political-news-img

కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?

తెలంగాణ అధికార కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది అంటే చెప్పలేకపోయినా.. ఏదో జరుగుతోందని మాత్రం అందరికీ అర్ధమౌతోంది. రాష్ట్ర పార్టీలోఅంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా నేతలు గళమెత్తుతున్నారు. విమర్శల స్థాయి, ఆరోపణల తీరు ఒకింత తీవ్రంగానే ఉన్నాయి. స్వయంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయా అంటూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యమంత్రి పదవి దక్కగానే రేవంత్‌కు అహంకారం పెరిగిందని, కళ్ళు నెత్తికెక్కాయా అంటూ ఆమె ఘాటుగా విమర్శించడం, అలాగే సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి సైతం రేవంత్ వనపర్తి టికెట్ తనకు ఇవ్వకుండా అమ్ముకున్నారు అని వ్యాఖ్యానించడం చూస్తుంటే.. పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తి రగులుతోందనడానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ విషయంలో.. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన సీనియర్ జర్నలిస్టు వీవీ రావు మాట్లాడారు. సుస్మిత పటేల్ కంటే ముందు పార్టీ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు కూడా రేవంత్ ప్రభుత్వ పనితీరు, హామీల అమలుపై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్నిగుర్తు చేశారు. తమ నియోజకవర్గాల్లో పనులు కావడం లేదని, మంత్రులు, సలహాదారులు తమను కనీసం లెక్కచేయడం లేదని వారు బాహాటంగా చేసిన వ్యాఖ్యలు విమర్శలు రేవంత్ పై అసంతృప్తి పెచ్చరిల్లుతోందనడానికి నిదర్శనమన్నారు. చిన్నారెడ్డి అయితే.. తనకు వనపర్తి టికెట్ ఇవ్వమని సోనియా గాంధీ స్వయంగా చెప్పినా రేవంత్ ఆ టికెట్ తనకు ఇవ్వకుండా అమ్ముకున్నారని విమర్శించిన విషయాన్నీ, అలాగే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా రేవంత్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. కాంగ్రెస్‌లో పాత నేతలు వర్సెస్ వలస నేతల మధ్య సాగుతున్న ఈ సమరం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ అయితే పార్టీలో ఉందని వీవీరావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన తర్వాత ఈ అంతర్గత తిరుగుబాటుపై ఎలా స్పందింస్తారు? ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉందన్నారు. ఇక కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్ తీరు పట్లా, ఆయనపై రాష్ట్ర నేతల్లో వ్యక్తం అవుతున్న అసంతృప్తి పట్లా స్పందించకుండా మౌనంగా ఉండటం చూస్తుంటే.. ముందస్తు ఎన్నికల అంశాన్నీ కొట్టిపారేయలేని పరిస్థితి ఉందని వీవీరావు అన్నారు. Konda Sushmitha Comments, Revanth Reddy Konda Sushmitha, Telangana Congress Politics, Pocharam, Chinnareddy

Publish Date: Aug 20, 2026 4:26PM

political-news-img

ఎమ్మెల్సీ రేసులో దేవినేని ఉమా, వంగవీటి రాధా.!

ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో దశాబ్దాలుగా తమదైన శైలిలో ప్రభావం చూపిన ఇద్దరు నేతలు ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తు పై ఆందోళనలో ఉన్నారు. వై సీపీకి చెందిన ఎమ్మెల్సీలు పండుల రవీంద్రబాబు, జకియా ఖానంల పదవీ కాలం త్వరలో ముగియనుండటంతో ఖాళీ అయ్యే రెండు స్థానాలూ తెలుగుదేశం కూటమి కైవశం చేసుకోవడం ఖాయం. ఈ క్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణలు రేసులో నిలిచారు. ఆ ఇద్దరూ కూడా ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయ సమీకరణాలను శాసించిన దేవినేని, వంగవీటి కుటుంబాల వారసులు ఇప్పుడు పదవుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితిలో ఉన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమాకు కూటమి సర్దుబాట్లలో భాగంగ 2024 ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కలేదు. పార్టీ క్లిష్ట సమయాల్లో ముందుండి పోరాడిన దేవినేని ఉమాకు ఈ సారి ఎమ్మెల్సీ ఖాయమన్న భావన ఆయన అనుచరుల్లో బలంగా వ్యక్తమౌతోంది. మరోవైపు వంగవీటి రాధా పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఇటీవలి ఎన్నికల రాజకీయంలో ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం రాని ఆయనకు, ఈసారి ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందని ఆయన అనుచరులు ఆశిస్తున్నారు. అయితే త్వరలో ఖాళీకానున్న ఎమ్మెల్సీ స్థానాల భర్తీ విషయంలో తెలుగుదేశం అధిష్ఠానం సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమతుల్యత, కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు ఇవ్వాల్సిన ప్రాతినిధ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర రాజకీయాలలో ఉమా, రాధాలకు ఈ సారైనా ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం ఉందా అన్న ఉత్కంఠ నెలకొంది. Devineni Uma, Vangaveeti Radha, Krishna District Politics, MLC Seats, NDA Alliance

Publish Date: Aug 20, 2026 3:53PM

political-news-img

విద్యాహక్కు చట్టం.. భారీగా పెరిగిన అడ్మిషన్లు.. మండలిలో లోకేష్.!

విద్యాహక్కు చట్టం ఆర్టీఈ కింద ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాల సంఖ్య భారీగా పెరిగిందని విద్యాశాఖమంత్రి నారా లోకేష్ అన్నారు. శాసనమండలిలో ఆర్టీఈ కింద ఉచిత ప్రవేశాల అమలు తీరుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేశ్ సమాధానమిచ్చారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన చదువు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్న ఆయన ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తూ, నాణ్యమైన విద్యను పేద విద్యార్థులకు చేరువ చేయడంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో బలహీన వర్గాలు, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పాతిక శాతం సీట్లను తప్పనిసరిగా కేటాయించే ప్రక్రియను రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. గత కొన్నేళ్ల గణాంకాలను పరిశీలిస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగిందని వివరించారు. జగన్ హయాంలో 2022-23 విద్యా సంవత్సరంలో ఆర్టీఈ కింద కేవలం రెండు వేల పైచిలుకు మాత్రమే విద్యార్థుల నమోదు జరగగా, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన అనంతరం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన విద్యా సంవత్సరాల వారీగా అడ్మిషన్ల పురోగతిని సభ ముందుంచారు. 2024-25 విద్యా సంవత్సరంలో ఆర్టఈ కింద అడ్మిషన్లు 29 వేలు అన్నారు. ఆ తరువాత కూడా ఇదే వేగం కొనసాగిందని వెల్లడించారు. 2022 నుంచి ఇప్పటివరకు ప్రైవేట్ బడులలో సీట్లు పొందిన పేద విద్యార్థుల సంఖ్య లక్షా నాలుగు వేల 40 కు చేరుకుందని గణాంకాలతో వివరించారు. అడ్మిషన్ల కేటాయింపులో ఎలాంటి అక్రమాలకు, సిఫార్సులకు తావులేకుండా ఉండేందుకు ఆన్‌లైన్ ద్వారానే నమోదు, సీట్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు చెప్పిన ఆయన.. సాంకేతికతను వినియోగించుకోవడం వల్ల అర్హులైన ప్రతి పేద విద్యార్థికి పారదర్శకమైన పద్ధతిలో అడ్మిషన్ దక్కుతోందన్నారు. రాబోయే రోజుల్లో కూడా విద్యాహక్కు చట్టం నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేసి, పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి, వారి ప్రకాశవంతమైన భవిష్యత్తుకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని సభకు హామీ ఇచ్చారు. Nara Lokesh, RTE Admissions Andhra Pradesh, Education Minister Lokesh, Private School Free Admissions, AP Legislative Council News

Publish Date: Aug 20, 2026 2:56PM

political-news-img

బెంగాల్ రాజకీయాల్లో పట్టు చాటిన మమతా బెనర్జీ.!

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాభవం ఇసుమంతైనా తగ్గలేదనీ, ఎన్నికలలో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆమె ప్రజాదరణ చెక్కు చెదరకుండా నిలిచే ఉందనీ తేలింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ పరాజయం పాలైంది. ఆ ఎన్నికలలో మమతా బెనర్జీ స్వయంగా పరాజయం పాలయ్యారు. అయినా పొలిటికల్ గా ఆమె బలం, పట్టు అలాగే ఉన్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘనవిజయాన్ని సాధించడమే ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తు మరియు టీఎంసీ బలంపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో.. తాజాగా జరిగిన బార్ కౌన్సిల్ ఎన్నికల టీఎంసీ విజయం మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపిందనడంలో సందేహం లేదు. బార్ కౌన్సిల్ ఎన్నికల మొత్తం 23 స్థానాలకు గానూ తృణమూల్ కాంగ్రెస్ 15 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన ఆధిక్యాన్ని చాటింది. ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం మూడంటే మూడు స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. లెఫ్ట్ ఫ్రంట్ 3 స్థానాలు, కాంగ్రెస్ 2 స్థానాలను గెలుచుకున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత టీఎంసీ ప్రభ కోల్పోయిందన్న విమర్శలకు బార్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలు ఒక విధంగా చెక్ పెట్టాయని చెప్పాలి. Mamata Banerjee, TMC victory, West Bengal Bar Council, Bengal politics, Bar Council election results

Publish Date: Aug 20, 2026 12:16PM

political-news-img

తండ్రి ఎమ్మెల్సీ.. కుమారుడు ఎమ్మెల్యే.!

తెలుగుదేశం సీనియర్ నాయకుడు వర్ల రామయ్య బుధవారం (ఆగస్టు 19) ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఎమ్మెల్సీగా, ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా ఏక కాలంలో చట్టసభలలో ప్రతినిధులుగా ఉన్ననట్లైంది. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే పలు కుటుంబాలు రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆ జాబితాలోకి ఇప్పుడు వర్ల కుటుంబం చేరింది.వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజా పామర్రు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. వర్ల రామయ్య తెలుగుదేశంలో కీలకమైన నాయకుడిగా, విశ్లేషకుడిగా సేవలు అందిస్తున్నారు. గతంలో ఆయన ఎన్నికలలో పోటీ చేసినప్పటికీ, విజయాన్ని అందుకోలేకపోయారు. అయినా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా నిలబడి, పార్టీ సిద్ధాంతాలను గట్టిగా వినిపించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్య సేవలకు గుర్తింపుగా, పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధతకు ప్రతిఫలంగానూ అధిష్టానం ఆయనను ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసింది. ఈ నిర్ణయంతో ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి తగిన గౌరవం లభించిందని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు సభ్యులు ఏకకాలంలో చట్టసభలలో సభ్యులుగా ఉండటం ఇదే ప్రథమం కాదు కానీ, ఇది అరుదుగా జరిగే విషయం. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, నాగబాబు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, చింతకాయల విజయ్.. వంటి ఇలా తండ్రీ కొడుకులు ఒకే సమయంలో చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఇప్పుడు వర్ల రామయ్య, వర్ల కుమార్ రాజా వారి సరసన చేరారు. Varla Ramaiah MLC, Varla Kumar Raja Pamarru MLA, AP Politics, Father MLC Son MLA, Andhra Pradesh, TeluguOne

Publish Date: Aug 20, 2026 12:01PM

political-news-img

కాంగ్రెస్ సీనియర్ నేత జక్కడి ప్రభాకర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు.!

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై టీపీసీసీ క్రమశిక్షణ చర్య తీసుకుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. ఎల్బీ నగర్ లో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, క్షేత్రస్థాయిలో బలమైన అనుచరవర్గం ఉన్న సీనియర్ నేతపై సస్పెన్షన్ వేటు కాంగ్రెస్ లో కలకలం సృష్టించింది. ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలలో విభేదాలు, గ్రూపు తగాదాలు ఇందుకు కారణంగా చెబుతున్నారు. గత కొంత కాలంగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గ స్థాయిలో పార్టీ వ్యవహారాలు, నిర్ణయాల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఆ అసంతృప్తిని పలు సందర్భాలలో బాహాటంగానే వ్యక్త పరిచారు. అంతే కాకుండా పార్టీ నిర్ణయాలను గట్టిగా వ్యతిరేకిస్తూ, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదల నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. కాగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెన్షన్ తో ఎల్బీ నగర్ కాంగ్రెస్ లో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. ప్రభాకర్ రెడ్డి మద్దతుదారులు, అనుచరులు ఆయనపై సస్పెన్షన్ వేటుపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, మరికొందరు నాయకులు నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. Jakkidi Prabhakar Reddy, LB Nagar Congress, TPCC Suspension, Telangana Congress, TPCC Disciplinary Committee

Publish Date: Aug 20, 2026 10:27AM

MOVIE NEWS