political-news-img

కల్వకుంట్ల కవిత అరెస్ట్

మూసీ నదిని ఆక్రమించి భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్మాణం వద్ద ఉధృత వాతావరణం నెలకొంది..నార్సింగిలో మూసీ నదిని ఆక్రమిస్తూ నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలతో భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ వద్దకు వెళ్లిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అడ్డుకున్నారు. హైడ్రా బుల్డోజర్లు అక్కడికి వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని కవిత బైఠాయించారు. దీంతో పోలీసులు కవితతో పాటు పలువురు జాగృతి నాయకులను అరెస్టు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆమెను అరెస్ట్ చేసి పోలీసు వాహనాల్లో తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, జాగృతి కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పేదల ఇండ్లు కూల్చేసే అధికారులు, అక్రమ నిర్మాణాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఈ వెంచర్ మీకు కనిపించడం లేదా?” అంటూ జాగృతి నాయ కులు, కార్యకర్తలు, స్థానికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు.

Publish Date: Mar 3, 2026 8:12PM

political-news-img

విలాసాలకు అలవాటుపడి...చైన్ స్నాచర్‌గా మారిన టెకీ

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉంటూ విలాసాలకు అలవాటు పడి, దొంగతనాలను వృత్తిగా మార్చుకున్న ఒక మోస్ట్ వాంటెడ్ ‘హాబిచ్యువల్ అఫెండర్’ను అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి సుమారు రూ. 40 లక్షల విలువైన 250 గ్రాముల బంగారు ఆభరణాలు, 930 గ్రాముల వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, మీడియా సమావేశంలో వెల్లడించారు. అరెస్టయిన నిందితుడు మదనపల్లి మండలం, ఈశ్వరమ్మ కాలనీకి చెందిన కోరకూటి రాజేష్ (35). వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన రాజేష్, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో నేరాల బాట పట్టాడు. *మూడు ప్రధాన నేరాల్లో నిందితుడు రాజేష్ ప్రధానంగా మూడు ప్రధాన నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.. ఫిబ్రవరి 16న మదనపల్లి బీసెంట్ రోడ్డులోని ఒక ఇంట్లో చొరబడి భారీగా బంగారు, వెండి ఆభరణాలను అపహరించాడు. గత ఏడాది మార్చి 24న దేవాలయం వీధి సందులో ఒక ముసలి ఆమె వద్ద నుండి 30 గ్రాముల *బంగారు గొలుసును లాక్కెళ్ళాడు (చైన్ స్నాచింగ్) ఇదే ఏడాది ఫిబ్రవరి 6న మళ్ళీ దేవాలయం వీధిలోనే మరో వృద్ధురాలి మెడలోని 25 గ్రాముల బంగారు గొలుసును దొంగిలించాడని పోలీసులు వెల్లడించారు. నిందితున్ని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మదనపల్లి అడిషనల్ ఎస్పీ ఎం. వెంకటాద్రి పర్యవేక్షణలో, మదనపల్లి 1 టౌన్ సిఐ కె. రాజా రెడ్డి, సి.సి.ఎస్ ఇన్ స్పెక్టర్ ఎం. చంద్రశేఖర్, ఎస్.ఐ ఎస్.కె రహమతుల్లా, సి.సి.ఎస్ ఎస్.ఐ ఎం.కె నరసింహులు వారి బృందం మార్చి 3న ఉదయం 8:30 గంటలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ మూడు కేసులకు సంబంధించిన మొత్తం రికవరీని పూర్తి చేశారు. జిల్లా ఎస్పీహెచ్చరిక ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, "యువత చెడు అలవాట్లకు బానిసలై నేరాల బాట పట్టడం వల్ల వారి భవిష్యత్తు అంధకారమవుతుంది. చదువుల్లో రాణించి జీవితంలో పైకి రావాలి తప్ప, దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు" అని హెచ్చరించారు. అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, నగదు రివార్డులను అందజేశారు.

Publish Date: Mar 3, 2026 7:03PM

political-news-img

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కొత్త రక్షణ మంత్రి హతం

ఇరాన్ ప్రభుత్వంలోని కీలక నేతలను ఇజ్రాయెల్ వరుసగా హతం చేస్తుంది. ఐడీఎఫ్ దాడుల్లో ఇరాన్ రక్షణ కొత్త మంత్రి మజీద్ ఇబెన్ అల్-రెజా మరణించినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. మంత్రిగా నిన్ననే బాధ్యతలు స్వీకరించడం గమనార్హం..ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ రక్షణ మంత్రి అమీర్‌ నాసిర్‌జాదే మృతిచెందిన విషయం తెలిసిందే. అతడి స్థానంలో తాత్కాలిక రక్షణ మంత్రిగా మజీద్‌ను నియమించింది. రక్షణ మంత్రి బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే నూతన రక్షణ మంత్రి మృతిచెందడంతో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. సోమవారం బాధ్యతలు స్వీకరించిన మజీద్‌ ఇబెన్‌ అల్‌-రెజా మృతిచెందడంపై ఇరాన్ రక్షణ వర్గాల్లో కలకలం రేగుతోంది. దాడులు ఎక్కడ జరిగాయి? ఆయుధాలను ఉపయోగించారా అనే విషయాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మృతిని ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు.

Publish Date: Mar 3, 2026 6:44PM

political-news-img

హోలీ వేడుకల్లో విషాదం.. చెరువులో మునిగి ఇద్దరు యువకులు మృతి

హోలీ సందర్భంగా సురారంలో విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకూ ఆనందోత్సాహాలతో హోలీ వేడుకలు జరుపుకున్న ఇద్దరు యువకులు అంతలోనే చెరువులో మునిగి మరణించారు. వివరాలిలా ఉన్నాయి. స్నేహితులతో కలిసి ఆనందంగా హోలీ వేడుకలలో పాల్గొన్న ఇద్దరు యువకులు అనంతరం సరదాగా ఈత కొట్టేందుకు సురారంలోని విశ్వకర్మ కాలనీ సమీపంలో ఉన్న పంతులు చెరువులో దిగి ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించారు. మృతులను సాగర్, అభిషేక్ గా గుర్తించారు. వీరి వయస్సు 17 ఏళ్లు. చెరువు లోతు అంచనా వేయకపోవడం, ఈత రాకపోవడం వల్ల లోతైన ప్రాంతానికి వెళ్లి వీరిరువురూ మునిగిపోయారు. వెంటనే స్థానికులు చెరువులో దిగా వారి కోసం గాలించినా ఫలితం లేకపోయింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గజఈతగాళ్ల సహాయంలో మూడు గంటల పాటు శ్రమించి ఇరువురి మృతదేహాలనూ చెరువు నుంచి బయటకు తీశారు. వీరిరువురి మృతితో సురారంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.

Publish Date: Mar 3, 2026 5:55PM

political-news-img

ఉగాది తరువాత ఏపీ కేబినెట్ విస్తరణ?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తన కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసేశారు. ఉగాది తరువాత ఏక్షణంలోనైనా కేబినెట్ ఎక్స్ పాన్షన్ ఉంటుందా అంటే తెలుగుదేశం వర్గాల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది. కేవలం విస్తరణకే పరిమితం కాకుండా కేబినెట్ లో మార్పులూ, చేర్పులతో పూర్తి స్థాయి ప్రక్షాళన జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని దేశం వర్గాలు అంటున్నాయి. మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీల నుంచి కూడా కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు ఆయా పార్టీలతో చర్చలు జరపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఆయన కొందరు మంత్రుల పనితీరును విమర్శించిన సందర్భాలను ఇందుకు ఉదాహరణగా తెలుగుదేశం వర్గాలు ఉటంకిస్తున్నాయి. మంత్రుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి పని తీరు సంతృప్తికరంగా లేని మంత్రులకు ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత మంత్రివర్గ ప్రక్షాళనపై చంద్రబాబు దృష్టి కేంద్రీకరించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు.

Publish Date: Mar 3, 2026 5:38PM

political-news-img

ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ దాడి

మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇజ్రాయెల్ దళాలు నేరుగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని అధ్యక్ష భవనంపై దాడి జరిపినట్లు సమాచారం. అధ్యక్ష భవనం పరిసరాలతో పాటు ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యాలయం, కీలక మిలిటరీ శిక్షణ కేంద్రాలపై కూడా క్షిపణి దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ మెరుపు దాడులతో టెహ్రాన్ నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కచ్చితమైన నిఘా సమాచారం ఆధారంగానే ప్రభుత్వ లీడర్‌షిప్ కాంపౌండ్, మిలిటరీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లపై దాడులు చేపట్టామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఒక ప్రకటనలో పేర్కొంది. లక్ష్యిత ప్రాంతాల్లో ఉగ్ర మౌలిక వసతులు, వ్యూహాత్మక సైనిక కేంద్రాలు ఉన్నాయని తెలిపింది. ఈ దాడులపై ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తమ సార్వభౌమాధికారంపై దాడిగా అభివర్ణిస్తూ ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించింది. అంతర్జాతీయ వేదికలపై కూడా ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Publish Date: Mar 3, 2026 5:09PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img