Publish Date:Apr 18, 2022
ఇంత కాలం తమ పార్టీకి కొమ్ము కాసిన రైతులే ఇప్పుడుఈ ప్రభుత్వంలో తాము బతికే పరిస్థితి లేదు, మరణించడానికి అనుమతి ఇవ్వండి అంటూ ఏకంగా గవర్నర్ కు లేఖలు రాశారంటే... వైకాపా ప్రభుత్వానికి అధికారంపై తప్ప ఎవరి బాగోగులపైనా శ్రద్ధ లేదని అవగతమౌతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ పార్టీకి చెందిన రైతులే గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇంతకీ వారెవరంటే....
గత తెలుగు దేశం ప్రభుత్వం విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి 33వేల ఎకరాలు సమీకరించింది. ఆ సమయంలో విపక్షంలో ఉన్న వైకాపా భూములు ఇవ్వొద్దంటూ రైతులను రెచ్చగొట్టింది. రైతులు భూ సమీకరణకు భూములు ఇవ్వకుండా ఉండేందుకు వారి చెవిన ఇల్లు కట్టుకు నచ్చ చెప్పింది. కుదరని చోట కన్నెర్ర చేసి బెదరించింది. అయినా రైతులు భూ సమీకరణ వైపే మొగ్గు చూపారు. అయితే వైకాపాకు చెందిన కొందరు రైతులు మాత్రం తమ భూములు ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. అటువంటి వారి భూములన్నిటినీ గత ప్రభుత్వం క్రయ, విక్రయాలకు అవకాశం లేకుండా యూ-1 జోన్ లో చేర్చింది. అంటే రిజర్వ్ జోన్ అన్నమాట. ఆ జోన్ లో ఉన్న భూములు అమ్మడానికి కానీ, కొనుగోలు చేయడానికి కానీ అవకాశం ఉండదు. సరే...వైకాపా అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయ్యింది. జగన్ మాటలను నమ్మి తమ భూములు అప్పటి ప్రభుత్వానికి ఇవ్వకుండా భీష్మించిన రైతుల భూములు ఇప్పటికీ రిజర్వ్ జోన్ లోనే ఉన్నాయి. అంటే గత ఆరేళ్లుగా ఆస్తులు ఉండీ వాటిని అనుభవించలేని దుస్థితిలో రిజర్వ్ జోన్ రైతులు ఉన్నారన్నమాట. తాము నమ్మిన జగన్ అధికారంలోనికి వచ్చి కూడా తమ బాధలను పట్టించుకోవడం లేదన్న బాధను ఇంత కాలం పంటి బిగువున భరించిన ఆ రైతులు తాము మోసపోయామని ఇప్పటికి గ్రహింపునకు వచ్చారు. ప్రభుత్వంపై తిరుగు బావుటా ఎగుర వేశారు. కారుణ్య మరణ భిక్ష పెట్టమంటూ గవర్నర్ కు లేఖల రూపంలో వినతి పత్రాలు సమర్పించారు.
తాడేపల్లి, కలువకొలను, కుంచనపల్లి గ్రామాలకు చెందిన రైతులకు చెందిన 178 ఎకరాలు ఈ యూ-1జోన్ లో ఉన్నాయి. నాడు విపక్షంలో ఉన్న వైకాపాకు మద్దతుగా నిలిచిన ఈ రైతులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నాడు వారి వెన్నంటి ఉండి, భుజం తట్టి ప్రోత్సహించిన మంగళగిరి ఎమ్మెల్యే ఇప్పుడు వారి కేసి కన్నెత్తి చూడటం లేదు. పన్నెత్తి పలకరించడం లేదు. న్యాయం చేయాలని కోరుకుంటున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. ఆందోళన శిబిరాల కేసి చూసే నాథుడే కనిపించడం లేదు. మరో వైపు అమరావతి రైతుల శిబిరాలు పెద్ద సంఖ్యలో మద్దతు దారులతో కలకలలాడుతుంటే...వీరి శిబిరాలు వెలవెలబోతున్నాయి. తాము రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యామని మధన పడటం తప్ప ఏం చేయలేని పరిస్థితుల్లో యూ-1 జోన్ రైతులు ఉన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/u1zone-farmers-pledge-governer-for-mercy-death-39-134549.html
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.