సైబర్ నేరాల కట్టడిలో నంబర్ వన్ తెలంగాణ.!

Publish Date:Aug 7, 2026

Advertisement

ఆన్‌లైన్ మోసాలు, బ్యాంకింగ్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్టుల పేరుతో కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతూ అమాయకుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఇలాంటి   సైబర్ నేరగాళ్ల ఆట కట్టించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ విషయం పీఎంవో నిర్వహించిన ప్రగతి సమీక్షలో  వెల్లడైంది.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు,  కేంద్రపాలిత ప్రాంతాల సైబర్ సెక్యూరిటీ విభాగాల పనితీరును సమీక్షించింది. ఈ సమీక్షలో    9  అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారు. వాటిలో టెక్నాలజీ వినియోగం, బాధితులకు ఫిర్యాదుల పట్ల స్పందించే వేగం,  రికవరీ వ్యవస్థల సమర్థత  విభాగాల్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో  అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కంటే ముందు ఉందని తేలింది. 

డిజిటల్ నేరాలను అరికట్టడానికి తెలంగాణ పోలీస్ శాఖ  దేశంలోనే తొలిసారిగా స్టేట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌ను ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనితో పాటు కేసుల నమోదులో జాప్యాన్ని నివారించడానికి ఇ జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని  విజయవంతంగా అమలు చేస్తోంది.  బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సమీక్షించడానికి గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మాడ్యూల్‌ను   సమర్థవంతంగా నిర్వహిస్తోంది.

సైబర్ మోసానికి గురైన వెంటనే బాధితులు నష్టపోయిన నగదును తిరిగి అందించడంలో తెలంగాణ ఉపయోగించే మనీ రిస్టోరేషన్ మాడ్యూల్ ప్రభావమంతంగా పని చేస్తోంది.  మోసగాళ్ల ఖాతాల్లో ఉన్న సొమ్మును తక్షణమే హోల్డ్‌లో పెట్టి   బాధితులకు తిరిగి ఇప్పించడంలో తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ వన్ గా  నిలిచింది. దీనికి తోడు సహ్యోగ్, సమన్వయ పోర్టళ్ల   వాడకం, ప్రధాన సైబర్ క్రైమ్ హాట్‌స్పాట్‌ల నిరంతర పర్యవేక్షణ, పోలీసు అధికారుల నైపుణ్యం పెంపుదల వంటి చర్యలు తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాయి.

ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పరిధిలోని కేంద్ర డిజిటల్ వేదికలను  సమర్థవంతంగా వినియోగించుకుంటున్నందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు కేంద్ర పీఎంవో సమీక్షలో ప్రత్యేక ప్రశంసలు లభించాయి.  

Telangana cyber crime control rank 1, PMO Pragati review cyber security, Telangana Cyber Security Bureau TGCSB, cyber crime helpline 1930, S4C cyber crime Telangana, Money Restoration Module TGCSB

By
en-us Political News

  
సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూపీఐ చెల్లింపులపై ఇటీవల నెట్టింట ఊపందుకున్న ఛార్జీల ప్రచారానికి ప్రముఖ డిజిటల్ వ్యాపార దిగ్గజం ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ తెరదించారు
నోరు పారేసుకుంటే ఇళ్లకు వచ్చి కొడతాం....!
నెలకు రూ.1.5 లక్షల జీతం అని చెప్పి.. బీర్ షాప్ ఓనర్‌కు అమ్మేశారు..!
అదుపుతప్పి బోల్తా పడిన 100 అడుగుల లోయలో పడ్డ ప్రైవేటు బస్సు..!
నర్సంపేట మాజీ శాసనసభ్యులు, దివంగత నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొండంత అండగా నిలిచారు.
అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏజీఐసీఎల్)  ఈ ఐకానిక్ సిగ్నేచర్ బ్రిడ్జికి  సంబంధించిన ఫీజిబిలిటీ, డీపీఆర్,  కన్సల్టెన్సీ కోసం టెండర్ల ప్రక్రియను చేపట్టింది. 
ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు, నియామక ప్రక్రియకు సంబంధించిన పనులు జరుగుతున్నాయన్న ఆయన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు.
క్యాన్సర్ మందుల విపరీతమైన ధరలపై కేంద్ర ప్రభుత్వ వివరణను పార్లమెంటరీ స్థాయి సంఘం తోసిపుచ్చింది. ట్రేడ్ మార్జిన్లపై తక్షణమే పరిమితులు విధించి, ప్రాణరక్షణ ఔషధాల ధరలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
కామన్వెల్త్ గేమ్స్ 2026లో మహిళల షాట్‌పుట్ F57 విభాగంలో 9.81 మీటర్ల త్రోతో పసిడి పతకం గెలిచి చరిత్ర సృష్టించిన పారా అథ్లెట్ షర్మిలా ధన్కర్ స్ఫూర్తిదాయక జీవిత కథ మరియు పోరాట విశేషాలు.
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు! హైదరాబాద్, విజయవాడ, విశాఖ సహా ప్రధాన నగరాల్లో నేటి 18, 22, 24 క్యారెట్ల తులం పసిడి రేట్ల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
పిరమల్ ఫైనాన్స్ మరియు బైన్ క్యాపిటల్ మద్దతుగల ఇండియాఆర్‌ఎఫ్, బెలగావికి చెందిన అశోక్ ఐరన్ వర్క్స్ యూనిట్ ఫైన్ ఎడ్జ్ ఇంజనీరింగ్ లో దాదాపు ₹2,000 కోట్లతో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. ఈ బిగ్ డీల్ విశేషాలు మరియు భవిష్యత్తు ప్రణాళికలను ఇక్కడ తెలుసుకోండి!
అమెరికా సెనెట్‌లో ఇటీవల జరిగిన ఓటింగ్ లో శాంశనింగ్ రష్యా, ఇరాన్ యాక్ట్ 2026 బిల్లుపై చర్చ జరిగింది. చర్చ అనంతరం జరిగిన ఓటింగ్ లో ఈ బిల్లు 86-11 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. సెనెట్‌లో ఆమోదం పొందిన ఈ బిల్లుఈ నెల 31న అమెరికా ప్రతినిధుల సభ ముందుకు రానుంది. లోయర్ హౌస్‌లో కూడా ఆ బిల్లు ఆమోదం పొందితే.. ఆ వెంటనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకంతో చట్టంగా మారి అమల్లోకి వస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.