సోంపేటపై ఆశలు వదులుకోని నాగార్జున కన్ ష్ట్రక్షన్స్
Publish Date:Apr 2, 2012
Advertisement
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని ప్రాణాలు బలైనా సోంపేటలో ఏదో ఒకనాడు ధర్మన్ విద్యుత్ కేంద్రం నిర్మించాలనే పట్టుదలతో నాగార్జున కన్ ష్ట్రక్షన్స్ కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళంజిల్లా గొల్లగండి, సోంపేట మధ్య ప్రాంతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2008 ధర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు 9.72 ఎకరాలను కారు చౌకగా నాగార్జున కన్ ష్ట్రక్షన్స్ కంపెనీకి అప్పగించింది. దేనీ వ్యతిరేకంగా రైతులు చారిత్రాత్మక పోరాటం జరిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు రైతులు కూడా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది రైతులు గాయపడ్డారు. ఇంత జరిగినా ప్రభుత్వం నాగార్జున కన్ ష్ట్రాక్షన్స్ కి ఇచ్చిన భూమిని తిరిగి తీసుకోలేదు. నాగార్జున కన్ ష్ట్రక్షన్స్ కూడా తన ప్రయత్నాలను మానుకోలేదు. ఇక్కడ విద్యుత్ ప్లాంట్ నెలకొల్పితే తమప్రాంతం శ్మాశానంగా మారుతుందని స్థానికులు అంటున్నారు. అంతేకాక 32 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న కొబ్బరి తోటలకు కూడా ఈ థర్మల్ ప్లాంట్ వల్ల ముప్పు ఏర్పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ ప్రాంతంలో గడ్డికూడా మొలవదంటూ రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొంది. కానీ ఇక్కడ 20 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. మూడు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. అరుదైన 118 రకాల పక్షులు ఇక్కడ నివసిస్తున్నాయి. 36 గ్రామాల ప్రజలు ఇక్కడ దొరికే మత్య్ససంపదపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇంతమందికి ఉపాధినిస్తున్న ఈ ప్రాంతంలో గడ్డి కూడా మొలవదని రెవెన్యూ యంత్రాంగం నివేదిక ఇవ్వడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కాగ్ కూడా ఈ భూ కేటాయింపులను తప్పుపట్టింది. కేటాయింపులను రద్దు చేయాలని సిఫార్సు చేసింది. అయితే ఈ సిఫారస్సులను ప్రభుత్వంగాని, నాగార్జున కన్ ష్ట్రక్షన్ కాని పట్టించుకునే సూచనలు కనిపించడం లేదు.
http://www.teluguone.com/news/content/srikakulam-district-sompeta-24-13075.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





