అప్పుల చక్రంలో ఆర్థిక వ్యవస్థ?

Publish Date:Apr 12, 2025

Advertisement

అంబలి తాగే వాడికి మీసాలు ఎత్తేవాడొకడు అని సామెత. ఈ సామెత ఎందుకు పుట్టిందో, ఎలా పుట్టిందో ఏమో కానీ.. అప్పులు తెచ్చుకొనేందుకు కూడా తెలంగాణ  ప్రభుత్వం ఓ బ్రోకరేజ్‌ సంస్థను పెట్టుకున్నదని, ప్రతిపక్ష బీఆర్ఎస్ చేసిన తాజా ఆరోపణ. ఆ ఆరోపణ నిజం అయితే  మాత్రం ఆ సామెత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అతికినట్లు సరిపోతుందని అంటున్నారు.  

అఫ్కోర్స్ ఒక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే కాదు.. చాలా వరకు ప్రభుత్వాలది అదే పరిస్థితి. అప్పుల ఊబిలో కూరుకు పోయిన రాష్ట్ర ప్రభుత్వాలు, ఎక్కడా అప్పు పుట్టని పరిస్థితిలో,ఇలాంటి బ్రోకరేజ్ సంస్థలను ఆశ్రయించడం కొత్తేమీ కాదు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చిన సందర్భాలు లేక పోలేదు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ అప్పుల కోసం అడ్డదారులు తొక్కిన సందర్భాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. నిజానికి, కేటీఆర్ చేసిన ఆరోపణకు ఆధారం కూడా ఆయన శోధించి సాధించింది కాదు. బీఆర్ఎస్ సభ్యుడు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం ఆధారంగానే కేటీఆర్ ఈ ఆరోపణలు చేశారు.     

అయితే అంత మాత్రం చేత బీఆర్ఎస్ ప్రభుత్వ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల వేట సాగించడం సమర్ధనీయం కాదని ఆర్థిక  నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు. నిజానికి గత ప్రభుత్వం చేసిన తప్పుల్లో కెల్లా పెద్ద తప్పు అభివృద్ధి, సంక్షేమం పేరున అవసరానికి మించి అందిన కాడికి అప్పులు చేయడం. మరోవంక అదే అభివృద్ధి, సంక్షేమం ముసుగులో  లెక్కాపత్రం లేకుండా ప్రభుత్వ భూములను విక్రయించడం. ఫలితంగా ఆర్థిక క్రమ శిక్షణ పట్టాలు తప్పింది. అవినీతి పెచ్చిరిల్లింది. ధనిక రాష్ట్రం ఇదిగో ఇలా  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెపుతున్న అప్పులు పుట్టని అధ్వాన స్థితికి చేరిందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.   

అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం బాటలో అప్పుల భారం పెంచుకుంటూ పోవడం ఏమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై పూర్తి అవగాహన వుంది. ఎందుకంటే.. కట్టే, కొట్టే,తెచ్చే అన్నట్లు మూడు ముక్కల్లో ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని  సామాన్యులకు కూడా చక్కగా  అర్థమయ్యేలా పలు సంధర్భాలలో వివరించారు. 

అవును గత బీఆర్ఎస్  ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసింది. ఆ అప్పుల పై నెలనెలా అనివార్యంగా చెల్లించవలసిన అసలు, వడ్డీ తడిసి మోపెడై కూర్చున్నాయి. సర్కార్ బండి కదలడం లేదు అని ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి కాదు, ఒక దగ్గర కాదు,ఎక్కడంటే అక్కడ లెక్కల చిట్టా విప్పి చెపుతూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నెలసరి ఆదాయం రూ. 18 వేల కోట్ల నుంచి రూ.18,500 కోట్లు, అందులో ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలు, పెన్షన్లకు రూ. 6,500 కోట్లు, గత ప్రభుత్వం చేసిన అప్పుల అసలు వడ్డీల చెల్లింపుకు మరో రూ. 6,500 కోట్లు.. తప్పించుకోలేని ఈ రెండు పద్దులకు పోనూ సర్కార్ చేతిలో మిగిలేది’ కేవలం రూ.5000 వేల నుంచి రూ.5500 కోట్లు మాత్రమే. ఇందులోంచే  అన్నీ చేయాలని సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అద్దంలో ప్రతిబింబంలా చూపించారు. అలాగే కొండలా పెరిగిన ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించవలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఫస్ట్ తేదీన జీతాలు చెల్లించేందుకు పడుతున్న కష్టాల గురించి  ఇలా ప్రభుత్వం  పడుతున్నఈతి బాధలగురించి ఎన్నో సందర్భాలలో చక్కగా చెప్పారు.

అయితే ముఖ్యమంత్రి చెప్పే మాటలన్నీ నిజాలేనా అంటే.. అవున కానీ, కాదని కానీ చెప్పడం కుదరదు.  అలాగే విపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  చేసిన తాజా ఆరోపణల విషయంలోనూ... ఆయన అంతా నిజమే చెప్పారని అనుకోనవసరం లేదు. కానీ ఓ వంక గత ప్రభుత్వ నిర్వాకం పుణ్యాన పైసా అప్పు పుట్టడం లేదని అంటూనే.. ఈ 15 -16 నెలల కాలంలో అక్షరాలా లక్షన్నర కోట్లరూపాయలు అప్పు చేసినట్లు సర్కార్ లెక్కలే చెపుతున్నప్పుడు  దాల్ మే కుచ్ కాలా హై అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. అదికూడా ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పు చేసిందంటే.. కేటీఆర్ చేసిన  ‘బ్రోకరేజ్‌’ ఆరోపణను కొట్టి వేయడం కుదరదని విశ్లేషకులు అంటున్నారు. 

ఇక విషయంలోకి వస్తే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధానంగా ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్న కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి సంబందించి ఈ ఆరోపణ చేయడం సంచలనంగా మారిందని అంటున్నారు. కంచ గచ్చిబౌలి లోని 400 ఎకరాలను ఐటీ, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీజీఐఐసీ)కి కేటాయించింది. ఆ భూములను టీజీఐఐసీ ద్వారా తాకట్టు పెట్టించి, 2024 డిసెంబర్‌లో రేవంత్‌ సర్కారు రూ.10,000 కోట్ల అప్పు తెచ్చింది. అప్పు సృష్టించి ఇప్పించినందుకు బ్రోకరేజ్‌ సంస్థగా పనిచేసిన  ట్రస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వయిజర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌’  రాష్ట్ర ప్రభుత్వం రూ.169,కోట్లు చెల్లించిందని కేటీఆర్ ఆరోపించారు. అయితే ఆరోపణలు, ప్రత్యారోపణల విషయం పక్కన పెడితే.. అప్పులు, అమ్మకాలపై అధాపడిసాగుతున్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చక్క బడడం, పట్టాలు ఎక్కడం  ఇక కష్టమే అంటున్నారు.

By
en-us Political News

  
గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీలో నాయకులు, శ్రేణులూ పూర్తిగా డీలా పడ్డాయి. దానికి తోడు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వలస వెళ్లిపోయి, ఎలాగో తీరిక చేసుకుని వారానికి ఒక సారి మాత్రం ఆంధ్రప్రదేశ్ వచ్చి.. వెడుతున్నారు. దీంతో ఆయన పూర్తిగా పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా మారిపోయినట్లైందని పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన పది మంది ఎమ్మెల్యేలు ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరారంటూ బీఆర్ఎస్ అరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన స్పీకర్ ఎమ్మెల్యేల వాదనలు విన్నారు.
స‌చివాల‌యంలో కేటీఆర్ కి ఇంత నెట్ వ‌ర్క్ ఉందా? అని విస్తుపోయింది. విచారణకు ఆదేశించి.. లీకు వీరులు ఎవరైనా, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలూ జారీ చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినలో బిజీబిజీగా ఉన్నారు. ఓ వైపు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూనే, మరో వైపు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అవుతూ క్షణం తీరక లేకుండా గడుపుతున్నారు.
ఐడీపీఎల్ భూముల విషయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత ఇటీవల పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ భూముల వ్యవహారం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
గత జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి విపక్ష నేత చంద్రబాబును స్కిల్ కేసు పేరుతో అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో నారా బ్రహ్మణి తొలి సారిగా ప్రజల మధ్యకు వచ్చి అరెస్టునకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఆ సందర్భంగా ఆమె ప్రసంగాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
జగన్ అధికారంలో ఉన్న సమయంలో తమకు ఎదురే లేదన్నట్లు చెలరేగిపోయిన వైసీపీ నేతలు, అప్పటి తన కర్మఫలాన్ని ఇప్పుడు అనుభవించక తప్పడం లేదు.
సామాజిక తెలంగాణయే తన లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టం చేశారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటిస్తున్న నాగబాబు ఆదివారం శ్రీకాకుళంలో జనసేన నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఎన్నికలలో తన పోటీ గురించి వచ్చిన ప్రస్తావనపై స్పందించిన ఆయన తాను మాత్రం ఎన్నికలలో పోటీ చేసే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
తెలుగుదేశం సీనియర్లు, అందులోనూ కమ్మసామాజికవర్గానికి చెందిన దిగ్గజాలను అంబటి పరామర్శించడం వెనుక లెక్కలేంటి? ఊరకరారు మహానుభావులు అన్నట్లు అంబటి రాక వెనుక పొలిటికల్ ఈక్వేషన్లు ఏంటన్నది ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది.
తమిళనాడులో బీజేపీ ఎన్ని జన్మలు ఎత్తినా అధికారంలోకి రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ మాజీ నేత, తెలంగాణ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ఎఫెక్ట్ బీఆర్ఎస్ పై ప్రతికూలతకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరీ ముఖ్యంగా సరిగ్గా పంచాయతీ ఎన్నికల వేళ కవిత చేపట్టిన జనజాగృతి యాత్ర ప్రభావం బీఆర్ఎస్ ఓటింగ్ పై తీవ్ర ప్రభావం చూపిందంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.