‘సంఖ్య’ ఫై పార్టీలే తెల్చుకోవాలన్న షిండే
Publish Date:Dec 10, 2012
Advertisement
మరలా తెలంగాణా విషయం మొదటికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయంఫై ఈ నెల 28 న ఢిల్లీ లో అఖిల పక్ష సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సమావేశానికి రాజకీయ పార్టీలు తమ తరపున వాదన వినిపించడానికి ఒక్కరిని పంపించాలా లేక ఇద్దరినా అనే విషయంలో ఇంకా స్పష్టంగా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఈ విషయంపై కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే నేడు ఓ ప్రకటన చేస్తూ, ఎంత మందిని పంపాలనే విషయంలో పార్టీలే ఓ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అంటే, బంతిని పార్టీల కోర్టులోకి నేట్టేసినట్లే. గతంలో హోం మంత్రిగా ఉన్న చిదంబరం ఇలా ఇద్దరేసి నేతలను పిలవడంతో ప్రతి పార్టీ భిన్న వైఖరులను వినిపించింది. దీనితో కేంద్రం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. అంటే, ఈ సమావేశం కూడా ఎలాంటి లాభం లేకుండా పూర్తవుతుందా అనే బలమైన సందేహాలు సగటు ప్రజానీకంలో కలుగుతున్నాయి. ప్రత్యేక తెలంగాణా విషయంలో ఇదే చివరి సమావేశం అవుతుందా అనే ప్రశ్నకు, సమస్య పరిష్కారం అయ్యే వరకూ సంప్రదింపులు కొనసాగాలి కదా అని అన్నారు. ఇద్దరేసి నేతలని పంపితే, ఒక్కొక్కరూ ఒక్కో వాదనను వినిపిస్తారు. అంటే, ఈ సమావేశం కూడా వృధా ప్రయత్నమేనన్న మాట. తెలుగు దేశం తరపున ఒక్కరే హాజరవుతారని ఆ పార్టీ నేత నామా నాగేశ్వర రావు చెప్పారు. ఇదే వైఖరి అన్ని పార్టీలు అనుసరిస్తే సమస్య ఉండదు. లేదంటే,ఈ అంశం మరలా మొదటికి వచ్చినట్లే.
http://www.teluguone.com/news/content/susheel-kumar-shinde-23-19654.html
58 సంవత్సరాల వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్
పెంపుడు కుక్క యజమానిని కాల్చింది అంటే ఏదో ఫన్ని వీడియో అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే ఫన్ని వీడియోలలో ఎక్కువగా అలాంటి సన్నివేశాలు చూసి నవ్వుకుంటాం. నిజజీవితంలో కూడా ఇలాంటి సంఘటన జరిగిందని తెలిసి ఆశ్చర్యపడుతున్నారు.
ఢిల్లీ లో గత నెల 16 వ తేదీన జరిగిన పారా మెడికల్ స్టూడెంట్ ఫై జరిగిన అత్యాచారంలో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.
ఓ హత్య కేసులో నిందితునిగా ఉన్న గుంటూరు జిల్లా గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు బెయిల్ ప్రయత్నాలకు పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గండి కొట్టారు. కాంగ్రెస్ నాయకుడు ఉన్నం నరేంద్ర హత్య కేసులో యరపతినేని మూడవ నిందితునిగా ఉన్న విషయం తెలిసిందే.
గత నెల 28 న ఢిల్లీ లో తెలంగాణాఫై జరిగిన అఖిల పక్ష సమావేశంలో తెలంగాణా అనుకూల వైఖరి తీసుకొని ఆ ప్రాంతంలో ఎలాగో గట్టేక్కామని తెలుగు దేశం పార్టీ భావిస్తున్న సమయంలో ఆ పార్టీకి చెందిన ఆంధ్రా ప్రాంత నేతల నుండి పార్టీకి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇంతవరకు చంద్రబాబు ‘రెండుకళ్ళ’ సిద్దాంతంతో తెలంగాణా ప్రజలను మోసంచేస్తున్నాడని నిందించిన తెరాస, మొన్నజరిగిన అఖిలపక్షసమావేశంలో తెలుగుదేశంపార్టీ తెలంగాణాకి అనుకూల వైఖరిని ప్రకటించిన తరువాత, ఆపార్టీని మెచ్చుకోలేక, వ్యతిరేకించనూ లేక తెరాస ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోంది.
అసలే పోర్న్ స్టార్..ఇక జిస్మ్ల్ చిత్రంలో తన అందాలతో యువతను మత్తెక్కించి చిత్తుచేసింది. అలాంటి పోర్న్ స్టార్ డిసెంబరు 31న ఓ వేదిక మీద డాన్స్ చేయాలంటే మాటలా. తన ఫాలోయింగ్ ను బట్టి తను కూడా ఉంటుంది. అందం ఉన్నప్పుడు చూపిస్తేనే ఎవరయినా చూస్తారు.
అమెరికాకు చెందిన యువతి ఒలీవియా కల్ఫో మిస్ యూనివర్స్-2012గా ఎంపికయ్యారు. ఫిలిప్పిన్స్, వెనిజులాకు చెందిన యువతులు మిస్ యూనివర్స్ పోటీల్లో రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. భారత్కు చెందిన అందాల సుందరి శిల్పాసింగ్ టాప్-16వరకు వచ్చి నిలిచిపోయారు.
ఈ నెల 28 న ఢిల్లీ లో జరిగే అఖిల పక్ష సమావేశంలో తెలంగాణా కు వ్యతిరేకంగా మాట్లాడితే, తెలుగు దేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణా లో చేస్తున్న పాదయాత్రలు కాస్తా పరుగు యాత్రలుగా మారతాయని తెలంగాణా రాష్ట్ర సమితి ఎంఎల్ఎ కే. తారక రామా రావు హెచ్చరించారు.
అగ్రరాజ్యం అమెరికాలో ఉన్మాదుల కాల్పుల పర్వం కొనసాగుతూనే ఉంది. అమాయకుల ప్రాణాలకు అక్కడ విలువ లేదని వరుస సంఘటనలు రుజువు చేస్తున్నాయి.
మాజీ ఎం ఎల్ సి కాసాని జ్ఞానేశ్వర్ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు.
ఇబ్రహీంపట్నంలో ఓ యువకుడు తనను ప్రేమించడం లేదని ఓ విద్యార్ధిని గొంతు కోసి చంపేశాడు. ఇబ్రహీంపట్నం కు చెందిన బాలరాజ్, భాగ్యలతల మొదటి కుమార్తె నిఖిత బికాం చదువుతూ, సిఏ కోచింగ్ తీసుకొంటోంది. బుధవారం సాయంత్రం రాఘవేందర్ ఆమె ఇంట్లోకి వచ్చి గొంతు కోసి చంపాడు.
నా తండ్రి విగ్రహాన్ని పార్లమెంటులో పెట్టి ఒక్కదాన్నే క్రెడిట్ కొట్టేయాలన్న ఆలోచన నాకు లేదు. నా తమ్ముడు బాలకృష్ణ అన్న మాటలు నాకు చాలా బాధకలిగించాయి. ఎన్టీఆర్ విగ్రహం అందరం కలిసి ఇద్దామని నా ఇంటికి వచ్చింది నిజమే. అయితే కుటుంబ సభ్యులు రాసిన లేఖ మీద సంతకం చేయాలని నన్ను అడగలేదు.





