గత రెండు రోజులుగా కేఏ పాల్ తెలంగాణలో చేస్తున్న హల్ చల్ కు మీడియాలో ఎనలేని ప్రాధాన్యం కనిపిస్తున్నది. దీని వెనుక కేసీఆర్ స్కెచ్ ఉన్నదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అసలు కేఏ పాల్ కు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఆయన ఏం మాట్లాడినా సీరియస్ గా తీసుకునే వారెవరూ లేరు. గత ఎన్నికల ముందు కూడా ఆయన చేసిన హడావుడి సీరియస్ నెస్ లేని రాజకీయ కామెడీగానే మిగిలిపోయింది. అయితే గత రెండు రోజులుగా మాత్రం పాల్ చుట్టూ మీడియా తిరగడం.. ప్రాధాన్యత ఇవ్వడం అనుమానాలకు తావిస్తున్నది. ఆయనపై దాడి జరగడమేమిటి? ఆ దాడిపై డీజీపీకి ఫిర్యాదు చేయడానికి బయలు దేరిన ఆయనను హౌస్ అరెస్టు చేయడమేమిటి అన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి.
\ఈ సంఘటనలకు కొద్ది రోజుల ముందు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అసందర్భంగా కేఏ పాల్ ప్రస్తావన తీసుకువచ్చారు. ఒకింత వ్యంగ్యంగా మాట్లాడుతున్నట్లుగా రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం కేఏ పాల్ అని చెప్పుకొచ్చారు. అప్పట్లో కేటీఆర్ మాటలను అంతా జోక్ గానే తీసుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లను పలుచన చేసే ఉద్దేశంతో చెప్పిన మాటలుగా పరిగణించారు. కానీ ఈ రోజు రాష్ట్రంలో కేఏపాల్ కు ఆయన హడావుడికి తెరాస ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే...మొత్తం కేసీఆర్ స్కెచ్ ప్రకారమే జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు బలం తగ్గిందని ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ కేసీఆర్ కు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఓటమి గండం నుంచి బయటపడడానికి కేసీఆర్ వేసిన స్కెచ్ లో బాగంగానే కేఏ పాల్ ఎంట్రీ అంటున్నారు. వచ్చే ఎన్నికలలో రాష్ర్టంలో త్రిముఖ పోరు అనివార్యమన్న పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అంతే కాకుండా బీజేపీ, కాంగ్రెస్ పుంజుకుంటున్నాయి. వాటిని నిలువరించకుంటే మూడో సారి అధికారంలోకి రావాలన్న కేసీఆర్ కల సాకారం అవ్వడం కష్టసాధ్యమని పీకే నివేదిక స్పష్టం చేసింది. దీంతో కేసీఆర్ కేఏపాల్ ను రంగంలోనికి దింపారని చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరంగల్ లో రాహుల్ గాంధీతో రైతు సంఘర్షణ సభ సన్నాహాలలో కాంగ్రెస్ రాష్ట్రంలో పట్టు సాధించేందుకు బలోపేతమయ్యేందుకు సన్నాహాలలో నిమగ్నమయ్యాయి.
ఏలాగైనా అధికారం నిలుపుకోవాలనే లక్ష్యంతో కేసీఆర్ కేఏ పాల్ తమకు రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అని కేటీఆర్ తో చెప్పించి ఆయన ఎంట్రీకి తలుపులు తెరిచారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి కేసీఆర్, కేటీఆర్ లు ప్రస్తావించేంత స్థాయి కేఏ పాల్ కు గానీ, ఆయన పార్టీకి కానీ లేదు. కేఏ పాల్ పై దాడి, హౌస్ అరెస్టు వంటి ఘటనల ద్వారా ఆయనకు లేని ప్రాధాన్యాన్నికల్పించి రాష్ట్రంలో రాజకీయ కన్ఫ్యూజన్ తీసుకువచ్చి లబ్ధి పొందాలన్నదే కేసీఆర్ స్కెచ్ లా కనిపిస్తున్నదని పరిశీలకులు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/un-necessary-importance-to-ka-paul-kcr-scketch-25-135425.html
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.