రాష్ట్ర భవిష్యత్ కు తెలుగుదేశం గ్యారంటీ!

Publish Date:May 28, 2023

Advertisement

తెలుగుదేశం రాష్ట్ర భవిష్యత్ కు మాదీ గ్యారంటీ అని ఎలుగెత్తింది. సంక్షేమం అంటే అప్పులు చేసి సొమ్ములు పందేరం చేయడం కాదని ఉద్ఘాటించింది. సంపద పెంచి దానికి పేదలకు అందజేయడమే నిజమైన సంక్షేమం అని కుండబద్దలు కొట్టింది. నాలుగేళ్లుగా రాష్ట్ర అభివృద్ధిని అటకెక్కించి.. సంక్షేమం పేర పేదలకు రూపాయి విదిల్చి వంద రూపాయలు దోచేసిన జగన్ సర్కార్ తీరును ఎండగట్టింది.

నిజమైన సంక్షేమం అంటే ఏమిటో ఆరు హామీల రూపంలో ప్రజల కళ్లకు కట్టేల వివరించింది. రాజమహేంద్ర వరం వేదికగా తెలుగుదేశం పార్టీ రెండు రోజుల పాటు నిర్వహించిన మహానాడులో సంక్షేమ రంగంలో  ఆరు హామీలు ఇస్తూ.. రాష్ట్ర భవిష్యత్ కు తెలుగుదేశం పార్టీ గ్యారంటీ అని నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. భవిష్యత్ కు గ్యారంటీ పేరిట మినీ మేనిఫెస్టోనూ ప్రకటించారు.  నిరుద్యోగులు, మహిళలు, రైతులకు అండగా, చేదోడువాదోడుగా నిలవడమే కాదు.. ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి దన్నుగా నిలిచిన బీసీలకు కూడా చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోలో గ్యారంటీ ఇచ్చారు.

 ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ,  జిల్లాల పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. అలాగే  రూ.3 వేలు నిరుద్యోగభృతి అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. పేదలను ధనవంతులు చేయడం తెలుగుదేశం లక్ష్యమని, అధికారంలోకి రాగానే ఐదేళ్ళలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. రిచ్ టూ పూర్  పథకం తో పేదలను సంపన్నులను చేసే విధంగా  వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టే ప్రభుత్వం  ముందడగు వేయనుందని ఉద్ఘాటించారు.  బీసీల  రక్షణ చట్టం తీసుకువచ్చి అన్ని విధాలుగా వారికి అండగా ఉంటామని చంద్రబాబు ప్రకటించారు.

నాలుగేళ్ల వైసీపీ పాలనలో ఇంత వరకూ  26 మందికి పైగా బీసీలు హత్యకు గురైయ్యారు. 650 మంది బీసీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు, 43 మందికి పైగా ముస్లిం మైనార్టీలపై దాడులు జరిగాయి అని వెల్లడించిన చంద్రబాబు, వీటిని దృష్టిలో పెట్టుకుని  బీసీలకు రక్షణ చట్టాన్నితీసుకురావాలని తెలుగుదేశం సంకల్పించిందన్నారు.  అలాగే ఇంటింటికీ మంచి నీర  పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ కు తెలుగుదేశం పార్టీ పూచీ పడుతుందని చంద్రబాబు చెప్పారు. 

తెలుగుదేశం ధికారంలోకి రాగానే ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తామన్నారు. ఇక రైతులకు అన్న దాత ఈ పథకం కింద రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్నారు.   మహిళ మహా శక్తి పథకం ద్వారా ప్రతి కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన మహిళలకు  స్త్రీనిధి కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు.  తల్లికి వందనం  పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15,000లు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు.  

ఉచిత బస్సు ప్రయాణం  పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు.  నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలిస్తుందని… ప్రతి నిరుద్యోగికి యువగళం నిధి కింద నెలకు 3000 రూపాయలను ఇస్తామని చంద్రబాబు మినీ మేనిఫెస్టోలో ప్రకటించారు.  చంద్రబాబు వ్యూహాత్మకంగా మినీ మేనిఫెస్టో ప్రకటించడం ద్వారా జగన్ నవరత్నాలు పథకంలోని డొల్లతనాన్ని అందరికీ అర్ధమయ్యేలా చేశారు. వైసీపీ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న వాలంటీర్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి పథకాలను పొందాల్సిన అవసరం లేదని, తెలుగుదేశం ప్రభుత్వం అర్హులందరినీ ఒకే విధంగా చూస్తుందని చెప్పకనే చెప్పారు.

సంక్షేమం అంటే ఉపాధి, ఉద్యోగ కల్పనతో పాటుగా భవిష్యత్ కు భరోసా కల్పించడమని విస్పష్టంగా చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా సాగాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పారు. తెలుగుదేశంకు సంపద సృష్టించడం తెలుసు, ఆ సంపద ఫలాలను పేదలకు అందించం తెలుసు అని చంద్రబాబు తన ప్రసంగం ద్వారా అందరికీ  స్పష్టం చేశారు. మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోపై సర్వత్రా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. 

By
en-us Political News

  
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.