టీసీఎస్ ఉద్యోగి అమిత్ బ్రహ్మే ఆత్మహత్య.. ఇద్దరు మహిళా ఉద్యోగులపై కేసు

Publish Date:Jun 13, 2026

Advertisement

పుణెలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో పని చేస్తున్న 48 ఏళ్ల అమిత్ అభయ్ బ్రహ్మే  ఆత్మహత్య కు సంబంధించి ఇద్దరు మహిళా ఉద్యోగులపై కేసు  నమోదైంది. వివరాలిలా ఉన్నాయి.  అమిత్ అభయ్ బ్రహ్మే  ఈ నెల2న భోసరిలోని తన నివాసంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇతడి    ఆత్మహత్య  కార్పొరేట్ ప్రపంచంలో దాగున్న మానసిక వేధింపుల చీకటి కోణాన్ని మరోసారి బయటపెట్టింది. జూన్ 9న అమిత్ 19 ఏళ్ల కుమారుడు అనీష్ బ్రహ్మే ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయడంతోనే ఈ  ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలంలో అమిత్ రాసిన సూసైడ్ నోట్  లభించింది. తన చావుకు గల కారణాలను, తను అనుభవించిన నరకాన్ని అమిత్ అభయ్ బ్రహ్మే ఆ లేఖలో కళ్లకు కట్టాడు. 

ఆ సూసైడ్ నోట్‌లో అమిత్ బ్రహ్మే తన సహోద్యోగినులు అర్చన, శశ్వతిలపై   తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ ఇద్దరు మహిళా ఉద్యోగులు ఆఫీసులో అందరి ముందూ తనను పదేపదే అవమానించే వారనీ, మానసికంగా కుంగిపోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అసలు నైపుణ్యం,  అనుభవం లేని ప్రాజెక్టులను కావాలనే అప్పగించి, ఆపై పనితీరు సరిగా లేదంటూ బహిరంగంగా మందలించేవారని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా.. ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేయాలంటూ  తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చారని పేర్కొన్నాడు. దీనికి తోడు, అమిత్ స్నేహితుడు వినోద్ పలిచా సైతం నమ్మకద్రోహానికి పాల్పడ్డాడు. కంపెనీ యాజమాన్యానికి అమిత్‌పై లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ ఈమెయిల్స్ పంపి, ఆయన కెరీర్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నించాడని ఆ లేఖ ద్వారా తెలిసింది.

బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు,  లభించిన ఆధారాల మేరకు  పోలీసులు  అర్చన, శశ్వతి మరియు వినోద్ పలిచాలపై ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదనీ.. పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈఘటనపై టీసీఎస్ యాజమాన్యం స్పందించింది. తమ సంస్థలో ఉద్యోగుల మానసిక శ్రేయస్సుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెబుతూ, మృతుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ప్రకటించింది. అంతర్గతంగా విచారణ జరిపి వాస్తవాలను నిగ్గుతేలుస్తామని హామీ ఇచ్చింది.  

By
en-us Political News

  
ఈ సందర్భంగా కోర్టు వెలుపల జరుగుతున్న రాజకీయ చర్చలపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇది కేవలం ఒక నేరపూరిత ఉదంతం. దీనిని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని పేర్కొంది.
ఈ తీవ్రమైన ఆరోపణలపై ఉదయ్ కృష్ణారెడ్డి స్పందిస్తూ, అవన్నీ అసత్యాలని, బేస్‌లెస్ ఆరోపణలని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. తన వద్ద ఉన్న ఆధారాలతో సదరు మహిళా అధికారిణిపై కేసు పెడతానని మీడియాకు మెసేజ్ పంపారు. అయితే ఈ వార్త జాతీయ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతంగా ప్రచారం కావడం, తన ప్రతిష్ఠకు భంగం కలిగిందన్న మానసిక ఆందోళనకు ఆయన గురై.. హైదరాబాద్ మోతీనగర్‌లోని తన బంధువుల ఇంట్లో తీవ్ర డిప్రెషన్‌లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆక్వా కల్చర్, పొగాకు రంగాలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని
ప్రధాని మోడీకి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెబుతూ వస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వచ్చే నెల మొదటి తేదీన భోగాపురం రానున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి వేదికగా జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
శ్రీకాకుళం సమీపంలోని చాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 900 చదరపు గజాల ఖాళీ స్థలం కబ్జాలక్ష్యంగా.. ఆ భూమి అసలు యజమానులకు సంబంధం లేకుండా, స్థలాన్ని కబ్జా చేసేందుకు, లేని వ్యక్తులను ఉన్నట్లుగా, ఉన్న వారిని మరణించినట్లుగా చూపిస్తూ బోగస్ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించారు. తద్వారా న్యాయబద్ధమైన వారసుల పత్రాలను ఫోర్జరీ చేసి అక్రమంగా యాజమాన్య హక్కులను పొందడానికి ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠ భరిత పరిణామాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది.
రాష్ట్రంలో మాతా–శిశు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోన్న ప్రభుత్వం
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ఉభయ సభలను నీట్ వివాదం కుదిపేసింది.
సీజేపీ చలో పార్లమెంట్ ఉద్రిక్తం, పోలీసుల ఆంక్షలు..!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి సస్పెండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.