కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఆయుధాల బెదిరింపుల ఘటన, నేతల మధ్య తీవ్ర విమర్శలు, అనంతరం పార్టీ శ్రేణుల దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కరీంనగర్లోని అల్గునూరు చౌరస్తాలో ఖాలీద్ అనే హైకోర్టు న్యాయవాదిని కొందరు దుండగులు తుపాకులతో బెదిరించిన ఘటన సంచలనం రేపింది. ఈ విషయంపై న్యాయవాది కరీంనగర్ సీపీకి ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లభించలేదని ఆరోపించారు. దీనితో ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో రాష్ట్రంలో గన్ కల్చర్పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే సమయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. డ్రగ్స్ పరీక్షలకు కల్వకుంట్ల తారక రామారావు సిద్ధంగా ఉన్నారని, అలాగే రేవంత్ రెడ్డి మరియు బండి సంజయ్ కుమార్ కూడా సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. బండి సంజయ్పై వ్యక్తిగత విమర్శలు చేయడం వివాదానికి దారితీసింది. కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. కౌశిక్ రెడ్డి అక్కడ ఉన్నారన్న సమాచారం నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కార్యాలయానికి చేరుకుని అక్కడ ఉన్నవాహ నాన్ని కూడా ధ్వంసం చేశారు.
ఈ దాడి జరిగిన కార్యాలయం గంగుల కమలాకర్ కు చెందిన క్యాంప్ ఆఫీస్గా తెలుస్తోంది. బండి సంజయ్పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకే నిరసనగా ఈ దాడి జరిగిందని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. దీంతో కరీంనగర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ నాయకుల పరస్పర ఆరోపణలు, కార్యకర్తల ఆందోళనలతో జిల్లాలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడు తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-workers-attack-karimnagar-mlas-office-36-219148.html
తమిళనాడు రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు.
ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది.
మెుహాలీలోని ఖరార్ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా సోదాలు జరుగుతున్న ప్రాంగణంలో నోట్ల కట్టలతో నిండిన బ్యాగులు దొరకడం హాట్ టాపిక్గా మారింది.
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.
కుటుంబ సభ్యులతో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రమాదం వల్ల వారికి కలిగిన బాధను పంచుకుంటూ ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో శ్రీతేజ్ సోదరి చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని అల్లు అరవింద్ ప్రకటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే సన్ రైజర్స్ బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వర్షం కురిపించారు.
నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్గ్రామ్లో బుధవారం రాత్రి ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి హత్య చేశారు. దోహరియా ప్రాంతంలోకి ఆయన కారును వెంబడించి వచ్చిన దుండగులు చంద్రనాథ్ రథ్పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.