Publish Date:Nov 14, 2024
గత కొన్నేళ్ళుగా నోటికొచ్చిన చెత్తవాగుడు వాగుతూ అసహ్యానికి, అసభ్యతకి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న వైసీపీ నాయకురాలు శ్రీరెడ్డికి ఇప్పుడు జ్ణానోదయం అయ్యింది. వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అయితే ఆమె వైసీపీకి గుడ్ బై చెబుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణికి ఓ లేఖ రాశారు. ఆ లేఖలో అందరికీ క్షమాపణలు చెప్పేశారు. జగన్ తో మొదలు పెట్టి ఆయన సతీమణి భారతి నుంచి మంత్రులు లోకేష్, అనితలకు కూడా క్షమాపణలు చెప్పారు. షర్మిలనూ, వైఎస్ సునీతనూ కూడా క్షమించమని వేడుకున్నారు.
ఇకపై ఎలాంటి అసభ్య పోస్టులూ పెట్టనని దేవుడి మీద ప్రమాణం చేసి మరీ చెప్పారు. అయితే అసభ్యం, అశ్లీలం, అసహ్యం ఈ మూడు అంశాల మేలు కలయిక అన్నట్లుగా గత కొన్నేళ్లుగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తగా ఆమె చేసిన దూషణలు కేవలం క్షమాపణ సరిపెట్టేయడం అసాధ్యం. కేవలంమహిళ అన్న కారణంగా ఎవర్నయినా ఎంత మాటయినా అనేయచ్చు అన్నట్లుగా వ్యవహరిం చిన శ్రీరెడ్డి గత కొన్నేళ్లుగా చేసింది తన బూతు పురాణంతో జగన్ వ్యతిరేకులను దూషించడమే. శ్రీరెడ్డి సామాజిక మాధ్యమం వేదికగా ఎంత వల్గర్ గా మాట్లాడారో తెలియంది కాదు. గత ఐదేళ్ళుగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నాయకులను చెప్పడానికి కూడా వీల్లేని భాషలో తిట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి , హోంమంత్రిపై దూషణల పర్వం కొనసాగించారు. ఇన్నాళ్ళకు పాపం పండింది. అరెస్టు తప్పదని అర్థం కావడంతో శ్రీరెడ్డి ఆడపిల్లని కనికరించండంటూ క్షమాపణలు చెబుతున్నారు.
అయితే తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం ఆ క్షమాపణలను అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. ఆ లేఖ ఆధారంగా తెలుగుదేశం మహిళా కార్యకర్తలు ఆమెపై మరో ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డి ఎవరెవరికి వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బూతులు తిట్టారో ఆ పేర్లన్నీ ఆమె రాసిన లేఖలోనే ఉన్నాయి. దానినే పేర్కొంటూ తాజాగా మరో ఫిర్యాదు దాఖలైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/srireddy-letter-say-goodbte-to-ycp-25-188354.html
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.
రాష్ట్రంలో ఎన్నికల అనంతర పరిణామాలు, జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి.
ఆయనను బీజేపీ హైకమాండ్ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచీ పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్న అన్నామలై సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నారంటూ, గత కొంత కాలంగా వార్తలు వినవస్తున్నాయి.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బెంగళూరు నగరాభివృద్ధి శాఖ తనకు కేటాయించకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. మీడియా ఎదుటే ఆయన తన రాజీనామా లేఖపై సంతకం చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.