టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్ గేర్

Publish Date:Jul 4, 2022

Advertisement

తెరాస పార్టీకి ఇప్పుడు సొంత గడ్డ తెలంగాణలోనే ఎదురుగాలి వీస్తున్నదా అన్న ప్రశ్నకు పరిస్థితులు గమనిస్తే అవుననే సమాధానం ఇవ్వాల్సి వస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. 2018 ఎన్నికలకు ముందు, ఆ తరువాత కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పేరిట రాష్ట్రంలో విపక్షాలను ఖాళీ చేయడానికి అనుసరించిన వ్యూహమే ఇప్పుడు బూమరాంగ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తున్నదంటున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ లోకి వలస వచ్చిన నేతలు ఒక్కరొక్కరుగా తిరిగి సొంతగూటికి చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే వలసలు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. ఒక మేయర్ ఏకంగా అధికార టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారంటే అధికార పార్టీకి ఇది నిజంగా ఎదురు దెబ్బే. మేయర్ ఒటరిగా కాక ఆరుగురు కార్పొరేటర్లతో కలిసి కాంగ్రెస్ గూటికి చేరుందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. వారిని పార్టీలోనే కొనసాగేలా చేయడానికి సాక్షాత్తూ సీఎం కుమార్తె కల్వకుంట్ల కవిత రంగంలోనికి దిగి శతధా ప్రయత్నిస్తున్నా ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు.  

బడంగ్ పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ఇప్పటికే  తన రాజీనామా లేఖను పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి పంపారు. బడంగ్ పేట్ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ లో చేరి పార్టీ పిలుపు మేరకు ప్రతి కార్యక్రమం విజయవంతం చేశానని పేర్కొన్న  పారిజాత నరసింహారెడ్డి.. ఆ సేవలకు గుర్తింపు లేకపోగా  టీఆర్ఎస్ లో తనకు, తన వర్గం వారికి అడుగడుగునా అవమానాలూ, పరాభవాలే ఎదురౌతున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇక   తీగల కృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.  కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరుగ సొంత గూటికి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.  టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తున్నారు. సీనియర్ నేతల నుంచి అడ్డంకులు ఎదురౌతున్నా, వాటిని పెద్దగా పట్టించుకోకుండా ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో కాంగ్రెస్ ను వీడి తెరాస గూటికి చేరిన మాజీలతో టచ్ లోకి  వెళ్లి వారిని సొంత గూటికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికి ఆ ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయనీ అందుకే నాటి కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు రివర్స్ అవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ నిర్మాణంలోని లోపాల కారణంగానే కాంగ్రెస్ మాజీలు సొంత గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న వాదనా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ను వీడి వెళ్లిన వారిని వెనక్కు రప్పించే విషయంలో రేవంత్ కృషిని తక్కువ చేసి చూపడం సాధ్యం కాదని కాంగ్రెస్ శ్రేణులే అంటున్నారు. టీఆర్ఎస్ చీఫ్ గా గతంలో ఎవరూ చేయని విధంగా కాలికి బలపం కట్టుకుని తిరుగుతూ మాజీలను ఒప్పించి తిరిగి పార్టీలోనికి తీసుకురావడంలో రేవంత్ సక్సెస్ అవుతుండటంతో అధిష్థానం కూడా ఆయనను రాష్ట్రంలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వినా ఎవరికీ కూడా కాంగ్రెస్ హై కమాండ్ రాష్ట్ర వ్యవహారాలలో ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదనీ, ఇన్నాళ్లకు మళ్లీ అటువంటి స్వేచ్ఛ రేవంత్ కు ఇచ్చారనీ పరిశీలకులు కూడా ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు.

 ప్రస్తుత పరిస్థితిని గమనిస్తుంటే ముందు ముందు  టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మరిన్ని వలసలు ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్ నుంచి తెరాసలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలు సైతం హోం కమింగ్ అంటూ కాంగ్రెస్ గూటికి చేరినా ఆశ్చర్య పోవలసిన పని లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

By
en-us Political News

  
లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం 400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి చేయ‌లేదు. ఎవ‌రి క‌ష్టం వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు.
అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.
ఈ పథకంలో ఉన్న లోపాలన సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది.
బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది.
ల్లమల సాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా జలవనరులశాఖ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉపాధి హామీ పథకం పేరు మార్పు అన్నది గ్రామీణ పేదల జీవనాధారంపై జరుగుతున్న దాడిగా ఎంపీలు అభివర్ణించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత కొన్నేళ్లుగా ఉపాధి హామీ పథకానికి నిధులను నిలిపివేస్తూ, పనులను నిరాకరిస్తూ, గ్రామీణ ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసుల వద్ద డీసీసీల నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నాలకు దిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు.
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి తన వంతు దోహదం చేసిన చెల్లిని అధికారం చేపట్టిన తరువాత జగన్ దూరం పెట్టారు. ఆస్తుల పంచాయతీతో పాటుగా రాజకీయంగా తనకు పోటీ అవుతుందన్న భయంతోనే జగన్ షర్మిలను దూరంపెట్టారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.
మూడో దశలో బుధవారం (డిసెంబర్ 17) మొత్తం 4,159 స్థానాలకుఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారలు 2,286 స్థానాలు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరుఅు 479 సానాల్లో విజయం సాధించారు.
తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది.
అసెంబ్లీ సాక్షిగా నేడు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీలో నాయకులు, శ్రేణులూ పూర్తిగా డీలా పడ్డాయి. దానికి తోడు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వలస వెళ్లిపోయి, ఎలాగో తీరిక చేసుకుని వారానికి ఒక సారి మాత్రం ఆంధ్రప్రదేశ్ వచ్చి.. వెడుతున్నారు. దీంతో ఆయన పూర్తిగా పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా మారిపోయినట్లైందని పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.