వచ్చే నెలలో నామినేటేడ్ పదవుల భర్తీ ?
Publish Date:Dec 10, 2012
Advertisement
రాష్ట్రంలో నామినేటేడ్ పదవులు జనవరి లోగా భర్తీ చేస్తామని ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. అనేక సంవత్సరాల నుండి ఈ పదవుల భర్తీ వ్యవహారం వాయిదా పడుతూ వస్తోంది. వాస్తవానికి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య మంత్రి అయినప్పటినుండి ఈ వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. ముఖ్య మంత్రి, పిసిసి అధ్యక్షుడు ఒక అవగాహనకు వస్తే తప్ప వీటి భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేమని పార్టీ అధిష్టానం చెపుతూ వచ్చింది. ఈ విషయంలో ఈ ఇరువురు నేతలు అధిష్టానానికి చెరో జాబితా ఇచ్చి రావడమే అసలు సమస్యకు కారణం. అధికార బాషా సంఘం అధ్యక్ష పదవి, 20 సూత్రాల అమలు కమిటి అధ్యక్ష పదవులు తప్ప, మిగిలిన పదవులను ప్రభుత్వం ఇంత వరకూ భర్తీ చేయలేదు.ఈ పదవులను వెంటనే భర్తీ చేయాలని, లేదంటే పార్టీలో గందరగోళం నెలకొంటుందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ అజాద్ రాష్ట్ర నేతలకు సూచించి చాలా కాలం అయింది. ఇదే అభిప్రాయాన్ని పార్టీ సీనియర్ నేతలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో వచ్చిన ముఖ్య మంత్రి ప్రకటన పార్టీ వర్గాల్లో ఆశలను రేపుతోంది. వీటిని భర్తీ చేయకుండా, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపకుండా ఉంటే, పార్టీ నేతల్లో గందరగోళం నెలకొంటుందని కొంత మంది నాయకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ పార్టీలోకి వలసలను ఆపాలంటే, వెంటనే వీటి భర్తీ చేయాలని వారంటున్నారు. ఇక కిరణ్, బొత్స వీటి విషయంలో ఒక అవగాహనకు రావాల్సి ఉంటుంది.
http://www.teluguone.com/news/content/-nominated-posts-andhra-pradesh-23-19664.html
58 సంవత్సరాల వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్
పెంపుడు కుక్క యజమానిని కాల్చింది అంటే ఏదో ఫన్ని వీడియో అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే ఫన్ని వీడియోలలో ఎక్కువగా అలాంటి సన్నివేశాలు చూసి నవ్వుకుంటాం. నిజజీవితంలో కూడా ఇలాంటి సంఘటన జరిగిందని తెలిసి ఆశ్చర్యపడుతున్నారు.
ఢిల్లీ లో గత నెల 16 వ తేదీన జరిగిన పారా మెడికల్ స్టూడెంట్ ఫై జరిగిన అత్యాచారంలో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.
ఓ హత్య కేసులో నిందితునిగా ఉన్న గుంటూరు జిల్లా గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు బెయిల్ ప్రయత్నాలకు పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గండి కొట్టారు. కాంగ్రెస్ నాయకుడు ఉన్నం నరేంద్ర హత్య కేసులో యరపతినేని మూడవ నిందితునిగా ఉన్న విషయం తెలిసిందే.
గత నెల 28 న ఢిల్లీ లో తెలంగాణాఫై జరిగిన అఖిల పక్ష సమావేశంలో తెలంగాణా అనుకూల వైఖరి తీసుకొని ఆ ప్రాంతంలో ఎలాగో గట్టేక్కామని తెలుగు దేశం పార్టీ భావిస్తున్న సమయంలో ఆ పార్టీకి చెందిన ఆంధ్రా ప్రాంత నేతల నుండి పార్టీకి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇంతవరకు చంద్రబాబు ‘రెండుకళ్ళ’ సిద్దాంతంతో తెలంగాణా ప్రజలను మోసంచేస్తున్నాడని నిందించిన తెరాస, మొన్నజరిగిన అఖిలపక్షసమావేశంలో తెలుగుదేశంపార్టీ తెలంగాణాకి అనుకూల వైఖరిని ప్రకటించిన తరువాత, ఆపార్టీని మెచ్చుకోలేక, వ్యతిరేకించనూ లేక తెరాస ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోంది.
అసలే పోర్న్ స్టార్..ఇక జిస్మ్ల్ చిత్రంలో తన అందాలతో యువతను మత్తెక్కించి చిత్తుచేసింది. అలాంటి పోర్న్ స్టార్ డిసెంబరు 31న ఓ వేదిక మీద డాన్స్ చేయాలంటే మాటలా. తన ఫాలోయింగ్ ను బట్టి తను కూడా ఉంటుంది. అందం ఉన్నప్పుడు చూపిస్తేనే ఎవరయినా చూస్తారు.
అమెరికాకు చెందిన యువతి ఒలీవియా కల్ఫో మిస్ యూనివర్స్-2012గా ఎంపికయ్యారు. ఫిలిప్పిన్స్, వెనిజులాకు చెందిన యువతులు మిస్ యూనివర్స్ పోటీల్లో రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. భారత్కు చెందిన అందాల సుందరి శిల్పాసింగ్ టాప్-16వరకు వచ్చి నిలిచిపోయారు.
ఈ నెల 28 న ఢిల్లీ లో జరిగే అఖిల పక్ష సమావేశంలో తెలంగాణా కు వ్యతిరేకంగా మాట్లాడితే, తెలుగు దేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణా లో చేస్తున్న పాదయాత్రలు కాస్తా పరుగు యాత్రలుగా మారతాయని తెలంగాణా రాష్ట్ర సమితి ఎంఎల్ఎ కే. తారక రామా రావు హెచ్చరించారు.
అగ్రరాజ్యం అమెరికాలో ఉన్మాదుల కాల్పుల పర్వం కొనసాగుతూనే ఉంది. అమాయకుల ప్రాణాలకు అక్కడ విలువ లేదని వరుస సంఘటనలు రుజువు చేస్తున్నాయి.
మాజీ ఎం ఎల్ సి కాసాని జ్ఞానేశ్వర్ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు.
ఇబ్రహీంపట్నంలో ఓ యువకుడు తనను ప్రేమించడం లేదని ఓ విద్యార్ధిని గొంతు కోసి చంపేశాడు. ఇబ్రహీంపట్నం కు చెందిన బాలరాజ్, భాగ్యలతల మొదటి కుమార్తె నిఖిత బికాం చదువుతూ, సిఏ కోచింగ్ తీసుకొంటోంది. బుధవారం సాయంత్రం రాఘవేందర్ ఆమె ఇంట్లోకి వచ్చి గొంతు కోసి చంపాడు.
నా తండ్రి విగ్రహాన్ని పార్లమెంటులో పెట్టి ఒక్కదాన్నే క్రెడిట్ కొట్టేయాలన్న ఆలోచన నాకు లేదు. నా తమ్ముడు బాలకృష్ణ అన్న మాటలు నాకు చాలా బాధకలిగించాయి. ఎన్టీఆర్ విగ్రహం అందరం కలిసి ఇద్దామని నా ఇంటికి వచ్చింది నిజమే. అయితే కుటుంబ సభ్యులు రాసిన లేఖ మీద సంతకం చేయాలని నన్ను అడగలేదు.





