‘కోతికి కొబ్బరికాయ ఇస్తే.. నెత్తిపై కొట్టుకుందట’ ఇది పాత నానుడి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి తానేటి వనిత తీరు అందుకు భిన్నంగా లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో మహిళలపై రోజురోజుకూ లైంగికదాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్న నేపథ్యంలో హోంమంత్రిగా తాను నిర్వర్తించాల్సిన పని సక్రమంగా చేయడం లేదు సరికదా.. ఏదో ఇంట్లో కూర్చుని యధాలాపంగా మాట్లాడేసినట్లు ఆమె మాట్లాడుతుండడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఓనమాలు తెలియని వ్యక్తికి హోం శాఖ ఇస్తే ఇలాగే ఉంటుందని ప్రత్యర్థి పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
మహిళలపై లైంగికదాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో హోంమంత్రిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన తానేటి వనిత చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లోను, రాష్ట్ర ప్రజల్లోను, సోషల్ మీడియాలోనూ విమర్శల జడివాన కురుస్తోంది. విశాఖపట్నంలోని దిశ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సందర్భంగా హోంమంత్రి వనిత చేసిన వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురిచేశాయి. ఆపైన అందరికీ ఆగ్రహం తెప్పించాయి. ‘బిడ్డల సంరక్షణ బాధ్యత తల్లిదే. తల్లి పాత్ర సరిగా లేనప్పుడే అత్యాచారాలు లాంటివి జరుగుతుంటాయని ఆమె యధాలాపంగా.. ఇంట్లో మాట్లాడుకున్నట్లు అనేయడం అందరికీ ఆశ్చర్యం కలిగింది. పైగా తండ్రి పనిమీద బయటకు వెళ్లినప్పుడు బిడ్డల సంరక్షణ బాధ్యత తల్లి చూసుకుంటుందని, ఆమె కూడా ఉద్యోగం కోసమో, ఏదైనా పని కోసమో బయటకు వెళ్లినప్పుడు పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడే అఘాయిత్యాలు జరుగుతున్నాయని వనిత వ్యాఖ్యానించారు.
ఒక పక్కన ఏపీలో తరచూ మహిళలపై దాడుల సంఘటనలు వెలుగు చూస్తున్న వేళ ఆ తప్పంతా టీడీపీదే అనే ధోరణిలో హోంమంత్రి వనిత మాట్లాడడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. హత్యలు, అత్యాచార ఘటనల నిందితుల్లో టీడీపీ వారే ఎక్కువ ఉంటున్నారని ఆమె ఆరోపించడం గమనార్హం. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా సరైన దిశలో చర్యలు తీసుకోవడం హోం మంత్రిగా తానేటి వనిత బాధ్యత. అయితే.. ఏదో యధాలాపంగా టీడీపీ వాళ్లే నిందితులంటూ ఓ పనికిమాలిన వ్యాఖ్య చేసేసి చేతులు దులుపుకోవడం ఏంటనే ప్రశ్న వేస్తున్నారు. చేతిలో పోలీస్ పవర్ ఉంది.. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తన మీదే ఉంది. అయినా.. ఆ దిశగా ఆమె తీసుకుంటున్న చర్యలేమిటో ఎక్కడా కనిపించడం లేదని అంటున్నారు. టీడీపీ నేతల ప్రమేయంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ రేపల్లె రైల్వే స్టేషన్ లో జరిగిన సంఘటన బాధితురాలిని పరామర్శించిన సందర్భంగా హోంమంత్రి వనిత ఈ స్టేట్ మెంట్ ఇవ్వడం ఆమే చేతకానితనానికి నిదర్శనం అంటున్నారు.
తాజాగా హోంమంత్రి తానేటి వనిత గుంటూరులో చేసిన వ్యాఖ్యలు కూడా దుమారాన్నే లేపుతున్నాయి. రేపల్లె ఘటనపై స్పందిస్తూ.. ‘దుండగులు ఆమెపై అత్యాచారం చేసే ఉద్దేశంతో రాలేదు. మద్యం మత్తులో ఉన్న దుండగులు డబ్బుల కోసం బాధితురాలి భర్తపై దాడి చేశారు. ఆ సమయంలో భర్తను రక్షించుకోడానికి బాధితురాలు వెళ్లింది. ఆ సందర్భంగా నిందితులు ఆమెను నెట్టేసే క్రమంలోనే ఆమె అత్యాచారానికి గురైంది’ అనడం హోంమంత్రి తన అసహాయతను బయటపెట్టుకున్నారంటున్నారు. ‘పేదరికం వల్లో, మానసిక పరిస్థితుల వల్లో అప్పటికప్పుడు అనుకోని రీతిలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఆమెపై జరిగిన లైంగిక దాడికి.. పోలీసు సిబ్బంది కొరతకు సంబంధమే లేదు’ అనడం హోంమంత్రి స్థాయికి తగదని పలువులు ఫైరవుతున్నారు.
గతంలో అధ్యాపకురాలిగా పనిచేసిన వనితమ్మ నాలుక ఇలాగేనా మాట్లాడేది..? ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలా చేసేది..? పబ్లిక్ లో మాట్లాడుతున్నామన్న ఇంగితజ్ఞానం ఆమెకు ఉండక్కర్లా అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేసేది తక్కువ.. ప్రయోజనం లేని మాటలు ఎక్కువ చందంగా హోంమంత్రి వనిత తీరు ఉందని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/taneti-vanitha-home-minister-or-mer-maker-25-135428.html
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు.
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.