Top Stories

political-news-img

అంతర్జాతీయ ఉద్రిక్తతల వేళ ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష..!

ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పెరుగుతున్న సమర వాతావరణం నేపథ్యంలో భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన రక్షణ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) ఉన్నత స్థాయిలో సమావేశమై ప్రాధాన్యత ఉన్న పలు అంశాలపై విస్తృతంగా చర్చించింది. అమెరికా, ఇరాన్ దేశాల నడుమ ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర రూపం దాలుస్తుండటంతో ఈ సమావేశానికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది. ప్రస్తుతం కొనసాగుతున్న అంతర్జాతీయ ఘర్షణలు భారత భద్రతా వ్యవస్థపై ఏ విధమైన ప్రభావం చూపుతాయనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. దేశానికి ఎదురయ్యే సరుకు రవాణా ఆటంకాలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రధాని మోదీ సూచనలు చేశారు. ముఖ్యంగా చమురు దిగుమతులకు కీలకమైన హర్మూజ్ జలసంధి ప్రాంతంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోవాలని సీసీఎస్ నిర్ణయించింది. నల్ల సముద్రం, ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ వంటి మార్గాలను సద్వినియోగం చేసుకోవడంపై నిపుణులు నివేదికలు అందించారు. పెట్రోలియం, సహజ వాయువు, ఎరువులు వంటి నిత్యావసరాల దిగుమతిలో ఎటువంటి అవాంతరాలు ఎదురుకాకుండా నిరంతర సరఫరా కొనసాగించేందుకు శాఖల వారీగా చర్యలు చేపట్టనున్నారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలో స్పష్టం చేశారు. అలాగే అంతర్జాతీయ సముద్ర జలాల్లో ప్రయాణించే దేశీయ నావికులు, వాణిజ్య నౌకల సంరక్షణకు అవసరమైన రక్షణ చర్యలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ అత్యున్నత భేటీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతో పాటు పలువురు కీలక మంత్రులు పాల్గొన్నారు. ప్రపంచ మార్కెట్లలో ధరల హెచ్చుతగ్గుల వల్ల దేశీయంగా ద్రవ్యోల్బణం పెరగకుండా ముందస్తు ఆర్థిక వ్యూహాలను రూపొందించడంపై మంత్రులు చర్చించారు. అంతర్జాతీయ సంక్షోభ సమయాల్లో ఇంధన లభ్యత తగ్గకుండా చూడటం, నిత్యావసరాల కొరత రాకుండా చూడటంపై కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ప్రజా బాహుళ్యంలో నమ్మకాన్ని పెంచుతాయని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలు పని చేయనున్నాయి. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. PM Modi CCS Meeting, Global Security Situation, Supply Chain Constraints, Iran USA Tensions, India Fuel Security

Publish Date: Jul 30, 2026 9:37PM

political-news-img

7,437 కాదు.. 19 వేల పోస్టులతో కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వాలి..!

అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా..! ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు మరోసారి తమ గళాన్ని వినిపిం చారు. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్, చిక్కడపల్లి లైబ్రరీల వద్ద నిరుద్యోగులు మెరుపు ధర్నాకు దిగారు. భారీ వర్షం కురుస్తున్నప్ప టికీ లెక్కచేయకుండా ఆందోళనను కొనసాగిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రస్తుతం ప్రతిపాదించిన 7,437 కానిస్టేబుల్ పోస్టులతో సరిపెట్టకుండా రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి మొత్తం 19 వేల పోస్టులతో కొత్త కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వేలాది మంది అభ్యర్థులు కొంతకాలంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని, పోస్టుల సంఖ్య తక్కువగా ఉండటంతో అనేక మంది నిరుద్యోగు లకు అవకాశం దక్కే పరిస్థితి లేదని ఆందోళ నకారులు పేర్కొన్నారు. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ లెక్కలోకి తీసుకుని 19 వేల పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ సిబ్బంది అవసరం ఉన్న నేపథ్యంలో ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయోపరిమితిని సడలిం చాలని నిరుద్యోగులు కోరారు. గత కొన్నేళ్లుగా నోటిఫికేషన్లు సకాలంలో విడుదల కాకపోవడంతో అనేక మంది అభ్యర్థులు వయోపరిమితి దాటి పోయే పరిస్థితికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రత్యేకంగా వయోపరిమితి సడలింపు ప్రకటించి, ఉద్యోగాల కోసం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కేవలం పోలీస్ ఉద్యోగాలకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యో గులు స్పష్టం చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. అలాగే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి, వాటికి సంబంధించిన నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అశోక్‌నగర్, చిక్కడపల్లి ప్రాంతాల్లోని లైబ్రరీలు ఎంతోకాలంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. ప్రతిరోజూ వందలాది మంది అభ్యర్థులు ఇక్కడ చదువుకుంటూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా నిరుద్యోగులు రోడ్డుపైకి వచ్చి ధర్నా నిర్వహిం చారు. వర్షం కారణంగా ఇబ్బందులు ఎదురైనా ఆందోళన నుంచి వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను సీరియస్‌గా తీసుకుని ఖాళీగా ఉన్న అన్ని పోస్టులపై సమగ్రంగా లెక్కలు సేకరించాలని వారు కోరారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. 7,437 కానిస్టేబుల్ పోస్టులతో కాకుండా 19 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు ఎస్సై, కానిస్టేబుల్ వయోపరిమితి సడలింపు, మెగా డీఎస్సీ, గ్రూప్-1, 2, 3, 4 తదితర ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసే వరకు తమ ఆందోళ నలను కొనసాగిస్తామని నిరుద్యోగులు స్పష్టం చేశారు. Unemployed people protest in Ashoknagar, Constable Notification, Ashoknagar, Chikkadapalli, CM Revanth reddy, TGPSC

Publish Date: Jul 30, 2026 9:16PM

political-news-img

అప్పలరాజును కలిసే ఉద్దేశం జగన్‌కు లేదు..కేవలం బలప్రదర్శన కోసమే : అనిత

ములాఖాత్‌కు 2 నుంచి 3 గంటల మధ్య సమయం కేటాయించాం..! వైసీపీ అధినేత జగన్ వైఖరిపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీకాకుళంలో విధుల్లో ఉన్న మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ పట్ల ఆ పార్టీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. బాధ్యతాయుతమైన ప్రతి ఒక్కరూ ఈ తరహా దుశ్చర్యలను ముక్తకంఠంతో ఖండించాలని ఆమె పిలుపునిచ్చారు. ఇటీవల వైసీపీ నేత సీదీరి అప్పలరాజుతో ములాఖత్ పేరుతో జగన్ రాజకీయ నాటకాలడుతున్నారని హోంమంత్రి మండిపడ్డారు. జైలు నిబంధనల ప్రకారం ములాఖత్ కోసం అధికారులు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య సమయాన్ని కేటాయించారని చెప్పారు. అయితే ఆ నిబంధనలను బేఖాతరు చేస్తూ సాయంత్రం 5 గంటల తర్వాత అక్కడకు వెళ్లడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటని ఆమె నిలదీశారు. అప్పలరాజును పరామర్శించాలనే ఆలోచన గానీ, ఆయనను కలవాలనే తపన గానీ జగన్‌కు ఎంతమాత్రం లేదని హోంమంత్రి స్పష్టం చేశారు. కేవలం సమయపాలన పాటించకుండా ఆలస్యంగా వెళ్లడం ద్వారా ప్రభుత్వంపై నిందలు వేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ములాఖత్‌ను ఒక నెపంగా వాడుకుని రోడ్లపై శ్రేణులతో బలప్రదర్శన చేయడమే ఆయన ఏకైక లక్ష్యమని విమర్శించారు. శ్రీకాకుళం పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు కనీస క్రమశిక్షణ లేకుండా వ్యవహరించాయని అనిత ధ్వజమెత్తారు. విధుల్లో నిమగ్నమై ఉన్న మహిళా పోలీసు అధికారిణి పట్ల ఆ పార్టీ నేతలు ప్రవర్తించిన తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందన్నారు. మహిళల పట్ల ఇప్పటికీ పాతకాలపు వైఖరినే కొనసాగించడం వైసీపీ నాయకత్వ ధోరణికి అద్దం పడుతోందని తీవ్రంగా మండిపడ్డారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్సైని అవమానించిన తమ పార్టీ నాయకుల చర్యలకు జగన్ తక్షణమే బాధ్యత వహించాలని అనిత డిమాండ్ చేశారు. బాధితురాలైన పోలీసు అధికారిణితో పాటు మొత్తం మహిళా లోకానికి ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పరిహాసం చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, కానీ వైసీపీ నాయకులు మాత్రం శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని కూటమి వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలోనూ మహిళా అధికారుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారని, ప్రతిపక్షంలోకి వచ్చినా ఆ తీరు మారలేదని అధికార పక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. శ్రీకాకుళం ఘటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, మహిళా ఎస్సై పట్ల మర్యాదలేకుండా ప్రవర్తించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. రాజకీయ పర్యటనల పేరిట శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం ఏపీ రాజకీయంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. Home Minister Vangalapudi Anitha, YS Jagan Srikakulam Tour, AP Politics, Srikakulam YSRCP, womens SI parade, YS Jagans visit, Chintada Ravikumar, AP police security, SI Paravallik, Seediri Appalaraju

Publish Date: Jul 30, 2026 9:06PM

political-news-img

బీజేపీకి కాక్రోచ్ టెన్షన్.. కాషాయ పార్టీకి ఇక కష్టాలేనా..!

ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు దేశ రాజధానిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. ఇన్నాళ్లూ నిశ్శబ్దంగా ఉన్న గొంతుకలు ఒక్కసారిగా గర్జించడంతో కేంద్ర పాలకులు సైతం భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం ఒక నిరసన మాత్రమే కాదు... ఏళ్ల తరబడి అనుభవిస్తున్న నైరాశ్యం, ఉపాధి లేమి, విద్యా వ్యవస్థలోని లోపాలు, ప్రజాస్వామ్య హక్కుల కాలరాచివేతపై సామాన్యుడు విసిరిన సమరభేరి. ఈ అంశాలపై టోన్ న్యూస్ వాస్తవ వేదిక కార్యక్రమంలో తెలుగువన్‌ మేనేజింగ్ డైరెక్టర్ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకులు డోలేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో విశ్లేషణాత్మకంగా చర్చ నిర్వహించారు. అధికార గర్వాన్ని ఎదిరించిన సామాన్యుడి ఆక్రోశం..! దేశంలో గత కొన్ని ఏళ్లుగా ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఒకరి చేతుల్లో బందీ అయిపోయాయన్న ఆవేదన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఏళ్ల తరబడి కష్టపడి చదివినా ఉద్యోగాలు రాక, రోజువారీ బతుకుదెరువు కోసం గిగ్ వర్కర్లుగా మారుతున్న యువత కడుపు మంట ఈ ఉద్యమానికి ఇంధనంగా మారింది. ఏటా ఫలితాల్లో అక్రమాలు, నిరుద్యోగం, మరోవైపు కార్పొరేట్ల లబ్ధి కోసం అమలవుతున్న విధానాలు సామాన్య కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. తమ భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతోందని గ్రహించిన యువత, ఇళ్లలోని నిశ్శబ్దాన్ని వీడి వీధుల్లోకి వచ్చింది. రక్తమోడిన వీధులు... గుండె బలంతో నిలబడిన యువత..! ఢిల్లీ వీధుల్లో కనిపించిన దృశ్యాలు ప్రతీ భారతీయుడి హృదయాన్ని ద్రవీంపజేసాయి. లాఠీలు దెబ్బ తింటున్నా, రక్షక భటులే రక్షకులు కాక భయానక వాతావరణం సృష్టిస్తున్నా యువకులు వెనక్కి తగ్గలేదు. "మమ్మల్ని కాల్చండి... కానీ మా భవిష్యత్తును కాపాడండి" అంటూ నినదిస్తూ పోలీసుల ముందే నిలబడిన దృశ్యాలు స్వాతంత్ర్య పోరాట సమయాలను గుర్తుచేశాయి. ఒక సాధారణ అమ్మాయి రక్షణ వాహనానికి అడ్డంగా నిలబడి తన నిరసనను వ్యక్తం చేయడం, తమ హక్కుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడిన సామాన్యుల తెగువకు అద్దం పడుతోంది. 16 మెట్రో స్టేషన్లను మూసివేసి, ఇంటర్నెట్‌ను నిలిపివేసి ఉద్యమాన్ని అణచివేయాలని చూసినా, గుండెల్లో రగులుతున్న కడుపు మంట ముందు ఏ ఆంక్షలూ నిలవలేకపోయాయి. ప్రజాస్వామ్యంలో కొత్త ఆశల చిగురు..! ఈ సుదీర్ఘ పోరాటం వెనుక ఏ రాజకీయ పార్టీ ప్రయోజనాలూ లేవు, ఏ నాయకుడి స్వార్థమూ లేదు. ఇది స్వచ్ఛందంగా, ఆవేదనలోంచి ఉద్భవించిన ఒక అగ్నిపర్వతం. ఎండనక, వాననక వీధుల్లో రాత్రంతా గడిపిన ప్రతీ యువకుడి వెనుక ఒక పేద కుటుంబం ఆశలు ఉన్నాయి. "మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో" అని రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా తల్లడిల్లిన తల్లిదండ్రుల కన్నీళ్లు ఉన్నాయి. రాజ్యాంగ వ్యవస్థలన్నీ మౌనం వహించిన చోట, ఈ యువ శక్తి చూపించిన సాహసమే ఈనాడు పాలకవర్గాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ ఉద్యమం మనకు నేర్పిన పాఠం ఒకటే... ఎంతటి బలమైన అధికారమైనా ప్రజల ఆక్రోశం ముందు తలవంచక తప్పదు. ఇలాంటి అంశాలపై పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి. Vasthava Vedika, Kanthamneni Ravi Shankar, Dolendra Prasad, Cockroach party, Gig Workers Strike Delhi, BJP

Publish Date: Jul 30, 2026 8:32PM

political-news-img

వందేమాతరం బిల్లుకు పార్లమెంటు ఆమోదం..అవమానిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష..!

భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కోట్లాది మంది భారతీయుల్లో దేశభక్తి రగిలించిన అమర గేయం, మన జాతీయ గేయమైన 'వందేమాతరం' గౌరవార్థం భారత పార్లమెంట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై జాతీయ గేయం వందేమాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించినా, లేదా దానిని ఆలపిస్తున్నప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర అంతరాయం కలిగించినా అది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. ఈ తరహా నేరాలకు పాల్పడేవారికి గరిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా, లేదా రెండూ విధించేలా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త చట్టసవరణ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. జాతీయ గీతమైన 'జనగణమన', జాతీయ పతాకం, అలాగే భారత రాజ్యాంగానికి లభిస్తున్న చట్టబద్ధమైన గౌరవం, రక్షణలను ఇకపై 'వందేమాతరం' గేయానికి కూడా సమానంగా వర్తింపజేయనున్నారు.భారత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యనాథ్ రాయ్ జూలై 24, 2026న 'జాతీయ గౌరవానికి భంగం కలిగించే చర్యల నిరోధక (సవరణ) బిల్లు - 2026' ను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే అమలులో ఉన్న 1971 నాటి చట్టానికి ఈ సవరణను జోడించారు. ప్రతిపక్షాల ఆందోళనలు, వాకౌట్ల మధ్య రాజ్యసభ జూలై 29న ఈ బిల్లును ఆమోదించగా, జూలై 30న లోక్‌సభ సైతం వాయిస్ ఓట్ ద్వారా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన ఈ ప్రతిపాదిత బిల్లు త్వరలోనే గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర పడిన అనంతరం అధికారిక చట్టంగా దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ప్రస్తుతం అమలులో ఉన్న 1971 నాటి ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ ప్రకారం కేవలం జాతీయ పతాకం, రాజ్యాంగం మరియు జాతీయ గీతం (జనగణమన)లకు మాత్రమే చట్టబద్ధ రక్షణ అందుతోంది. అయితే వందేమాతరం గేయం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఈ కీలక చట్టసవరణను తీసుకువచ్చింది. బంకిం చంద్ర ఛటోపాధ్యాయ 1875వ సంవత్సరంలో రచించిన ఈ గేయం, 1882లో ఆయన రాసిన ప్రసిద్ధ 'ఆనంద్ మఠ్' నవల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళింది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో కోట్లాది మంది త్యాగధనులకు ఇది ప్రధాన స్ఫూర్తిగా నిలిచింది. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన శుభవేళ, ఉదయం 6:30 గంటలకు ఆల్ ఇండియా రేడియోలో పండిట్ ఓంకార్‌నాథ్ ఠాకూర్ చేత సంపూర్ణ వందేమాతరం గేయాన్ని ఆలపింపజేయాలని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్వయంగా ఆదేశించారు.ఈ కొత్త చట్టసవరణ ప్రకారం, దేశవ్యాప్తంగా ప్రభుత్వ లేదా అధికారిక కార్యక్రమాలలో వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో ఎవరైనా కావాలని దానికి అడ్డంకులు సృష్టించినా, గేయ రికార్డింగ్‌ను ఆపివేసినా లేదా భంగం కలిగించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. 1971 చట్టంలోని సెక్షన్లను సవరిస్తూ తీసుకొచ్చిన ఈ నిబంధనల ప్రకారం నేరస్థులకు గరిష్టంగా 3 ఏళ్ల వరకు కఠిన జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మన దేశ సంస్కృతి, సార్వభౌమాధికారం మరియు పోరాట వారసత్వానికి ప్రతీకగా నిలిచే ఈ జాతీయ గేయానికి అత్యున్నత చట్టబద్ధ గౌరవాన్ని కల్పించడమే ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. Vande Mataram Bill 2026, Prevention of Insults to National Honour Amendment Bill, National Song legal protection, Parliament passes Vande Mataram Bill, 3 years imprisonment for insult, Indian Parliament latest news

Publish Date: Jul 30, 2026 8:10PM

political-news-img

భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలి : మంత్రి పొంగులేటి

ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం, చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గురువారం రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, రాబోయే రెండు రోజుల్లో వర్షాల పరిస్థితిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, క్షేత్రస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం అందుబాటులో ఉండాలని సూచించారు. వాగులు, వంకలు, చెరువులు, జలాశయాల వద్ద ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైతే వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్, నీటిపారుదల, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడిన వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రవాణా, విద్యుత్, తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజల సాధారణ జీవనానికి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం వరకు రాష్ట్రంలో 30 శాతం మేర ఉన్న వర్షపాతం లోటు, గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గణనీయంగా తగ్గి దాదాపు సాధారణ స్థాయికి చేరుకుందని మంత్రి తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం జూలై 30, 31 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. Telangana rains, Hyderabad Meteorological Center, Red Alert, Adilabad rains, Severe Cyclone, Telangana Rains, Telangana Weather Update, IMD, Minister Ponguleti Srinivasa Reddy

Publish Date: Jul 30, 2026 7:34PM

MOVIE NEWS