ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒకే సారి ఎన్నికలు?

Publish Date:Sep 21, 2023

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగవలసిన తీరుగా జరుగుతాయా,  ముందస్తుకు జరుగుతాయా? ఇది ఇప్పడు కాదు, ఎప్పటి నుంచో  జరుగుతున్న చర్చ. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మరో మారు జమిలి ఎన్నికల చర్చను తెరపైకి తెచ్చిన తర్వాత ... ముందస్తు అసెంబ్లీ ఎన్నికల చర్చ మరింత ఊపందుకుంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రకటన చేసినప్పటి నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటుగా,జమిలి బిల్లు తెచ్చేందుకే ప్రత్యేక సమావేశాలు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరో వంక  సెప్టెంబర్ 18న మొదలైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అందరూ అనుకున్నట్లుగానే, కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనంలో మహిళా బిల్లుతోనే అడుగుపెట్టింది.

మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో విపక్షాలు, బిల్లును సమర్దిస్తూనే  చిన్న చిన్న చిక్కులు సృష్టించే ప్రయత్నం చేసినా, కేంద్ర ప్రభుత్వం విపక్షాలు వెనకడుగువేసే ఆవకాశం లేకుండా ముగ్గులోకి దించింది.  బుధవారం( సెప్టెంబర్ 20) లోక్ సభలో బిల్లు ఆమోదం పొందింది,  గురువారం( సెప్టెంబర్ 21) పెద్దల సభలోనూ పాసై ..రేపో మాపో చట్టంగా బయటకు వస్తుంది. సరే, మహిళా బిల్లు చట్టం అయినా  2024 సార్వత్రిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు కాదు.  ఎన్నికల తర్వాత జనగణన, డీలిమిటేషన్  ప్రక్రియలు పూర్తయిన తర్వాతనే మహిళల రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని  హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో స్పష్టం చేశారు. అయినా చట్టం అమలుకు సంబంధించి ఇంకా కొంత సందిగ్ధత కొనసాగుతోంది. అయినా అది ప్రస్తుతానికి అప్రస్తుతం. కనుక దానిని పక్కన పెడితే.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు చాలా ముందునుంచి రాజకీయ వర్గాల్లో  జమిలి ఎన్నికల చర్చ బలంగా నడుస్తోంది. అయితే, ప్రస్తుతానికి   ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయినా ఆ అంశం చుట్టూనే  చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పడు? అనే ఉత్కంఠ ఉంది.

మహిళా బిల్లు తరహాలో ముందస్తు సమాచారం లేకుండా జమిలి బిల్లును ప్రభుత్వం తెస్తుందా అన్న అనుమానాలున్నాయి. మహిళా బిల్లు తరహాలో  2029 ఎన్నికల నుంచి అమలుచేసే విధంగా జమిలి ఎన్నికల బిల్లును తెస్తుందా, అన్న అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. మహిళా రిజర్వేషన్, జమిలి ఎన్నికలపై  బీజేపీ, ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టి పెట్టారు. ఈ టర్మ్ పూర్తయ్యే లోగా, ఈ రెండు హామీలకు చట్ట బద్దత   కల్పించే ఉద్దేశంతోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వాహించానే నిర్ణయం తెసుకున్నట్లు బీజీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపధ్యంలో అవసరం అయితే, ప్రత్యేక సమావేశాలను మరో ఒకటి రెండు రోజులు పొడిగించి జమిలి బిల్లును ‘మమ’  అనిపించినా అనిపించవచ్చని అంటున్నారు. 

అదే నిజమైతే, లోక్ సభ ఎన్నికలను ముందస్తుకు జరిపి, ఆ ఎన్నికలతో పాటుగా, ఐదారు నెలలు అటూ ఇటుగా ఎన్నిలు జరగ వలసిన రాష్ట్రాల శాసన సభ ఎన్నికలను అటూ ఇటు చేసిన మినీ జమిలి ఎన్నికలు జరుపుతుందా అనే విషయంలోనూ అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ అనుమానాలు మరింత  బలంగావినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మంత్రి తారక రామా రావు, అసెంబ్లీ  ఎన్నికలు ఆరు నెలలు వాయిదా  పడే   అవకాశం లేక పోలేదని అన్నారు. లోక్ సభ ఎన్నికలతో పాటుగా వచ్చే మార్చి,ఏప్రిల్ లో జరిగ వచ్చని అన్నారు. అందుకు తగ్గట్టునే భారత ప్రాధాన ఎన్నికల  కమిషనర్ రాజీవ్ కుమార్, అసెంబ్లీ ఎన్నికలను గడువుకు  ఆరు నెలలు ముందు  వెనక నిర్వహించే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని పేర్కొన్నారు. 

అదలా ఉంటే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  బుధవారం( సెప్టెంబర్20) జరిగిన మంత్రివర్గ సమావేశంలో  ముదస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.  జమిలి లేదా ముందస్తు ఎన్నికలపై  పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర  ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో, చూద్దాం .. ఆ తర్వాత ముందస్తు పై ఒక నిర్ణయం తీసుకుందామని అన్నట్లు తెలుస్తోంది, మరో వంక బీజేపీ నాయకులు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు యథాతథంగా గడువు ప్రకారమే జరుగుతాయని పైకి అంటున్నా, వ్యక్తిగత సంభాషణల్లో  మినీ జమిలి అవకాశాలను పూర్తిగా కొట్టివేయలేమని అంటున్నారు. అలాగే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఒకే సారి ఎన్నికలు జరిగే అవకాశాలే అధికంగా ఉన్నాయని అంటున్నారు.  అందుకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ భేటీలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలని చెప్పడం.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జరుగుతాయని అంటున్నారు. అయితే అది ఈ ఏడాది డిసెంబర్ లోనా, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటుగానే అనే విషయంలో మాత్రం స్పష్టత లేదని అంటున్నారు. 

By
en-us Political News

  
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు. 
మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
Publish Date:Jan 7, 2026
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చ‌క్రం తిప్పారు. క‌విత ఎడ్యుకేటెడ్ కావ‌డం,  హిందీ కూడా బాగానే మాట్లాడ‌గ‌ల‌గ‌డంతో జాతీయ స్థాయి ప్ర‌తినిథిగా ఉండేవారు. అయితే క‌విత రెండో సారి ఎంపీగా గెల‌వ‌లేక పోయారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.