శ్రీలక్ష్మికి సుప్రీం షాక్
Publish Date:Apr 2, 2012
Advertisement
హైదరాబాద్: మాజీ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయ్యింది. బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె దాఖలు చేసుకున్న పిటీషన్ ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. బెయిల్ పిటిషన్పై ట్రయిల్ కోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు శ్రీలక్ష్మికి సూచించింది. ఇప్పటికే పలుమార్లు శ్రీలక్ష్మి బెయిల్ పిటీషన్లను కోర్టు తిరస్కరించింది. నాంపల్లి కోర్టులో శ్రీలక్ష్మి పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇదిలావుంటే... అక్రమ మైనింగ్ కేసుతోపాటు ఆమెను జగన్ ఆస్తుల కేసులోనూ సీబీఐ విచారిస్తున్నట్లు సమాచారం. కాగ్ నివేదికలో పెద్ద ఎత్తున భూ పందేరం జరిగిందంటూ వివరాలు బయటికి రావడంతో సీబీఐ ఇపుడు వాటిని ఆధారంగా చేసుకుని తీగ లాగుతున్నట్లు సమాచారం.
కాగా, వైఎస్ జగన్ ఆస్తుల కేసులో ఆడిటర్ విజయ సాయిరెడ్డి సోమవారం నాంపల్లి ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ చార్జ్షీట్లో తనపై తప్పుడు అభియోగాలు మోపిందని, తాను ఎలాంటి నేరాలకు పాల్పడలేదని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. సిబిఐ ఉహించుకుని తనపై అరోపణలు చేస్తుందని, ఎమ్మెల్యే శంకర్రావు వేసిన పిటిషన్ పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే వేశారని, ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేశారని విజయసాయిరెడ్డి కోర్టుకు తెలిపారు. దివంగత నేత వైఎస్ఆర్ వద్ద తాను ఆడిటర్గా విధులు నిర్వహించానని ఆయన మరణానంతరం ఆయన కుమారుడు జగన్ వద్ద ఆడిటర్గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జగన్తో కలిసి క్విడ్ ప్రో కోకు పాల్పడ్డట్లుగా సిబిఐ పేర్కొన్నదంతా నిరాధారమని ప్రత్యేక కోర్టుకు తెలిపారు. బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల నాలుగో తేదీకి వాయిదా వేసింది.
http://www.teluguone.com/news/content/srilakshmi-24-13093.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





