Top Stories

political-news-img

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల గాలింపు ముమ్మరం..!

కోస్టుగార్డు, నేవీ నౌకలతో గాలింపు చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..! విశాఖ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సముద్రంలో మత్య్సకారుల గల్లంతయ్యారన్న విషయం తెలిసిన వెంటనే ఆయన కుప్పం నుంచి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. బంగాళాఖాతంలో గల్లంతైన మత్స్యకారుల బోటును గాలించేందుకు కోస్టుగార్డు నౌక ప్రయత్నిస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి INDAP-VS-MM-83 అనే బోటు 7గురు మత్స్యకారులతో జూన్ 1 తేదీ సాయంత్రం 4 గంటలకు సముద్రంలోకి చేపల వేటకు బయల్దేరి వెళ్లిందని సీఎంకు అధికారులు తెలిపారు. 4 తేదీ మధ్యాహ్నానికి ఆ బోటు ఫిషింగ్ హార్బర్ కు తిరిగి రావాల్సి ఉందని అయితే సాంకేతిక కారణాల వల్ల ఆ బోటు ఇప్పటికీ తిరిగి రాలేదని వివరించారు. గంగవరం సముద్ర తీరం సమీపంలో వారి బోటుకు సాంకేతిక సమస్య ఉత్పన్నమైనట్టుగా గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఇవాళ ఉదయం నుంచి నౌకాదళానికి చెందిన హెలికాప్టర్ల ద్వారా కూడా గాలింపు చర్యలు ప్రారంభించినట్టు తెలిపారు. ప్రస్తుతం కోస్టుగార్డు, నేవీ, మెరైన్ పోలీసు విభాగాలు గాలింపు చర్యలు చేపట్టినట్టు అధికారులు వివరించారు. గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరిని క్షేమంగా ఒడ్డుకు చేర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన సీఎం సముద్రంలో చేపడుతున్న గాలింపు చర్యలను సమన్వయం చేసుకోవాల్సిందిగా మెరైన్ ఐజీ, విశాఖ సీపీలను ఆదేశించారు. గాలింపు చర్యలకు సంబంధించిన అంశాలను తనకు ఎప్పటికప్పుడు తెలియచేయాలని సీఎం సూచించారు. మత్స్యకారుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలని మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక విశాఖ ప్రజాప్రతినిధులకు సీఎం ఆదేశాలిచ్చారు.

Publish Date: Jul 5, 2026 11:08AM

political-news-img

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం..!

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిట్యాల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జు నుజ్జయింది.. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఏడేళ్ల బాలుడు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. మరో మృతుడి వివరాలు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అత్యవ సర సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిం చారు. బస్సు వేగం, డ్రైవింగ్ నిర్లక్ష్యం లేదా ఇతర కారణాల వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ విషాద ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను స్థానిక సీఐతో పాటు ఇతర అధికారులను ఫోన్‌లో అడిగి తెలుసుకు న్నారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర నివేదికను వెంటనే అందజేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ కష్టకాలం లో ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

Publish Date: Jul 5, 2026 10:57AM

political-news-img

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..పోలీస్ కొలువుల నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర పోలీస్ శాఖతో పాటు అగ్నిమాపక విపత్తు ప్రతిస్పందన, అత్యవసర మరియు పౌర రక్షణ శాఖ, జైళ్లు & దిద్దుబాటు సేవల శాఖ, ప్రత్యేక రక్షణ దళం (ఎస్‌పీఎఫ్)లో మొత్తం 7,437 ఖాళీల భర్తీకి ప్రభుత్వం అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను సిద్ధం చేసింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. సంబంధిత శాఖల నుంచి స్థానిక కేడర్ల వారీగా ఖాళీల వివరాలు, రోస్టర్ పాయింట్లు, అర్హతలు తదితర సమాచారం అందిన వెంటనే కొద్ది రోజుల్లో అధికారిక నోటిఫి కేషన్లు విడుదల చేయను న్నట్లు వెల్లడించారు. పోలీస్ శాఖలో మొత్తం 5,000 వేలకుపైగా పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందులో 148 సివిల్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, 14 ఏఆర్ రిజర్వ్ ఎస్‌ఐలు, 12 టీజీఎస్పీ రిజర్వ్ ఎస్‌ఐలు, 3 ఎస్‌ఏఆర్‌సీపీఎల్ రిజర్వ్ ఎస్‌ఐలు, 23 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు (ఎఫ్‌పీబీ) పోస్టులు ఉన్నాయి. అలాగే 3,697 సివిల్ కానిస్టేబుళ్లు, 1,052 ఏఆర్ కానిస్టేబుళ్లు, 24 ఎస్‌ఏఆర్‌సీపీఎల్ కానిస్టేబుళ్లు, 20 డ్రైవర్ కానిస్టేబుళ్లు, 7 మెకానిక్ కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. అగ్నిమాపక విభాగంలో 39 స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 751 ఫైర్ ఫైటర్ల పోస్టులకు కూడా నోటిఫికేషన్ జారీ కానుంది. జైళ్లు & దిద్దుబాటు సేవల శాఖలో 14 పురుష డిప్యూటీ జైలర్లు, ఒక మహిళా డిప్యూటీ జైలర్, 196 పురుష వార్డర్లు, 12 మహిళా వార్డర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రత్యేక రక్షణ దళం (ఎస్‌పీఎఫ్)లో 44 సబ్ ఇన్‌స్పెక్టర్లు, 1,380 కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మొత్తం 7,437 పోస్టులకు నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు జారీ చేసింది. పోస్టుల వారీ అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, ఎంపిక విధానం, పరీక్షల షెడ్యూల్ తదితర పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడికానున్నాయి.దీంతో చాలా కాలంగా పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వేలాది మంది అభ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురించాయి. త్వరలో అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో అభ్యర్థులు ఇప్పటి నుంచే పరీక్షలకు సిద్ధం కావాలని అధికారులు సూచిస్తున్నారు.

Publish Date: Jul 5, 2026 10:40AM

political-news-img

భారీ వర్షాలకు ముంబై మునక?.. విద్యాసంస్థలకు సెలవు.!

భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ శనివారం (జులై 4) మధ్యాహ్నం నుంచే నగరంలోని అన్ని సెలవు ప్రకటించింది. ముంబైతో పాటున థానే, పాల్ఘర్, రాయగఢ్ జిల్లాల పరిధిలోని విద్యాసంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. ఈ వారం ప్రారంభం నుంచే ముంబైని ముంచెత్తుతున్న వానలు, గత 24 గంటల్లో మరింత ఉధృత రూపం దాల్చాయి. శనివారం నాటికి నగరంలోని పలు ప్రాంతాల్లో గరిష్టంగా 100 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది.ఆది, సోమ(జులై 5, 6) వారాలలో కూడా ముంబై వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబైతో పాటు థానే, పాల్ఘర్, రాయగఢ్ జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ప్రజలకు సూచించింది. భారీ వర్షాల కారణంగా ముంబైలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ముంబై లైఫ్ లైన్ గా పిలిచే సబర్బన్ లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వేలాది మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్లలోనే చిక్కుకుపోయారు. అంధేరి ఈస్ట్ సబ్‌వే వంటి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అక్కడ చేరిన వర్షపు నీటిని తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన డీవాటరింగ్ పంపులతో ఏర్పాటు చేసి నీటిని తోడేస్తున్నారు. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొంటూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. IMD red alert Mumbai, BMC school holiday, Thane rain alert, Teluguone

Publish Date: Jul 5, 2026 7:51AM

political-news-img

సముద్రంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఉద్ధృతితో ఉత్తరాంధ్ర తీరం అల్లకల్లోలంగా మారింది. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ నెల 1వ తేదీన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ ఏడుగురు మత్స్యకారులు ఒకే బోటుపై సముద్రంలోకి వేటకు వెళ్లారు. బంగాళాఖాతంలో వాతావరణం వేగంగా మారిపోవడం, అల్పపీడన తీవ్రత పెరగడంతో సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగింది. వాతావరణం అనుకూలించకపోవడాన్ని గమనించిన తీరంలోని వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే శనివారం ఉదయం వారిని మొబైల్ ఫోన్ల ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో మత్స్యకారులు స్పందిస్తూ, వాతావరణం బాలేదని, అందువల్ల శనివారం మధ్యాహ్నానికల్లా ఎలాగైనా సురక్షితంగా తీరానికి చేరుకుంటామని కుటుంబ సభ్యులకు చెప్పారు. కానీ వారు చెప్పిన సమయానికి తిరిగి రాలేదు. వారికి ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు. కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు. ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు, పక్కపక్క ప్రాంతాల వారు ఇద్దరు ఇలా ఒకేసారి సముద్రంలో చిక్కుకుపోవడంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న మత్స్యశాఖ అధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం, వారి బోటును గుర్తించడం కోసం కోస్ట్‌గార్డ్, స్థానిక నావికా దళాల సహాయంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. Missing Fishermen, Visakhapatnam Fishing Harbour, Bay of Bengal Low Pressure, North Andhra Fishermen,

Publish Date: Jul 5, 2026 7:13AM

political-news-img

ఇంగ్లాండ్ తో రెండో టి20.. టీమ్ ఇండియా ఓటమి.!

ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ టో టీమ్ ఇండియా పరాజయాన్ని మూటకట్టుకుంది. . హై-స్కోరింగ్ థ్రిల్లర్‌గా సాగిన ఈ పోరులో ఇంగ్లండ్ ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్, ఇండియా టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షార్పణమైన సంగతి తెలిసిందే. రెండో మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించి ఈ సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టుకు ఆరంభంలోనే టీమిండియా స్పీడ్‌స్టర్ అర్ష్‌దీప్ సింగ్ గట్టి షాకిచ్చాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ప్రమాదకర ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, కెప్టెన్ జోస్ బట్లర్ లను డకౌట్ గా పెవిలియన్ పంపాడు. కేవలం 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ తీవ్ర కష్టాల్లో పడిన వేళ, కెప్టెన్ హ్యారీ బ్రూక్ కేవలం 15 బంతుల్లోనే 39 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. బ్రూక్ అవుటైన తర్వాత యువ సంచలనం జాకబ్ బెథెల్ ఇన్నింగ్స్ బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. టామ్ బాంటన్ తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దిన బెథెల్, ఆ తర్వాత టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మైదానం నలుమూలలా సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిపోతూ కేవలం 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బెథెల్ పవర్ హిట్టింగ్ ధాటికి ఇంగ్లండ్ మరో ఓవర్ మిగిలి ఉండగానే, అంటే 19 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి 191 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టినప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు. అనంతరం వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 37 పరుగులతో బాధ్యతాయుతంగా రాణించాడు. ఇక ఆఖర్లో యువ ఆటగాడు తిలక్ వర్మ కేవలం 11 బంతుల్లోనే 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో భారత్ భారీ స్కోరు సాధించగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో శామ్ కరన్ 3 వికెట్లతో రాణించాడు. ఇంతటి భారీ స్కోరు చేసినప్పటికీ బౌలింగ్ వైఫల్యం, ముఖ్యంగా జాకబ్ బెథెల్ వీరోచిత ఇన్నింగ్స్ కారణంగా భారత్‌కు ఓటమి తప్పలేదు. ఇరు జట్ల మధ్య సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి మూడో టీ20 మ్యాచ్ జులై 7న జరగనుంది. ఇక పోతే.. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల 99 రోజుల వయసులో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. దీంతో సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 205 రోజులు పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. తన తొలి మ్యాచ్‌లోనే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ తల మీదుగా కొట్టిన అద్భుతమైన సిక్సర్‌తో సహా 10 బంతుల్లో 14 పరుగులు చేసి స్టంపౌట్ అయ్యాడు. Jacob Bethell power hitting, Ind vs Eng, Vaibhav Suryavamshi, Entry

Publish Date: Jul 5, 2026 7:05AM

MOVIE NEWS