక్కుతున్నారన్న భావన కలిగించే విధంగా అప్పట్లో ఆయన చేసిన ట్వీట్ ఉంది.   అయితే వైసీపీలో సంక్షోభం ముదురుతున్న కొద్దీ విజయసాయి పార్టీకి దగ్గర అవ్వడం మొదలైంది. గతంలో అంత చురుకుగా, క్రియాశీలంగా కాకపోయినా విజయసాయి వైసీపీ కార్యక్రమాలలో పాల్గొనడం ప్రారంభించారు. మొల్లిమిల్లిగా జగన్ కు దగ్గర కావడానికి ఆయన తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

జగన్ కు నచ్చాలన్నా, మెచ్చాలన్నా చంద్రబాబుపై విమర్శలు చేయడం, అనుచిత వ్యాఖ్యలు చేయడమొక్కటే మార్గమన్న సంగతి విజయసాయికి తెలిసినంతగా ఎవరికీ తెలియదని పార్టీ శ్రేణులే ఉంటాయి. అయితే కొంత కాలం చంద్రబాబు ఊసెత్తని విజయసాయి మళ్లీ ఇప్పుడిప్పుడే చంద్రబాబుపై అనుచిత విమర్శలతో విరుచుకుపడుతూ.. జగన్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 21) రాజ్యసభలో అసందర్భంగా చంద్రబాబు ఊసెత్తారు. సభలో లేని వ్యక్తిపై సభలో ప్రస్తావన రాకూడదన్న ప్రాథమిక  విషయాన్ని కూడా పట్టించుకోకుండా, చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్  బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చ లో విజయసాయి చంద్రబాబు ప్రస్తావన తీసుకు వచ్చారు. ఆయన అసందర్భంగా చంద్రబాబు ప్రస్తావనను తీసుకురావడాన్ని సభలో అన్ని పార్టీల సభ్యులూ తప్పుపట్టారు.

బీఎంకే, బీఆర్ఎస్.. ఆఖరికి వైసీపీతో బహిరంగంగా రహస్యమైత్రి కొనసాగిస్తున్న బీజేపీ సభ్యులు కూడా విజయసాయి తీరును తప్పుపట్టారు. అయితే నవ్విపోదురుగాక నాకేటి అన్నట్లుగా ఆయన తీరు ఉంది. ఏళ్లతరబడి బెయిలుపై ఉన్న విజయసాయి.. గురివిందలా ఇతరుల గురించి మాట్లాడటం దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉందని పరిశీలకులు అొంటున్నారు.  మొత్తంగా విజయసాయి తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్యసభలో విజయసాయి తీరు పట్ల పెద్దల సభలో సీనియర్ సభ్యులు కూడా ఆయనకు హద్దులు లేవా? తెలియవా? అంటూ విమర్శిస్తున్నారు.

By
en-us Political News

  
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.