విజయానికి దిగజారుడు మెట్లు..!
Publish Date:Sep 4, 2012
Advertisement
అతి తక్కువ కాలంలో అందనంత ఎత్తుకు ఎదిగిన ఓ మహావ్యక్తికి ఓ ప్రముఖ రచయిత పిచ్చ ఫ్యాన్. తను మంచి బూమ్ లో ఉన్న రోజుల్లో అభిమాన నక్షత్రాన్ని తలుచుకుని పొంగిపోతూ విజయం సాధించడానికి ఎన్ని మెట్లు ఎలా ఎక్కిందీ వివరిస్తూ ఓ పే.....ద్ద నవల రాసిపారేశాడు. అప్పట్లో అభిమానం అలాంటిది మరి. తర్వాత కాలంలో చాలా మార్పులొచ్చేశాయ్. రాజకీయంలోకి అడుగుపెడితే రెండు చేతులేంటి వందచేతులతో డబ్బులు పోగేసుకోవచ్చు.. అని ఐనవాళ్లు సలహా ఇచ్చారు. అరగేట్రంకూడా చాలా గ్రాండ్ గా జరిగింది. కానీ.. చివరికి నమ్ముకున్నవాళ్లంతా నట్టేట మునిగారు. ఏదో ఒరుగుతుందని నమ్మివచ్చినవాళ్లంతా మట్టికొట్టుకుపోయారు. అయినా సదరు మహావ్యక్తికి ధనదాహం తీరలేదు. తనను అభిమానించే వాళ్లని అడ్డంగా వాడుకోవడానికి ముందునుంచీ నడుపుతున్న దేశోద్ధరణ కార్యక్రమాల్నికూడా సంపాదనకోసం ఉపయోగించుకుందామన్న యావ ఎక్కువైపోయింది. పేదవాడి రక్తపు చుక్కల్నికూడా డబ్బుల్లోకి మార్చేసుకోవచ్చన్న కొత్త ఆలోచన పుట్టుకొచ్చింది. డబ్బులే డబ్బులు.. కుక్కని కొడితే డబ్బులు రాలుతున్నాయ్.. ఉన్న ఇమేజ్ కి తోడు కొత్తగా పవర్ కూడా తోడవడంతో ఏదైనా జరిగితే అప్పటికప్పుడు మ్యానేజ్ చేసుకోవడం చాలా వీజీ అయిపోయింది. అరాచకాలకు అడ్డేలేకుండా పోయింది. సదరు మహావ్యక్తి జీవనపయనం నిరుపేదగా మొదలైంది. తర్వాత జీవితమే నాటకమైపోయింది. కష్టపడి పైకొచ్చాడని అంతా పొగిడారు. కానీ.. ఆ కష్టం వెనక ఎన్ని మతలబులు, ఎన్ని నిజజీవితపు రాజకీయాలూ ఉన్నాయో.. బాగా దగ్గరగా ఎరిగిన రచయితగారికి చాలాకాలం తర్వాత తెలిసొచ్చింది. మహావ్యక్తికి వీరాభిమాని అయిన రచయితకు మాత్రం కళ్లెదుటే జరుగుతున్న అరాచకాల్ని చూసి కడుపుమండిపోయింది. వెటరన్ నావెలిస్ట్ బుచ్చిబాబుని ఆదర్శంగా తీసుకుని, ఎన్ని కడుపులు కొట్టి ఎంత కూడబెట్టినా చివరికి మిగిలేదేంలేదు బూడిదతప్ప అన్న నిజాన్ని నూరిపోసే కొత్త నవల రాసేందుకు సిద్ధపడ్డాడు. తన లేటెస్ట్ ప్రాజెక్ట్ ని ఎంత త్వరగా మార్కెట్లోకి విడుదల చేయాలా..? ఎంత త్వరగా తను అభిమానించిన మహావ్యక్తి దిగజారుడుతనాన్ని కళ్లకు కట్టినట్టు జనానికి చెప్పాలా.. ? అన్న తహతహ రచయితకు పెరిగిపోయింది. ఇదేదో చాలా వెరైటీగా మార్కెట్లోకొచ్చేట్టుగా ఉందని పాఠకులుకూడా యమ ఆసక్తిగా ఆ కొత్త నవలకోసం ఎదురుచూస్తున్నారు. రచనాగ్రేసరుడి కొత్త నవలకు ఎంత పాపులారిటీ రాబోతోందో కాలమే నిర్ణయించాలి
http://www.teluguone.com/news/content/vijayaniki-metlu-24-17138.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





