చంద్రబాబు అక్రమ అరెస్టు తీరు భయం గొలుపుతోంది.. హీరో విశాల్

Publish Date:Sep 21, 2023

Advertisement

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు అన్ని వర్గాల నుంచీ తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. జగన్ ను విపరీతంగా అభిమానించే వారు కూడా చంద్రబాబు అక్రమ అరెస్టును తప్పుపడుతున్నారు. చంద్రబాబు వ్యతిరేకులు కూడా జగన్ తీరును ఏవగించుకుంటున్నారు. ఇది అధికార దురహంకారం, కక్ష సాధింపు వినా మరొకటి కాదని విమర్శిస్తున్నారు. చంద్రబాబు వంటి వ్యక్తినే ఇలా అక్రమంగా, అమానుషంగా అరెస్టు చేస్తే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు అరెస్టు తీరు చూసిన జగన్ ను సమర్ధించలేమనీ, హక్కుల కోసం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం ఉద్యమించడం వినా మరో మార్గం లేదని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. ఈ విషయంలో ఈ రంగం, ఆ రంగం, ఈ పార్టీ, ఆ పార్టీ అని లేదు.. చివరాఖరికి వైసీపీలో కూడా జగన్ పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. గత ఎన్నికలలో వైసీపీ తరఫున పని చేసిన ఎందరో ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి జగన్ ను తప్పపడుతున్నారు. ఇంకెంత మాత్రం ఆయనను సమర్ధించలేమని చెబుతున్నారు.  

సినీ ప్రముఖులు కూడా మీడియా ముందుకు వచ్చి జగన్ ను తప్పుపట్టడానికి వెనుకాడటం లేదు. తాజాగా హీరో విశాల్ జగన్ సర్కార్ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన తీరును తప్పుపట్టారు. జగన్ ను ఎంతగానో అభిమానించే విశాల్ చంద్రబాబు అరెస్టు విషయంలో మాత్రం జగన్ తప్పు చేశారని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. జగన్ తన అభిమాన నాయకుడు అని చెప్పిన విశాల్.. అయినా చంద్రబాబు అరెస్టు విషయంలో ఆయన తీరును సమర్ధించలేనని అన్నారు. చంద్రబాబుకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని పేర్కొన్నారు.  

 కేసు లేదు.. ఎఫ్ఐఆర్ లేదు… అరెస్ట్ చేసి విచారించి, ఆధారాలను రాబడతాం అంటూ  వందల మంది పోలీసులతో చుట్టు ముట్టి అర్ధరాత్రి చంద్రబాబును అరెస్టు చేసిన తీరు భయం గొలుపుతోందని విశాల్ అన్నారు.  చంద్రబాబు లాంటి వారికే ఈ పరిస్థితి వస్తే ఇక నా పరిస్థితి ఏమిటి  అన్న ఆందోళన కలుగుతోందని హీరో విశాల్ అన్నారు.  తాను హీరోనే అయినా  సామాన్యుడినేననీ,  చంద్రబాబు అరెస్టు తీరు చూసిన తరువాత హీరోగా సెలబ్రిటీనే అయినా తనకు భయం వేసిందని అర్ధం వచ్చేలా మాట్లాడారు.   ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడ అని ఆందోళన వ్యక్తం చేశారు.  విశాల్ వ్యక్తం చేసిన భయమే నేడు ఏపీలో జనబాహుల్యంలో  కనిపిస్తున్నది. పేదలు, మధ్యతరగతి వారు, సంపన్నులు అన్న తేడా లేకుండా సర్వులూ జగన్ ఏలుబడిలో ఏపీలో భయానక వాతావరణం ఉందని అంటున్నారు. ప్రజల హక్కుల రక్షణకు ఉన్న వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయనీ ఆందోళన వ్యక్తం అవుతోంది.  ఏపీ ప్రజలకు మానవ హక్కులనేవే లేని పరిస్థితిని జగన్ ప్రభుత్వం సృష్టించిందని విమర్శిస్తున్నారు.  

By
en-us Political News

  
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.