Publish Date:Apr 30, 2026
తెలుగుదేశం పండుగ మహానాడు ఈ ఏడాది నెల్లూరులో జరగనుంది. తొలుత మహానాడును శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించాలని పార్టీ భావించింది. శ్రీకాకుళం జిల్లా చాపురం లో వచ్చే నెల 27, 28, 29 తేదీలలో సమావేశాలను నిర్వహించనున్నట్లు ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు వేదిక మారింది. అవే తేదీలలో పార్టీ పండుగ మహానాడును నెల్లూరు జిల్లాలో జరపాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. ఇందుకు రాజకీయకారణాలే కాకుండా.. జూన్ నెలలో ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాంధ్ర పర్యటన ఉండటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు.
మే చివరిలో పార్టీ మహానాడును నిర్వహించిన తరువాత స్వల్ప వ్యవధిలో మోడీ ఉత్తరాంధ్రపర్యటనకు ఏర్పాట్లు, జనసమీకరణ, భద్రతా ఏర్పాట్లలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయన్న భావనతో వేదిక మార్పునకు పార్టీ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అదలా ఉండగా ఇప్పటికే మహానాడు వేదిక మార్పుకు సంబంధించి తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ శ్రీకాకుళం, నెల్లూరు పార్టీ నేతలతో చర్చించినట్లు సమాచారం. అలాగే నెల్లూరులో మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని నెల్లూరు నేతలను ఆయన ఆదేశించారని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/this-year-tdp-mahanadu-venue-changed-to-nellore-36-218629.html
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు.
ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది.
మెుహాలీలోని ఖరార్ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా సోదాలు జరుగుతున్న ప్రాంగణంలో నోట్ల కట్టలతో నిండిన బ్యాగులు దొరకడం హాట్ టాపిక్గా మారింది.
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.
నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్గ్రామ్లో బుధవారం రాత్రి ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి హత్య చేశారు. దోహరియా ప్రాంతంలోకి ఆయన కారును వెంబడించి వచ్చిన దుండగులు చంద్రనాథ్ రథ్పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.